News May 12, 2024
ఆస్కార్ శతాబ్ది వేడుకలకు రూ.4,000 కోట్లు

సినీ ప్రపంచంలో ప్రఖ్యాత పురస్కారంగా భావించే ‘ఆస్కార్’ శతాబ్ది వేడుకలకు నిర్వాహకులు సన్నాహాలు మొదలుపెట్టారు. 2028లో జరిగే ఈ కార్యక్రమం కోసం 500 మిలియన్ డాలర్లు(దాదాపు రూ.4,000 కోట్లు) సేకరించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ఇప్పటికే 100 మిలియన్ డాలర్లు సమకూర్చుకున్నారు. ఈ వేడుకల్లోనే మరో వందేళ్లు ఎలా నిర్వహించాలనే దానిపై చర్చించనున్నారు. 97వ ఆస్కార్ వేడుకలు వచ్చే ఏడాది మార్చి 2న జరగనున్నాయి.
Similar News
News December 4, 2025
MHBD: తండా ఒక్కటే.. ఓటింగ్ వేరు!

తండా ఒక్కటిగా కలిసి ఉన్నా ఎన్నికల్లో వీరిని రెండు ముక్కలు చేస్తున్నాయి. మహబూబాబాద్ జిల్లా మరిపెడ మండలంలో ఇటుకలగడ్డ తండా రెండు గ్రామ పంచాయతీల పరిధిలో ఉంది. ఇటుకల గడ్డతండాలో ప్రధాన రహదారికి ఓ వైపు ఎలమంచిలితండా గ్రామ పరిధిలో, మరో వైపు గిరిపురం గ్రామ పంచాయతీ పరిధిలో ఉంటుంది. పండగలన్నీ కలిసి చేసినా.. ఎన్నికల పండగలప్పుడు మాత్రం తండావాసులు పంచాయతీ ఎన్నికల వేళ రెండు గుంపులుగా విడిపోయి రాజకీయాలు చేస్తారు.
News December 4, 2025
పంటను బట్టి యూరియా వాడితే మంచిది

మొక్కల ఎదుగుదలకు అవసరమైన నత్రజనిని అందించే యూరియాను పంటను బట్టి ఉపయోగించాలి. వరి పంటకు యూరియాను బురద పదునులో వేయాలి. పెద్ద గుళికల యూరియాను వరి పైరుకు వేస్తే నత్రజని లభ్యత ఎక్కువ రోజులు ఉంటుంది. ఆరుతడి పైర్లకు యూరియాను భూమిపైన కాకుండా మొక్కల దగ్గర గుంత తీసి అందులో వేసి మట్టితో కప్పివేయాలి. ఆరుతడి పంటలకు సన్నగుళికల యూరియా వేస్తే తేమ తక్కువగా ఉన్నా, తొందరగా కరిగి మొక్కకు అందుతుంది.
News December 4, 2025
త్వరలో విశాఖ స్టీల్ ప్లాంట్కు రాహుల్ గాంధీ!

AP: కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ త్వరలో విశాఖ స్టీల్ ప్లాంట్ను సందర్శిస్తారని AICC అధికార ప్రతినిధి సునీల్ అహీరా తెలిపారు. విశాఖ ఉక్కు పరిశ్రమ కోహినూర్ వజ్రం లాంటిదని వ్యాఖ్యానించారు. ఇందిరమ్మ ఇచ్చిన ప్లాంటును బీజేపీ అదానీకి అమ్మేస్తోందని, దాన్ని అడ్డుకుంటామని తెలిపారు. అటు స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ జరగదని కేంద్ర మంత్రులతో పాటు రాష్ట్ర ప్రభుత్వం పలుమార్లు చెప్పిన విషయం తెలిసిందే.


