News July 10, 2025

ఆర్టీసీలో 422 కొత్త బస్సులు

image

TG: ఆర్టీసీ కొత్తగా 422 బస్సులు ప్రవేశపెట్టనుంది. కాలం చెల్లిన బస్సుల స్థానంలో 294 పల్లె వెలుగులు, 88 మెట్రో డీలక్స్‌లు, 23 డీలక్స్‌లు, 17 ఎక్స్‌ప్రెస్‌లను తీసుకురానుంది. ప్రభుత్వం అమలు చేస్తున్న మహాలక్ష్మి పథకంతో బస్సుల్లో ఆక్యుపెన్సీ పెరగడంతో ప్రయాణికులకు రిలీఫ్ ఇచ్చేందుకు RTC ఈ నిర్ణయం తీసుకుంది. 13-15లక్షల కి.మీ. తిరిగిన లేదా 15 ఏళ్ల కాలం దాటిన బస్సులను ఆర్టీసీ పక్కనపెట్టనుంది.

Similar News

News July 10, 2025

జనగణన చేపట్టేందుకు ఏపీ ప్రభుత్వం గ్రీన్‌సిగ్నల్

image

AP: రాష్ట్రంలో జనగణన చేపట్టేందుకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. 2027 మార్చి 1 నుంచి దేశవ్యాప్తంగా జనగణన చేపట్టాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించిన విషయం తెలిసిందే. దీంతో రాష్ట్రంలోనూ అదే రోజు ప్రక్రియ ప్రారంభం అవుతుందని ప్రభుత్వం జీవో జారీ చేసింది.

News July 10, 2025

KCRకు వైద్య పరీక్షలు పూర్తి

image

TG: BRS అధినేత, మాజీ సీఎం KCRకు వైద్య పరీక్షలు పూర్తయ్యాయి. సోమాజిగూడ యశోద ఆస్పత్రి నుంచి నందినగర్‌లోని ఆయన నివాసానికి వెళ్లారు. ఈనెల 3న ఆయన అస్వస్థతతో ఆస్పత్రిలో చేరగా ఆరోగ్యం మెరుగ్గానే ఉందని, సోడియం లెవల్స్ కొద్దిగా పెరిగాయని వైద్యులు నిర్ధారించారు. రెండు రోజుల చికిత్స అనంతరం 5వ తేదీన డిశ్చార్జ్ చేశారు. మరోసారి టెస్టుల కోసం రావాలని డాక్టర్లు సూచించడంతో ఇవాళ KCR ఆస్పత్రికి వెళ్లారు.

News July 10, 2025

లగ్జరీ అపార్ట్‌మెంట్ కొన్న జొమాటో ఫౌండర్.. ధర రూ.52.3 కోట్లు!

image

జొమాటో ఫౌండర్ దీపిందర్ గోయల్ హరియాణాలోని గురుగ్రామ్‌లో ₹52.3కోట్లతో సూపర్ లగ్జరీ అపార్ట్‌మెంట్ కొన్నారు. DLF సంస్థ నిర్మించిన ‘ది కామెల్లియాస్‌’ రెసిడెన్షియల్ సెక్టార్‌లో ఈ అపార్ట్‌మెంట్ ఉంది. దీని విస్తీర్ణం 10,813 స్క్వేర్ ఫీట్లు. ఇందులో 5 పార్కింగ్ స్పేస్‌లు ఉంటాయి. దీపిందర్ 2022లోనే దీనిని కొనుగోలు చేశారు. ఈ ఏడాది MARలో రిజిస్ట్రేషన్ పూర్తయింది. ₹3.66cr స్టాంప్ డ్యూటీ చెల్లించినట్లు సమాచారం.