News January 30, 2025
440 పోలింగ్ కేంద్రాలను సిద్ధం: కలెక్టర్

ఎమ్మెల్సీ ఎన్నికల నిర్వహణ కోసం 440 పోలింగ్ కేంద్రాలను సిద్ధం చేసినట్లు బుధవారం కలెక్టర్ వెట్రి సెల్వి తెలిపారు. 3 లక్షల 15 వేల 261 మంది పట్టభద్రులు ఓటర్లు ఉండగా, వీరిలో లక్షా 83 వేల 734 మంది పురుషులు, లక్షా 31 వేల 507 మంది మహిళలు, 20 మంది థర్డ్ జెండర్ ఓటర్లు ఉన్నారన్నారు. నామినేషన్ల తుది తేదీ వరకు ఓటర్లుగా నమోదు అయ్యేందుకు దరఖాస్తు www.nvsp.in వెబ్సైట్ ద్వారా నేరుగా దరఖాస్తు చేసుకోవచ్చన్నారు.
Similar News
News December 5, 2025
పెళ్లి వయసు రాకున్నా సహజీవనం చేయొచ్చు: రాజస్థాన్ హైకోర్టు

చట్టబద్ధంగా పెళ్లి వయస్సు రాకున్నా పరస్పర అంగీకారంతో సహజీవనం చేసే హక్కు ఇద్దరు మేజర్లకు ఉందని రాజస్థాన్ హైకోర్టు స్పష్టం చేసింది. live-inలో ఉన్న తమకు రక్షణ కల్పించాలని కోటాకు చెందిన యువతి(18), యువకుడు(19) కోర్టును ఆశ్రయించారు. వారు చట్టప్రకారం పెళ్లి చేసుకోలేనంత మాత్రాన ప్రాథమిక హక్కులను కోల్పోకూడదని జస్టిస్ అనూప్ తీర్పుచెప్పారు. చట్ట ప్రకారం పురుషుల పెళ్లి వయసు 21 కాగా, మహిళలకు 18 ఏళ్లు ఉండాలి.
News December 5, 2025
విద్యార్థులతో కలిసి భోజనం చేసిన పరిటాల సునీత

అనంతపురం రూరల్ సిండికేట్ నగర్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో శుక్రవారం జరిగిన మెగా పేరెంట్స్ మీటింగ్కు రాప్తాడు ఎమ్మెల్యే పరిటాల సునీత హాజరయ్యారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత విద్యార్థులకు అనుకూలంగా విద్యా వ్యవస్థలో సమూల మార్పులు చేసిందని ఆమె వెల్లడించారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలు కూడా అందరికీ అందిస్తున్నామని తెలిపారు. అనంతరం ఎమ్మెల్యే విద్యార్థులతో కలిసి భోజనం చేశారు.
News December 5, 2025
వరంగల్, హనుమకొండ కలయికపై చర్చ ఉంటుందా?

నర్సంపేట పర్యటనలో CM రేవంత్ రెడ్డి హనుమకొండ-వరంగల్ జిల్లాల కలయికపై స్పందిస్తారా? అనే విషయంపై చర్చ జరుగుతోంది. రెండు జిల్లాలను గ్రేటర్ పరిధిలో సమన్వయంగా అభివృద్ధి చేయాలన్న అభిప్రాయాన్ని గతంలో వ్యక్తం చేయగా.. ఆ మధ్య కాలంలో కలయిక ఉంటుందని భావించారు. సదుపాయాలు, రోడ్లు, ట్రాఫిక్ నిర్వహణ, పట్టణ సేవలను ఒకే వ్యూహంతో ముందుకు తీసుకెళ్లడం వల్ల ప్రజలకు ప్రయోజనం చేకూరుతుందని CM చెప్పొచ్చని రాజకీయ వర్గాల అంచనా.


