News April 11, 2025

NPCILలో 400 పోస్టులు.. నోటిఫికేషన్ విడుదల

image

ముంబైలోని న్యూక్లియర్ పవర్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్(NPCIL)లో 400 ఎగ్జిక్యూటివ్ ట్రైనీ పోస్టులకు నోటిఫికేషన్ విడుదలైంది. ఈ నెల 30లోగా అప్లై చేసుకోవాలి. బీటెక్ పూర్తిచేసిన వారు అర్హులు. కెమికల్, ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్, సివిల్ విభాగాల్లో ఉద్యోగాలున్నాయి. గేట్ 2023, 2024, 2025 స్కోర్ ఆధారంగా ఎంపిక చేస్తారు.
వెబ్‌సైట్: npcilcareers.co.in

Similar News

News April 18, 2025

జంక్ ఫుడ్ తినకుండా ఉండలేకపోతున్నారా?

image

కొందరు జంక్ ఫుడ్ కనిపిస్తే చాలు తినేస్తారు. ఇది ఆరోగ్యానికి మంచిది కాదని నిపుణులు చెబుతున్నారు. బ్రేక్ ఫాస్ట్, లంచ్, డిన్నర్ మధ్య గ్యాప్‌లో పండ్లు, డ్రైఫ్రూట్స్ వంటివి తీసుకోవాలి. ఎక్కువ మోతాదులో నీరు తాగాలి. అలాగే డెయిరీ పదార్థాలు, గుడ్లు ఎక్కువగా తిన్నా జంక్ ఫుడ్‌పైకి మనసు వెళ్లదు. యోగా, ధ్యానం, వ్యాయామం చేయాలి. ఇలా చేస్తే జంక్ ఫుడ్ తినాలనే కోరికలు నియంత్రణలో ఉంటాయి.

News April 18, 2025

మోదీ పర్యటన.. ఏర్పాట్ల పర్యవేక్షణకు మంత్రులతో కమిటీ

image

AP: PM మోదీ మే 2న అమరావతికి రానున్న నేపథ్యంలో అధికారులు ఏర్పాట్లు ముమ్మరం చేశారు. దాదాపు 5 లక్షల మంది ప్రజలు కూర్చునేలా సభా ప్రాంగణం కోసం 100 ఎకరాలు, పార్కింగ్ కోసం 250 ఎకరాలను సిద్ధం చేస్తున్నారు. ఏర్పాట్ల పర్యవేక్షణకు ప్రభుత్వం మంత్రులతో కమిటీని నియమించింది. అందులో లోకేశ్, పయ్యావుల, నారాయణ, సత్యకుమార్, నాదెండ్ల, రవీంద్ర ఉన్నారు. నోడల్ అధికారిగా IAS వీరపాండ్యన్‌ను నియమిస్తూ ఉత్తర్వులిచ్చింది.

News April 18, 2025

అతడి ప్రశాంతత వల్ల మాపై ఒత్తిడి తగ్గింది: భువనేశ్వర్

image

RCB కెప్టెన్ రజత్ పాటీదార్ నాయకత్వ బాధ్యతల్ని అద్భుతంగా నిర్వర్తిస్తున్నారని ఆ జట్టు బౌలర్ భువనేశ్వర్ కొనియాడారు. ‘రజత్ చాలా ప్రశాంతంగా ఉంటాడు. ఈ ఫార్మాట్‌లో అలా ఉండటం చాలా కీలకం. కొంతమంది ఒక మ్యాచ్ కోల్పోగానే టెన్షన్ పడిపోతారు. కానీ రజత్ జయాపజయాల్ని సమానంగా తీసుకుంటాడు. ఓడినప్పుడు ఎలా ఉన్నాడో, గెలిచినప్పుడూ అలాగే ఉన్నాడు. అతడి ప్రశాంతత కారణంగా మాపై ఒత్తిడి తగ్గింది’ అని తెలిపారు.

error: Content is protected !!