News December 25, 2025

42 మందితో విజయనగరం టీడీపీ పార్లమెంటరీ వర్గం

image

విజయనగరం జిల్లా పార్లమెంటరీ కార్యవర్గాన్ని టీడీపీ ప్రకటించింన సంగతి తెలిసిందే. ఇందులో 42 మందికి స్థానం కల్పించింది. ఇందులో తొమ్మిది మంది చొప్పున ఉపాధ్యక్షులు, కార్యనిర్వాహక కార్యదర్శులు, అధికార ప్రతినిధులను, కార్యదర్శులకు అవకాశమిచ్చింది. మొత్తంగా 13 మంది మహిళలకు స్థానం లభించింది. కాగా నూతన కార్యవర్గంలో బీసీలకు సముచిత ప్రాధాన్యం ఇచ్చారని పార్టీ నేతలు ఆనందం వ్యక్తం చేశారు.

Similar News

News December 27, 2025

జనవరి మొదటివారంలో సోలార్ రూఫ్‌టాప్ పథకం ప్రారంభం: కలెక్టర్

image

జనవరి మొదటివారంలో సోలార్ రూఫ్ టాప్ పథకాన్ని ప్రారంభించాల్సిందిగా కలెక్టర్ రాంసుందర్ రెడ్డి అధికారులను ఆదేశించారు. కలెక్టర్ కార్యాలయంలో అధికారులతో శనివారం సమీక్ష జరిపారు. జిల్లాలో ఈ పథకం అమలును మరింత వేగవంతం చేసి ప్రజలకు విస్తృతంగా చేరేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. అవగాహన కార్యక్రమాలు పెంచి, దరఖాస్తుల ప్రక్రియను సులభతరం చేయాలని, అర్హులైన లబ్ధిదారులకు త్వరితగతిన లాభాలు అందేలా చూడాలన్నారు.

News December 27, 2025

విజయనగరం జిల్లా ప్రజలకు GOOD NEWS

image

జిల్లాలో NTR భరోసా పింఛన్లను జనవరి 1కు బదులు డిసెంబర్ 31న పంపిణీ చేయనున్నట్లు కలెక్టర్ రాంసుందర్ రెడ్డి తెలిపారు. ఉదయం 7 నుంచి గ్రామ, వార్డు సచివాలయ సిబ్బంది లబ్ధిదారుల ఇళ్లకు వెళ్లి పింఛన్లు అందజేస్తారన్నారు. డిసెంబర్ నెలకు సంబంధించి జిల్లాలో 2,71,697 మంది లబ్ధిదారులకు రూ.116.25 కోట్లు విడుదల చేసినట్లు చెప్పారు. ఈ నిధులు 30న బ్యాంకు ఖాతాల్లో జమ చేస్తామని, సిబ్బంది ముందుగానే సిద్ధంగా ఉండాలన్నారు.

News December 27, 2025

మహిళల రక్షణకు 30 మందితో 5 శక్తి టీమ్స్: VZM SP

image

మహిళల రక్షణ కోసం జిల్లాలో 30 మందితో ఐదు ‘శక్తి టీమ్స్’ ఏర్పాటు చేసినట్లు ఎస్పీ ఎ.ఆర్.దామోదర్ శుక్రవారం ఓ ప్రకటనలో తెలిపారు. ఒక్కో బృందానికి ఎస్ఐ నాయకత్వం వహిస్తారని, మఫ్టీలో విధులు నిర్వహిస్తూ వేధింపులపై తక్షణ చర్యలు తీసుకుంటారన్నారు. శక్తి యాప్‌పై అవగాహన, గుడ్ టచ్-బ్యాడ్ టచ్, పోక్సో చట్టాలపై విద్యార్థులకు శిక్షణ ఇస్తారని పేర్కొన్నారు.