News March 17, 2024
HYD జిల్లాలో 45,70,138 మంది ఓటర్లు

HYD జిల్లాలో మొత్తం 45,70,138 మంది ఓటర్లు ఉన్నారని అధికారులు తెలిపారు. ఇందులో పురుషులు 23,30,574, మహిళలు 22,39,240, ఇతరులు 324 ఓటర్లు ఓటర్లు ఉన్నారని తెలిపారు. అలాగే ఏప్రిల్ 14 వరకు ఓటు కోసం దరఖాస్తు చేసుకోవచ్చని తెలిపారు. లోక్ సభ ఎన్నికల నోటిఫికేషన్ విడుదల అయినందున పోలింగ్ శాతాన్ని పెంచేందుకు ప్రత్యేక చొరవ చూపుతామని అధికారులు చెబుతున్నారు.
Similar News
News April 10, 2025
చిక్కడపల్లి: విజయయాత్ర మార్గాన్ని పరిశీలించిన సీపీ

హనుమాన్ జయంతి సందర్భంగా నిర్వహించే ‘వీర హనుమాన్ విజయ యాత్ర’ రూట్ను నగర పోలీస్ కమిషనర్ సీవీ ఆనంద్ పరిశీలించారు. గౌలిగూడ రామమందిరం నుంచి నారాయణగూడ, ఆర్టీసీ క్రాస్రోడ్డు చౌరస్తా, అశోక్నగర్, కవాడిగూడ, బైబిల్ హౌస్, తాడ్బండ్ హనుమాన్ టెంపుల్ వరకు దాదాపు 12.2 కిలోమీటర్లు శోభాయాత్ర కొనసాగుతుందన్నారు. అదనపు పోలీస్ కమిషనర్ విక్రమ్సింగ్మాన్, ట్రాఫిక్ అదనపు కమిషనర్ జోయల్ డేవిస్ ఉన్నారు.
News April 10, 2025
HYD: చికెన్, మటన్ షాపులు బంద్

గ్రేటర్ హైదరాబాద్ వాసులకు ముఖ్య గమనిక. మాంసం దుకాణాలు నేడు బంద్ చేయాలని GHMC ఉత్వర్వులు జారీ చేసింది. కబేళాలు, రిటైల్ బీఫ్ దుకాణాలు మూసి ఉంటాయని ప్రకటించింది. మహావీర్ జయంతి సందర్భంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఉత్తర్వులు జారీ అయ్యాయి. GHMC లిమిట్స్లోని అన్ని మాంసం దుకాణాలకు ఈ ఉత్తర్వులు వర్తిస్తాయి.
SHARE IT
News April 10, 2025
HYD: నల్లాకు మోటర్ బిగిస్తే రూ.5 వేల జరిమానా!

నల్లాల నుంచి మోటార్ల ద్వారా నీటిని తోడితే కఠిన చర్యలు తీసుకుంటామని జలమండలి MD అశోక్ రెడ్డి హెచ్చరించారు. బుధవారం ఖైరతాబాద్లోని జలమండలి ప్రధాన కార్యాలయంలో సమీక్ష నిర్వహించారు. HMWSSB ఎన్నో వ్యయ ప్రయాసల కోర్చి సుదూర ప్రాంతాల నుంచి నీటిని శుద్ధి చేసి సరఫరా చేస్తోందని, వృథా చేయకుండా వాటిని తాగునీటి అవసరాలకు మాత్రమే వినియోగించాలని కోరారు. నల్లాకు మోటర్ బిగిస్తే రూ.5 వేల జరిమానా విధిస్తామన్నారు.