News June 23, 2024
జమ్మూకశ్మీర్లో 40మంది పాక్ ఉగ్రవాదులు?

జమ్మూకశ్మీర్లో 40మంది వరకు పాక్ ఉగ్రవాదులు నక్కినట్లు భద్రతా బలగాలు గుర్తించినట్లు సమాచారం. ప్రధానంగా జమ్మూలోని రాజౌరి, పూంఛ్, కథువా సెక్టార్లలో వీరు ఉన్నట్లు తెలుస్తోంది. చిన్న బృందాలుగా విడిపోయి ఉగ్రవాదాన్ని మళ్లీ బతికించేందుకు ముష్కరులు యత్నిస్తున్నారని ఆర్మీ వర్గాలు పేర్కొన్నాయి. వారిని ఏరివేసేందుకు జల్లెడ పడుతున్నామన్నాయి. ఈ నెల 9 నుంచి జమ్మూకశ్మీర్లో 4 ఉగ్రదాడులు చోటుచేసుకోవడం గమనార్హం.
Similar News
News November 4, 2025
ఓల్డ్ బ్యాంకు అకౌంట్లో డబ్బు ఫ్రీజ్ అయిందా?

మీ కుటుంబసభ్యులు తమ బ్యాంకు అకౌంట్లలో డబ్బు ఉంచి మర్చిపోయారా? పదేళ్ల కంటే ఎక్కువ సమయం కావడంతో అకౌంట్ను ఫ్రీజ్ చేశారా? అలా ఫ్రీజ్ చేసిన డబ్బును RBI తన డిపాజిటర్ ఎడ్యుకేషన్ అండ్ అవేర్నెస్ (DEA) ఫండ్కి ట్రాన్స్ఫర్ చేస్తుంది. వీటిని తిరిగి పొందవచ్చు. udgam.rbi.org.inలో అన్క్లెయిమ్డ్ డిపాజిట్లను తనిఖీ చేయొచ్చు. బ్యాంకుకు వెళ్లి KYC సమర్పించి డబ్బును తిరిగి పొందొచ్చు. SHARE IT
News November 4, 2025
BELలో ఉద్యోగాలు.. అప్లైకి రేపే లాస్ట్ డేట్

భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్(<
News November 4, 2025
అష్టైశ్వర్యాలు అంటే ఏంటి?

పెద్దలు మనల్ని దీవించేటప్పుడు ‘అష్టైశ్వర్య ప్రాప్తిరస్తు’ అని అంటారు. మరి ఆ అష్టైశ్వర్యాలేంటో మీరెప్పుడైనా ఆలోచించారా? ఐశ్వర్యం అంటే సంపద. అష్ట అంటే 8. అందుకే అష్టైశ్వర్యాలంటే డబ్బే అనుకుంటారు. కానీ, కాదు. రాజ్యం, ధనం, ఇల్లాలు, సంతానం, ధైర్యం, ఆత్మస్థైర్యం, విద్య, వినయం.. ఇవే 8 ఐశ్వర్యాలు. మన జీవితం ఆనందంగా ఉండాలంటే కావాల్సినవి ఇవే. డబ్బు కాదు. అందుకే ఇవి కలగాలని పెద్దలు మనల్ని అలా జీవిస్తారు.


