News September 26, 2025
42192 మంది మహిళలకు ఆరోగ్య పరీక్షలు : నోడల్ ఆఫీసర్

స్వస్థ నారీ సశక్తి పరివార్ అభియాన్ కార్యక్రమంలో భాగంగా జిల్లాలో ఇప్పటివరకు 490 వైద్య శిబిరాలు నిర్వహించి 42,192 మంది మహిళలకు ఆరోగ్య పరీక్షలను నిర్వహించినట్లు ఆ ప్రోగ్రాం రాష్ట్ర నోడల్ ఆఫీసర్ స్టేఫీ తెలిపారు. వరిగొండ, దామర మడుగులలో జరుగుతున్న వైద్య శిబిరాలను ఆమె ఆకస్మికంగా తనిఖీ చేశారు. మహిళా ఆరోగ్య పరిరక్షణ కోసం ఈకార్యక్రమాన్ని పటిష్టంగా అమలు చేస్తున్నామన్నారు.
Similar News
News September 27, 2025
DSC జాబితాలో అభ్యంతరాలు ఉంటే తెలపండి: DEO

2025 DSC ఎంపిక జాబితాను వెబ్సైట్లో అందుబాటులో ఉంచామని, అభ్యంతరాలు ఉంటే తెలపాలని జిల్లా విద్యాశాఖ అధికారి డాక్టర్ ఆర్ బాలాజీ రావు ఒక ప్రకటనలో తెలిపారు. జాబితాలో అభ్యంతరాలు ఫిర్యాదులు ఉంటే అక్టోబర్ 25వ తేదీల్లోగా జోన్, రాష్ట్ర స్థాయి గ్రీవెన్స్లో తెలియజేయాలని, వాటి పరిష్కారానికి అవకాశం ఉందన్నారు.
News September 27, 2025
నేటి నుంచి ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు

నేటి నుంచి జిల్లాలో ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు జిల్లా జాయింట్ కలెక్టర్ మొగిలి వెంకటేశ్వర్లు ఒక ప్రకటనలో తెలిపారు. సహకార సంఘాల ఆధ్వర్యంలో వరి కోత కోసే ప్రతి గ్రామంలో ఈ కొనుగోలు కేంద్రం ఏర్పాటు చేసినట్లు తెలిపారు. గ్రేడ్ – ఏ పుట్టి రూ. 20,306, సాధారణ రకం పుట్టి రూ. 20,136 ప్రభుత్వ మద్దతు ధరగా ప్రకటించినట్లు తెలిపారు.
News September 26, 2025
బాలకృష్ణా.. నోరు అదుపులో పెట్టుకో : కాకాణి

అభిమానులను కొడుతూ, తిడుతూ ఉన్మాదిలా ప్రవర్తించే బాలకృష్ణ నోరు అదుపులో పెట్టుకోవాలని మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్ది అగ్రహం వ్యక్తం చేశారు. అసెంబ్లీలో మాజీ సీఎం జగన్పై అయన మాట్లాడిన మాటలు వింటుంటే, పిచ్చి మళ్లీ ముదిరిందా లేక మద్యం మత్తులో ఉన్నాడా అనే అనుమానం కల్గుతుందన్నారు. బాలకృష్ణ మాట్లాడినవన్నీ అబద్దాలని చిరంజీవి వివరణ రుజువైందని X లో కాకాణి పోస్ట్ చేశారు.