News September 17, 2024
JK ఎన్నికల పోటీలో 40% ఇండిపెండెంట్లు.. BJP వ్యూహమా!

జమ్మూకశ్మీర్ ఎన్నికల్లో ఏకంగా 365 మంది ఇండిపెండెంట్లు బరిలోకి దిగారు. 90 స్థానాల్లో మొత్తం 908 అభ్యర్థులు పోటీ చేస్తుండగా అందులో స్వతంత్రులే 40% ఉన్నారు. ప్రతి సెగ్మెంట్లో డివిజన్ల వారీగా కశ్మీర్లో ఐదుగురు, జమ్మూలో 2.93% పోటీలో ఉన్నారు. ఓట్లను చీల్చి గెలిచేందుకు BJP వీళ్లకు స్పాన్సర్ చేస్తోందని NC, PDP, కాంగ్రెస్ ఆరోపిస్తున్నాయి. 2014 ఎన్నికల్లో 831 మంది పోటీచేయగా అందులో 274 మంది ఇండిపెండెంట్లు.
Similar News
News October 27, 2025
TODAY HEADLINES

* విశాఖకు 790km, కాకినాడకు 780km దూరంలో మొంథా తుఫాన్
* తుఫానుతో ప్రాణ, ఆస్తి నష్టం లేకుండా చర్యలు: CM CBN
* భారీ వర్షాలు.. APలో 20 జిల్లాల్లో స్కూళ్లకు సెలవులు
* ఈనెల 30 నుంచి జూబ్లీహిల్స్ ఉపఎన్నిక ప్రచారంలో CM రేవంత్
* ఇందిరమ్మ ఇళ్ల బిల్లుల చెల్లింపులో మార్పులు: పొంగులేటి
* TGలో NOV 3 నుంచి ప్రైవేట్ కాలేజీల బంద్: ఉన్నత విద్యాసంస్థల సమాఖ్య
News October 27, 2025
రేషన్ షాపుల్లో 20% అధిక నిల్వలు: మనోహర్

AP: తుఫాను నేపథ్యంలో MLS(మండల స్థాయి స్టాక్ కేంద్రాలు), రేషన్ షాపుల్లో 20% అధిక నిల్వలు ఉంచినట్లు మంత్రి మనోహర్ తెలిపారు. తీరప్రాంత జిల్లాల్లో 40% వరకు సరకు తరలింపు పూర్తయిందన్నారు. మరోవైపు ధాన్యం కొనుగోలులో రైతులను మిల్లర్లు ఇబ్బందులకు గురి చేయొద్దన్నారు. 50 వేల టార్పాలిన్లు, ఇతర సామగ్రిని అందుబాటులో ఉంచామని చెప్పారు. ధాన్యం సేకరణ కేంద్రాల్లోని టార్పాలిన్లను రైతులు వాడుకోవచ్చని స్పష్టం చేశారు.
News October 27, 2025
బస్సు ప్రమాదం.. ప్రయాణికులకు RTC గమనిక

కర్నూలులో ట్రావెల్స్ బస్సు ప్రమాదం నేపథ్యంలో TGSRTC ప్రకటన జారీ చేసింది. ‘ప్రయాణికుల క్షేమమే ధ్యేయంగా లహరి, రాజధాని వంటి AC బస్సుల్లో వెనుక అత్యవసర ద్వారం, కిటికీ అద్దాలు పగులగొట్టేందుకు సుత్తెలు, మంటలు ఆర్పే పరికరాలు, డీలక్స్, ఎక్స్ప్రెస్, పల్లె వెలుగు బస్సుల్లో కుడి వైపు, వెనుక భాగంలో అత్యవసర ద్వారం, అగ్నిమాపక యంత్రం అందుబాటులో ఉంటాయి. RTC బస్సుల్లో ప్రయాణం సురక్షితం’ అని ట్వీట్ చేసింది.


