News March 29, 2024
రాష్ట్రంలో 4,590 బ్యాక్లాగ్ పోస్టులు!

TG: ఒకేసారి భారీగా ఉద్యోగాల భర్తీ చేపట్టడం, ఒకటి కంటే ఎక్కువ పోస్టులకు ఎంపికైన అభ్యర్థులు మిగతా జాబ్స్ను వదిలేస్తుండటంతో బ్యాక్లాగ్ పోస్టులు పెరిగిపోతున్నాయి. 3 నెలల్లో 33వేల ఉద్యోగాల భర్తీ ప్రక్రియ జరగగా, 4,590 పోస్టులు మిగిలిపోయినట్లు తెలుస్తోంది. కానిస్టేబుల్ 2వేలు, గురుకులాల్లో 1,810, స్టాఫ్ నర్స్, మెడికల్ ఆఫీసర్లలో 780 ఉద్యోగాలు భర్తీ కాలేదు. వీటికోసం మళ్లీ నోటిఫికేషన్లు జారీ చేయాల్సి ఉంది.
Similar News
News February 14, 2026
స్కాట్లాండ్పై ఇంగ్లండ్ విజయం

T20WC: కోల్కతా వేదికగా స్కాట్లాండ్తో జరిగిన మ్యాచ్లో ఇంగ్లండ్ జట్టు విజయం సాధించింది. 153 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన బ్రిటిష్ జట్టు తొలుత వెంటవెంటనే వికెట్లు కోల్పోయింది. 86కే 4 వికెట్లు పడిన సమయంలో స్కాట్లాండ్ పైచేయి సాధించినట్లే కన్పించింది. ఆపై ఇంగ్లండ్ బ్యాటర్లు వరుసగా బౌండరీలు బాదుతూ విజయం వైపు నడిచారు. 18.2 ఓవర్లలోనే టార్గెట్ ఛేదించారు. బ్యాంటన్ 41 బంతుల్లోనే 63 పరుగులతో రాణించారు.
News February 14, 2026
ALERT: ఇలాంటి వారు ఉపవాసం చేయకండి!

మహాశివరాత్రి ఉపవాసం అందరికీ ఆరోగ్యకరం కాదని వైద్యులు హెచ్చరిస్తున్నారు. ముఖ్యంగా మధుమేహం, గుండె జబ్బులు ఉన్నవారు, గర్భిణులు కఠిన ఉపవాసాలకు దూరంగా ఉండాలి. దీర్ఘకాలిక వ్యాధులతో మందులు వాడేవారు ఉపవాసం ఉండటం ప్రమాదకరం. వృద్ధులు, చిన్న పిల్లలు కూడా ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని పాలు, పండ్లు తీసుకోవాలి. ఆరోగ్యాన్ని కాపాడుకుంటూ శివారాధన చేయడం ముఖ్యమని నిపుణులు సూచిస్తున్నారు. share it
News February 14, 2026
ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్ న్యూస్

AP: 8 L మంది ఉద్యోగులకు ప్రభుత్వం గుడ్ న్యూస్ అందించింది. GPF ఖాతాలను ఆన్లైన్ చేసి NIDHI ప్లాట్ఫామ్తో స్ట్రీమ్లైన్ చేసింది. ఇదివరకు సొమ్ము మాయం, విత్డ్రాలో జాప్యం, రిటైర్మెంటు బెనిఫిట్స్, లీవ్ ఎన్క్యాష్మెంటు, DA బకాయిలు, GLICకీ అనేక సమస్యలుండేవి. ఆఫ్లైన్తో ఖాతాలో ఎంతుందో తెలిసేది కాదు. ఇప్పుడు పారదర్శకంగా డ్యాష్ బోర్డు ద్వారా సమాచారం అందుబాటులో ఉంటుంది. ఏదైనా ఆన్లైన్లోనే అప్లయ్ చేయొచ్చు.


