News January 30, 2025
440 పోలింగ్ కేంద్రాలను సిద్ధం: కలెక్టర్

ఎమ్మెల్సీ ఎన్నికల నిర్వహణ కోసం 440 పోలింగ్ కేంద్రాలను సిద్ధం చేసినట్లు బుధవారం కలెక్టర్ వెట్రి సెల్వి తెలిపారు. 3 లక్షల 15 వేల 261 మంది పట్టభద్రులు ఓటర్లు ఉండగా, వీరిలో లక్షా 83 వేల 734 మంది పురుషులు, లక్షా 31 వేల 507 మంది మహిళలు, 20 మంది థర్డ్ జెండర్ ఓటర్లు ఉన్నారన్నారు. నామినేషన్ల తుది తేదీ వరకు ఓటర్లుగా నమోదు అయ్యేందుకు దరఖాస్తు www.nvsp.in వెబ్సైట్ ద్వారా నేరుగా దరఖాస్తు చేసుకోవచ్చన్నారు.
Similar News
News February 12, 2025
‘లైలా’ రన్ టైమ్ ఎంతంటే?

‘లైలా’ మూవీకి సెన్సార్ బోర్డు A సర్టిఫికెట్ ఇచ్చింది. ఈ సినిమా రన్ టైమ్ ఎండింగ్ కార్డ్స్తో కలుపుకొని 2 గంటల 16 నిమిషాలు ఉన్నట్లు మూవీ వర్గాలు పేర్కొన్నాయి. విశ్వక్ సేన్, ఆకాంక్ష ప్రధాన పాత్రల్లో నటించిన ఈ చిత్రం ఎల్లుండి థియేటర్లలో విడుదల కానుంది. ఇటీవల కమెడియన్ <<15413032>>పృథ్వీ చేసిన వ్యాఖ్యలతో<<>> ఈ మూవీ టాక్ ఆఫ్ ది టౌన్గా మారింది.
News February 12, 2025
HYD: ఈ నెల 17వరకు నుమాయిష్ పొడిగింపు

HYD నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్లో జరుగుతున్న నుమాయిష్ జనవరి 3వ తేదీన ప్రారంభమైంది. నుమాయిష్ను సందర్శించేందుకు భారీగా సందర్శకులు తరలివస్తున్నారు. సందర్శకులు భారీగా తరలివస్తుండడంతో పోలీసులు భద్రత కారణాల దృష్ట్యా మొదటగా ఈనెల 15వ తేదీ వరకు అనుమతి ఇస్తామని HYD సీపీ సీవీ ఆనంద్ తెలిపారు. అనంతరం ఎగ్జిబిషన్ సొసైటీ సభ్యుల వినతి మేరకు ఈనెల 17 వరకు అనుమతి లభించినట్లు సొసైటీ సభ్యులు తెలిపారు.
News February 12, 2025
సరూర్ నగర్: రేపు కబడ్డీ జట్ల ఎంపిక

రంగారెడ్డి జిల్లా సబ్ జూనియర్ బాలబాలికల కబడ్డీ పోటీలు రేపు సరూర్నగర్ స్టేడియంలో నిర్వహిస్తున్నట్లు జిల్లా కబడ్డీ అసోసియేషన్ అధ్యక్షుడు రవికుమార్ తెలిపారు. రేపు మధ్యాహ్నం 3 గం.కు ఎంపిక ఉంటుందని, 16 ఏళ్లలోపు బాల బాలికలు ఆధార్ కార్డుతో ఎంపికకు హాజరు కావాలన్నారు. ఎంపికైన వారు వికారాబాద్ జిల్లాలో జరిగే 34వ సబ్ జూనియర్ అంతర్ జిల్లా పోటీల్లో ఆడుతారన్నారు.