News November 18, 2024

11 నెలల్లో గురుకులాల్లో 42 మంది విద్యార్థులు మృతి: హరీశ్ రావు

image

TG: కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక రాష్ట్రంలోని గురుకులాల్లో 42 మంది విద్యార్థులు ఫుడ్ పాయిజన్, ఆత్మహత్యల కారణంగా మరణించారని మాజీ మంత్రి హరీశ్ రావు ట్వీట్ చేశారు. దీనికి సీఎం రేవంత్, ప్రభుత్వమే బాధ్యత వహించి విద్యార్థికి రూ.10 లక్షల చొప్పున పరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు. ఈ మేరకు మరణించిన వారి వివరాలను ఆయన పంచుకున్నారు. వరుస మరణాలు నమోదవుతున్నా ప్రభుత్వం మొద్దు నిద్ర వీడట్లేదని దుయ్యబట్టారు.

Similar News

News November 18, 2025

హైదరాబాద్‌లో మెస్సీ మ్యాచ్.. గ్రౌండ్‌లోకి సీఎం రేవంత్!

image

ఫుట్‌బాల్ స్టార్ లియోనెల్ మెస్సీ త్వరలోనే హైదరాబాద్‌కు రానున్నారు. “GOAT India Tour 2025”లో భాగంగా డిసెంబర్‌లో స్నేహపూర్వక మ్యాచ్ జరిగే అవకాశం ఉందని TPCC చీఫ్ మహేశ్ సంకేతాలిచ్చారు. ఆ మ్యాచ్‌లో సీఎం రేవంత్ రెడ్డి కూడా పాల్గొనవచ్చన్న వార్తలు అభిమానుల్లో ఉత్సాహం పెంచుతున్నాయి. తెలంగాణను క్రీడా హబ్‌గా మార్చడమే ప్రభుత్వ లక్ష్యమని, అథ్లెట్లకు పూర్తిస్థాయి మద్దతు అందిస్తున్నామని మహేశ్ తెలిపారు.

News November 18, 2025

హైదరాబాద్‌లో మెస్సీ మ్యాచ్.. గ్రౌండ్‌లోకి సీఎం రేవంత్!

image

ఫుట్‌బాల్ స్టార్ లియోనెల్ మెస్సీ త్వరలోనే హైదరాబాద్‌కు రానున్నారు. “GOAT India Tour 2025”లో భాగంగా డిసెంబర్‌లో స్నేహపూర్వక మ్యాచ్ జరిగే అవకాశం ఉందని TPCC చీఫ్ మహేశ్ సంకేతాలిచ్చారు. ఆ మ్యాచ్‌లో సీఎం రేవంత్ రెడ్డి కూడా పాల్గొనవచ్చన్న వార్తలు అభిమానుల్లో ఉత్సాహం పెంచుతున్నాయి. తెలంగాణను క్రీడా హబ్‌గా మార్చడమే ప్రభుత్వ లక్ష్యమని, అథ్లెట్లకు పూర్తిస్థాయి మద్దతు అందిస్తున్నామని మహేశ్ తెలిపారు.

News November 18, 2025

ఆవు తొలిచూలు, బర్రె మలిచూలు

image

ఆవు మొదటిసారి(తొలిచూలు) ఈనేటప్పుడు సాధారణంగా ఎక్కువ పాలు ఇవ్వకపోవచ్చు లేదా దూడ బలంగా ఉండకపోవచ్చు. అంటే, ఏదైనా ఒక పని తొలి ప్రయత్నంలో ఆశించినంత మంచి ఫలితాలు రాకపోవచ్చు. అదే బర్రె రెండోసారి(మలిచూలు) లేదా ఆ తర్వాత ఈనేటప్పుడు దూడ ఆరోగ్యంగా ఉండటంతో పాటు పాలు ఎక్కువగా ఇచ్చే అవకాశం ఉంటుంది. అంటే కొన్నిసార్లు తొలి ప్రయత్నం సరిగా లేకున్నా.. మలి ప్రయత్నం మెరుగైన ఫలితాలను ఇస్తుందని ఈ సామెత అర్థం.