News June 4, 2024
చెదిరిన ‘400’ కల: సెన్సెక్స్ 4100 పాయింట్ల పతనం

‘ఆబ్కీ బార్ 400పార్’ కల చెదరడంతో స్టాక్ మార్కెట్లు రక్తమోడుతున్నాయి. దాంతో సూచీలు ఈ దశాబ్దంలోనే అతి ఘోర పతనం చవిచూస్తున్నాయి. బీఎస్ఈ సెన్సెక్స్ ఇంట్రాడేలో 4100 పాయింట్ల మేర కుంగింది. ప్రస్తుతం 3283 పాయింట్ల నష్టంతో 73,191, నిఫ్టీ 1063 తగ్గి 22,200 వద్ద ఉన్నాయి. ఇన్వెస్టర్లు పానిక్ సెల్లింగుకు పాల్పడుతున్నారు. ఎగ్జిట్ పోల్స్ అంచనాలతో మార్కెట్ ఎంత పెరిగిందో రిజల్టుతో అంతకన్నా ఎక్కువే పడింది.
Similar News
News December 6, 2025
‘RO-KO’ని దాటేసిన వైభవ్ సూర్యవంశీ

వైభవ్ సూర్యవంశీ మరోసారి వార్తల్లో నిలిచారు. 2025లో మోస్ట్ సెర్చ్డ్ క్రికెటర్ ఇన్ ఇండియా లిస్ట్లో టాప్ ప్లేస్ సాధించారు. ఐపీఎల్తో ఈ యంగ్స్టర్ టాక్ ఆఫ్ ది టౌన్గా మారారు. రెండో స్థానంలో ప్రియాన్ష్ ఆర్య, మూడో స్థానంలో అభిషేక్ శర్మ, షేక్ రషీద్ నాలుగో స్థానం, జెమీమా రోడ్రిగ్స్ ఐదో స్థానంలో నిలిచారు. IPL 2025, బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ బజ్ ఉన్నా రోహిత్, కోహ్లీ ఈ లిస్టులో పేర్లు సాధించలేకపోయారు.
News December 6, 2025
‘X’కు $140 మిలియన్ డాలర్ల ఫైన్

యూరోపియన్ యూనియన్ ‘X’ అధినేత ఎలాన్ మస్క్కు షాకిచ్చింది. తమ దేశంలోని ఆన్లైన్ కంటెంట్ రూల్స్ను మస్క్ ప్లాట్ఫామ్ ఉల్లంఘించిందని EU టెక్ రెగ్యులేటర్స్ ఆరోపించింది. అందుకు 120($140 మిలియన్స్) మిలియన్ యూరోస్ ఫైన్ విధించింది. దీనిని అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియో ఖండించారు. “ఇది కేవలం ‘X’ మీదే కాదు అమెరికా టెక్ ప్లాట్ఫామ్స్, US పౌరులపై విదేశీ ప్రభుత్వాల దాడి” అని ట్వీట్ చేశారు.
News December 6, 2025
డిసెంబర్ 6: చరిత్రలో ఈ రోజు

1935: సినీ నటి సావిత్రి జననం
1985: భారత క్రికెటర్ ఆర్.పి.సింగ్ జననం
1988: భారత క్రికెటర్ రవీంద్ర జడేజా జననం
1993: భారత క్రికెటర్ జస్ప్రీత్ బుమ్రా జననం
1991: భారత క్రికెటర్ కరుణ్ నాయర్ జననం
1994: భారత క్రికెటర్ శ్రేయస్ అయ్యర్ జననం
1956: భారత రాజ్యాంగ నిర్మాత బి.ఆర్.అంబేడ్కర్ మరణం


