News March 29, 2025

43 వసంతాల ‘తెలుగుదేశం’

image

తెలుగువారు “అన్నగారు” అని అభిమానంతో పిలుచుకొనే ఎన్టీఆర్ 1982 మార్చి 29న టీడీపీని స్థాపించారు. 9 నెలల్లోనే 294 అసెంబ్లీ సీట్లలో 202 గెలుచుకుని పార్టీ అధికారంలోకి వచ్చింది. రూ.2కే కిలో బియ్యం, వృద్ధులు, వికలాంగులు, వితంతువులకు పింఛన్లు వంటి కొత్త పథకాలతో పలు సంస్కరణలు తీసుకొచ్చింది. పార్టీ ఆవిర్భావం నుంచి ఇప్పటివరకు పది సార్లు ఎన్నికలు జరగగా.. ఆరు సార్లు అధికారంలో, నాలుగు సార్లు ప్రతిపక్షంలో ఉంది.

Similar News

News April 1, 2025

ఆరుబయట పడుకుంటున్నారా?

image

వేసవి కారణంగా చాలామంది ఆరుబయటో, మేడపైనో పడుకుంటుంటారు. ఒకప్పుడైతే వేసవినాటికి దోమలు పోయేవి. కానీ నేడు విషజ్వరాలను కలిగించే దోమల సంతతి వేసవిలోనూ ఉంటోంది. ఈ నేపథ్యంలో బయట పడుకునేవారు కచ్చితంగా దోమల తెరను వాడాలని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. పడుకునే చోటుకు కొంచెం దూరంలో సాంబ్రాణి ధూపం వేస్తే ఆ వాసనకు దోమలు దూరంగా ఉంటాయంటున్నారు. కాళ్లకు చేతులకు నూనె రాసుకున్నా ఫలితం ఉంటుందని చెబుతున్నారు.

News April 1, 2025

స్కిన్ క్యాన్సర్‌తో బాధపడ్డా: జాన్ సీనా

image

WWE సూపర్‌స్టార్ జాన్ సీనా అభిమానులకు షాకింగ్ న్యూస్ చెప్పారు. గతంలో తాను స్కిన్ క్యాన్సర్‌ బారినపడ్డట్లు వెల్లడించారు. ‘ఒకసారి డెర్మటాలజిస్ట్ వద్దకు వెళ్లినప్పుడు ఈ విషయం బయటపడింది. వైద్యులు నా స్కిన్ కింది నుంచి క్యాన్సర్ కణుతులను తొలగించారు. WWE మ్యాచ్‌ల సందర్భంగా నా శరీరంపై మీరు ఆ స్పాట్స్‌ను చూడొచ్చు. మహమ్మారిపై పోరాడే సందర్భంలో కఠిన సవాళ్లు ఎదురయ్యాయి’ అని ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు.

News April 1, 2025

ALERT: ఎండలు, పిడుగులతో వానలు

image

AP: రాష్ట్రంలో రేపు 26, ఎల్లుండి 28 మండలాల్లో <>వడగాలులు వీస్తాయని<<>> APSDMA వెల్లడించింది. చాలా చోట్ల 39-41 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని తెలిపింది. మరోవైపు గురువారం రాయలసీమలో, శుక్రవారం ఉత్తరాంధ్రలో పలు చోట్ల పిడుగులతో కూడిన మోస్తరు వర్షాలు కురుస్తాయని పేర్కొంది. పొలాల్లో పనిచేసే రైతులు, కూలీలు, గొర్రెల కాపరులు చెట్ల కింద ఉండరాదని సూచించింది.

error: Content is protected !!