News February 2, 2025
40 మంది బాల కార్మికులకు విముక్తి: భద్రాద్రి ఎస్పీ

బాల కార్మిక వ్యవస్థను నిర్మూలించడంలో భాగంగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రతిష్టాత్మకంగా ఆపరేషన్ స్మైల్ -XI కార్యక్రమాన్ని చేపట్టిందని భద్రాద్రి ఎస్పీ రోహిత్ రాజు తెలిపారు. జిల్లా వ్యాప్తంగా 40 మంది బాల కార్మికులను గుర్తించి వారి తల్లిదండ్రుల వద్దకు చేర్చామని పేర్కొన్నారు. జిల్లా వ్యాప్తంగా ఆపరేషన్ స్మైల్ కార్యక్రమాన్ని అన్ని శాఖల అధికారుల సమన్వయంతో విజయవంతంగా నిర్వహించినట్లు ఎస్పీ వెల్లడించారు.
Similar News
News November 22, 2025
NRPT: డిజిటల్ అభ్యాసం కోసం QR కోడ్ గోడ పత్రాలు

పదో తరగతి విద్యార్థుల ప్రగతికి తోడ్పడే ప్రాజెక్ట్ శత కార్యక్రమం కింద రూపొందించిన QR కోడ్ గోడ పత్రాలను రాష్ట్ర మంత్రి వాకిటి శ్రీహరి, జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్ కలిసి విడుదల చేశారు. “చదువుల పండగ – కలలు కనేద్దాం, నేర్చుకుందాం, సాధిద్దాం!” అనే నినాదంతో జిల్లా విద్యా శాఖ వీటిని తయారు చేసింది. ఈ పత్రాల ద్వారా విద్యార్థులు మెరుగైన డిజిటల్ అభ్యాస వనరులను పొందుతారని వారు ఆశాభావం వ్యక్తం చేశారు.
News November 22, 2025
వరంగల్ DCC అధ్యక్షుడిగా మహమ్మద్ ఆయూబ్

వరంగల్ జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడిగా మహమ్మద్ ఆయూబ్ నియమితులయ్యారు. ఈ మేరకు ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీ జనరల్ సెక్రెటరీ కేసీ వేణుగోపాల్ శనివారం సాయంత్రం ఉత్తర్వులు జారీ చేశారు. వరంగల్ నగరానికి చెందిన ఆయూబ్ గతంలో జిల్లా మైనార్టీ అధ్యక్షుడిగా పనిచేశారు. పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డికి సన్నిహితుడిగా గెలుస్తోంది. దీనికి తోడు ఈసారి మైనార్టీ వర్గానికి అధ్యక్ష పదవి దక్కింది.
News November 22, 2025
జగిత్యాల జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు ఎవరంటే..?

జగిత్యాల జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా గాజేంగి నందయ్యను నియమిస్తున్నట్లు ఏఐసీసీ (AICC) జనరల్ సెక్రటరీ కేసీ వేణుగోపాల్ ప్రకటించారు. కల్వకుంట్ల సుజీత్ రావు, జువ్వాడి నర్సింగ రావు కూడా పోటీలో ఉన్నప్పటికీ.. అధిష్ఠానం గాజేంగి నందయ్య వైపు మొగ్గు చూపింది. దీంతో పలువురు ఆయనకు శుభాకాంక్షలు తెలుపుతున్నారు.


