News January 29, 2025
ఉదయం 8 గంటలకే 4 కోట్ల మంది స్నానాలు: యోగి

నిన్న 5 కోట్లు, నేటి ఉదయం 8గం.కే 4 కోట్ల మంది పవిత్ర స్నానాలు ఆచరించారని యోగి తెలిపారు. మౌని అమావాస్య రోజు త్రివేణీ సంగమం వద్ద స్నానం చేయడం పుణ్యప్రదం కావడంతో భక్తులు అధిక సంఖ్యలో వచ్చారని పేర్కొన్నారు. వృద్ధులు, పిల్లలు, ఆరోగ్య సమస్యలు ఉన్నవారు గంగా ఘాట్లలో స్నానాలు చేయాలని సూచించారు. తొక్కిసలాటలో కొందరికి తీవ్ర గాయాలయ్యాయన్నారు. వదంతులను నమ్మవద్దని తెలిపారు.
Similar News
News October 15, 2025
గూగుల్ డేటా సెంటర్కు పోల’వరం’!

విశాఖలో ఏర్పాటు చేయబోయే గూగుల్ డేటా సెంటర్కు భారీ స్థాయిలో నీరు అవసరమని నిపుణులు చెబుతున్నారు. ఏడాదికి 1 టీఎంసీ జలాలు అవసరం అవుతాయని అంటున్నారు. అయితే పోలవరం లెఫ్ట్ మెయిన్ కాలువ ద్వారా విశాఖకు ఏడాదికి 23.44 TMCల నీరు సరఫరా కానుంది. ఆ ప్రాజెక్టు 2028 నాటికి పూర్తి కానుంది. దీనివల్ల నీటి సమస్య తీరే ఛాన్స్ ఉంది. ఇక గ్రీన్ హైడ్రోజన్, సోలార్, విండ్ పవర్.. డేటా సెంటర్ విద్యుత్ అవసరాలను తీర్చనున్నాయి.
News October 15, 2025
ఢిల్లీకి సంజూ? KKRకు కేఎల్ రాహుల్?

సంజూ శాంసన్ను దక్కించుకునేందుకు ఢిల్లీ క్యాపిటల్స్ ఆసక్తిగా ఉన్నట్లు జాతీయ మీడియా తెలిపింది. అక్షర్ స్థానంలో శాంసన్కు ఆ బాధ్యతలు అప్పగించాలని భావిస్తున్నట్లు సమాచారం. సంజూకు బదులు ఏ ప్లేయర్ను RRకు ట్రేడ్ చేయాలనే దానిపై సమాలోచనలు జరుపుతున్నట్లు టాక్. ఇక ఢిల్లీ స్టార్ ప్లేయర్ కేఎల్ రాహుల్ కోసం KKR ఇంట్రెస్ట్ చూపిస్తున్నట్లు సమాచారం. ఆయనకు కెప్టెన్సీ ఆఫర్ చేసినట్లు తెలుస్తోంది.
News October 15, 2025
సిరి సంపదలకు పునాది ‘వాస్తు’

వాస్తు బాగున్న ఇంట్లో నివసిస్తే వారికి సిరిసంపదలకు లోటుండదని వాస్తు నిపుణులు కృష్ణాదిశేషు సూచిస్తున్నారు. ‘మంచి వాస్తు వల్ల ఆరోగ్యం మెరుగుపడుతుంది. ప్రభావవంతమైన ఆలోచనలు వస్తాయి. అవి అవకాశాలను సృష్టిస్తాయి. తద్వారా ఆదాయం పెరుగుతుంది. దీంతో మన జీవితంలో సౌకర్యాలు, సదుపాయాలు ఏర్పడతాయి. ఇవే అంతిమంగా మనకు ఆనందాన్ని, సంతృప్తిని అందిస్తాయి. వాస్తే మన సౌభాగ్యానికి తొలి మెట్టు’ అని చెబుతున్నారు. <<-se>>#Vasthu<<>>