News June 23, 2024
జమ్మూకశ్మీర్లో 40మంది పాక్ ఉగ్రవాదులు?
జమ్మూకశ్మీర్లో 40మంది వరకు పాక్ ఉగ్రవాదులు నక్కినట్లు భద్రతా బలగాలు గుర్తించినట్లు సమాచారం. ప్రధానంగా జమ్మూలోని రాజౌరి, పూంఛ్, కథువా సెక్టార్లలో వీరు ఉన్నట్లు తెలుస్తోంది. చిన్న బృందాలుగా విడిపోయి ఉగ్రవాదాన్ని మళ్లీ బతికించేందుకు ముష్కరులు యత్నిస్తున్నారని ఆర్మీ వర్గాలు పేర్కొన్నాయి. వారిని ఏరివేసేందుకు జల్లెడ పడుతున్నామన్నాయి. ఈ నెల 9 నుంచి జమ్మూకశ్మీర్లో 4 ఉగ్రదాడులు చోటుచేసుకోవడం గమనార్హం.
Similar News
News October 9, 2024
హరియాణాలో ఓవర్ కాన్ఫిడెన్స్ వల్లే ఓడిపోయాం: కాంగ్రెస్ మాజీ ఎంపీ
ఓవర్ కాన్ఫిడెన్స్ వల్లే హరియాణాలో ఓడిపోయామని కర్ణాటక కాంగ్రెస్ మాజీ ఎంపీ డీకే సురేశ్ అంగీకరించారు. ఎన్నికల ప్రక్రియలో పార్టీ అంతర్గత యంత్రాంగం అలసత్వమే కొంప ముంచిందన్నారు. తమ అతిపెద్ద బలహీనత ఇదేనన్నారు. హైకమాండ్ త్వరలోనే దీనిపై సమీక్షిస్తుందని వెల్లడించారు. జమ్మూకశ్మీర్ ప్రజలు NC, కాంగ్రెస్ కూటమికి చక్కని తీర్పునిచ్చారని పేర్కొన్నారు. తమ కూటమి అక్కడ ప్రభుత్వం ఏర్పాటు చేస్తుందన్నారు.
News October 9, 2024
నిర్వాసితులను ఒప్పించాకే బుడమేరు ప్రక్షాళన: పవన్
AP: విజయవాడ పరిధిలో బుడమేరు ప్రక్షాళనను పద్ధతిగా చేపడతామని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తెలిపారు. ముందుగా నిర్వాసితుల్లో అవగాహన పెంచుతామని చెప్పారు. నిర్వాసితులను ఒప్పించాకే బుడమేరు ఆక్రమణలను తొలగిస్తామని పేర్కొన్నారు. వారికి ప్రత్యామ్నాయం చూపిస్తామని హామీనిచ్చారు.
News October 9, 2024
రాష్ట్రంలో పండుగ వాతావరణం లేదు: KTR
TG: రాష్ట్రంలో పండుగ వాతావరణం కనపడటం లేదని KTR అన్నారు. ‘ఆడబిడ్డలకు చీరలు లేవు. రైతులకు రైతుబంధు లేదు. ఆఖరికి బతుకమ్మ ఆడేందుకు డీజేలు కూడా లేవు. ఏ అధికారి తమ ఇంటికి వచ్చినా ఇల్లు కూల్చేస్తారని ప్రజలు భయపడుతున్నారు. ప్రజల సొమ్ము దోచుకునేందుకే మూసీ ప్రక్షాళన అంటున్నారు. ఎన్నికల సమయంలో రేవంత్ హామీ ఇచ్చిన ‘మహాలక్ష్మీ’ పథకం ఏమైంది? వీటిపై అందరూ ప్రభుత్వాన్ని ప్రశ్నించాలి’ అని ప్రజలకు పిలుపునిచ్చారు.