News December 10, 2024
కుంభమేళాకు 40 కోట్ల మంది భక్తులు!

Jan 13 నుంచి Feb 26 వరకు జరగనున్న మహా కుంభమేళా- 2025కు ప్రపంచం నలుమూలల నుంచి 40 కోట్ల మంది ప్రజలు తరలివచ్చే అవకాశం ఉందని UP ప్రభుత్వం అంచనా వేస్తోంది. భక్తుల సంఖ్యను కచ్చితత్వంతో నిర్ధారించేందుకు AI కెమెరాలను ఉపయోగించనున్నారు. జనసమూహం నిర్వహణలో కొత్త మైలురాయిని సృష్టించడం సహా ఇలాంటి స్మారక కార్యక్రమాల్లో ప్రపంచ స్థాయిలో ఆదర్శంగా నిలవాలన్న లక్ష్యంతో ఏర్పాట్లు చేస్తోంది.
Similar News
News October 16, 2025
474 ఇంజినీరింగ్ పోస్టులు.. అప్లైకి ఇవాళే లాస్ట్ డేట్

UPSC 474 ఇంజినీరింగ్ సర్వీసెస్ ఉద్యోగాలకు అప్లై చేయడానికి ఇవాళే ఆఖరు తేదీ. పోస్టును బట్టి డిప్లొమా/ఇంజినీరింగ్ (సివిల్, మెకానికల్, ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్), MSc చేసిన వారు అప్లై చేసుకోవచ్చు. ఆన్లైన్ పరీక్ష, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక ఉంటుంది. దరఖాస్తు ఫీజు రూ.200, మహిళలు, SC,ST, PwBDలకు మినహాయింపు ఉంది. వెబ్సైట్: https://upsconline.nic.in/
News October 16, 2025
వంటింటి చిట్కాలు

* పసుపు, కారం, కరివేపాకు పొడిలాంటివి నిల్వ చేసేటప్పుడు చిటికెడు ఇంగువ కలిపితే ఏడాదిపాటు నిల్వ ఉంటాయి.
* బ్రెడ్ ప్యాకెట్లో బంగాళాదుంప ముక్కలు ఉంచితే ఆ బ్రెడ్ తొందరగా పాడవదు.
* యాలకులు ఫైన్ పౌడర్లా రావాలంటే కొద్దిగా షుగర్ వేసి గ్రైండ్ చేసుకోవాలి.
* పూరీలు తెల్లగా ఉండాలంటే నూనెలో రెండు జామాకులు వేసి వేయించాలి.
* పకోడీ, జంతికలు చేసేటప్పుడు పిండిలో కొద్దిగా పాలు పోసి కలిపితే కరకరలాడతాయి.
News October 16, 2025
BREAKING: ఏపీకి చేరుకున్న ప్రధాని మోదీ

ప్రధాని మోదీ కర్నూలు జిల్లా ఓర్వకల్లు ఎయిర్పోర్టుకు చేరుకున్నారు. ఢిల్లీ నుంచి ప్రత్యేక విమానంలో వచ్చిన ఆయనకు గవర్నర్ అబ్దుల్ నజీర్, సీఎం చంద్రబాబు ఘన స్వాగతం పలికారు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేశ్, రాష్ట్ర బీజేపీ చీఫ్ మాధవ్ సహా పలువురు మోదీకి పుష్పగుచ్ఛాలు అందజేసి వెల్కమ్ చెప్పారు. ప్రధాని అక్కడి నుంచి ఆర్మీ హెలికాప్టర్లో శ్రీశైలానికి బయల్దేరనున్నారు.