News February 26, 2025
40,000 ట్యాక్స్ పేయర్లకు దబిడి దిబిడే!

TDC/TCS డిఫాల్టర్లపై ఉక్కుపాదం మోపేందుకు ఆదాయపన్ను శాఖ సిద్ధమైనట్టు తెలిసింది. దేశవ్యాప్తంగా 40,000 ట్యాక్స్ పేయర్లకు నోటీసులు పంపించాలని భావిస్తున్నట్టు సమాచారం. FY22-23, FY23-24లో TDC/TCS కత్తిరించని సంస్థలు, వ్యక్తులను గుర్తించింది. కొన్ని నెలలుగా వీరిపై నిఘా ఉంచింది. త్వరలోనే వీరికి నోటీసులు పంపించి భారీగా జరిమానాలు విధించే అవకాశం ఉందని వార్తలు వస్తున్నాయి.
Similar News
News November 26, 2025
26/11: మానవత్వం చాటుకున్న రతన్ టాటా!

ముంబై 26/11 ఉగ్రదాడుల సమయంలో టాటా గ్రూప్ మాజీ ఛైర్మన్ దివంగత రతన్ టాటా ఆర్మీ అధికారులకు అందించిన సపోర్ట్ను నెటిజన్లు గుర్తుచేసుకుంటున్నారు. ఆయన 3 రోజులు తాజ్ హోటల్ వెలుపలే నిలబడి సహాయక చర్యల్లో భాగమై మానవత్వాన్ని చాటారు. ఉగ్రవాదులను మట్టుపెట్టేందుకు ఆస్తినష్టం జరిగినా పర్లేదని ఆర్మీని ఆయన కోరినట్లు తెలుస్తోంది. ఉద్యోగులు, బాధితుల కుటుంబాలకు ఆయన చికిత్స అందించి ఆర్థికంగా కూడా మద్దతుగా నిలిచారు.
News November 26, 2025
దేశంలో అతిపెద్ద నగరంగా హైదరాబాద్!

హైదరాబాద్ మహానగరాన్ని మరింత విస్తృతపరిచేందుకు తెలంగాణ ప్రభుత్వం సంకల్పించింది. GHMCలో 20 మున్సిపాలిటీలు, 7 కార్పొరేషన్లను విలీనం చేయాలని నిర్ణయించింది. ORR వరకు, అవతలి వైపు ఆనుకుని ఉన్న కొన్ని ప్రాంతాలనూ గ్రేటర్గా పరిగణించనుంది. 1,2 నెలల్లో డివిజన్లు, కార్పొరేషన్ల విభజన పూర్తి కానున్నట్లు తెలుస్తోంది. దీంతో 2,735 చదరపు కి.మీతో దేశంలోనే అతిపెద్ద నగరంగా హైదరాబాద్ అవతరించనుంది.
News November 26, 2025
18 ఏళ్ల యువతను గౌరవిద్దాం: మోదీ

ఓటు హక్కును వినియోగించుకుని ప్రజాస్వామ్యాన్ని బలోపేతం చేయాల్సిన బాధ్యత పౌరులపై ఉందని PM మోదీ చెప్పారు. రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా ఆయన ప్రజలకు బహిరంగ లేఖ రాశారు. ‘18ఏళ్లు నిండి, తొలిసారి ఓటు వినియోగించుకునే యువతను ఏటా NOV 26న విద్యాసంస్థల్లో గౌరవించాలి. విధులు పాటిస్తేనే హక్కులు వస్తాయన్న గాంధీ స్ఫూర్తితో అభివృద్ధి చెందిన వికసిత్ భారత్ వైపు అడుగులు వేయాలి’ అని పేర్కొన్నారు.


