News March 29, 2024
రాష్ట్రంలో 4,590 బ్యాక్లాగ్ పోస్టులు!

TG: ఒకేసారి భారీగా ఉద్యోగాల భర్తీ చేపట్టడం, ఒకటి కంటే ఎక్కువ పోస్టులకు ఎంపికైన అభ్యర్థులు మిగతా జాబ్స్ను వదిలేస్తుండటంతో బ్యాక్లాగ్ పోస్టులు పెరిగిపోతున్నాయి. 3 నెలల్లో 33వేల ఉద్యోగాల భర్తీ ప్రక్రియ జరగగా, 4,590 పోస్టులు మిగిలిపోయినట్లు తెలుస్తోంది. కానిస్టేబుల్ 2వేలు, గురుకులాల్లో 1,810, స్టాఫ్ నర్స్, మెడికల్ ఆఫీసర్లలో 780 ఉద్యోగాలు భర్తీ కాలేదు. వీటికోసం మళ్లీ నోటిఫికేషన్లు జారీ చేయాల్సి ఉంది.
Similar News
News January 31, 2026
కూలీ నుంచి గ్రూప్-2 వరకూ.. ‘విజయ’లక్ష్మి స్ఫూర్తి ప్రయాణం

AP: కష్టాలకు ఎదురొడ్డి నిలబడి విజయాన్ని సొంతం చేసుకున్న మహిళ విజయలక్ష్మి. నంద్యాల(D) రుద్రవరం(M) యల్లావత్తుల గ్రామానికి చెందిన ఆమె పగలంతా కూలీ పనులు చేస్తూ, రాత్రి సమయంలో చదువు కొనసాగించారు. పేద కుటుంబ నేపథ్యంతో పాటు ట్రాక్టర్ నడుపుతూ కుటుంబాన్ని పోషించే భర్త ప్రమాదానికి గురి కావడంతో ఆర్థిక సమస్యలు చుట్టుముట్టాయి. అయినా ఆమె కుంగిపోలేదు. పట్టుదలతో చదివి గ్రూప్-2లో ASOగా ఎంపికయ్యారు.
News January 31, 2026
నాకు ఇచ్చిన నోటీసు అక్రమం.. KCR లేఖ

TG: ఫోన్ ట్యాపింగ్ కేసులో జూబ్లీహిల్స్ ACPకి కేసీఆర్ 6 పేజీల లేఖ రాశారు. ‘నాకు ఇచ్చిన నోటీసు అక్రమం. దాని ద్వారా నా గౌరవానికి భంగం కలిగించారు. ఇంటి గోడకు నోటీసు అంటించడం చట్టవిరుద్ధం. నేను కొన్ని సంవత్సరాలుగా ఎర్రవల్లిలో నివసిస్తున్నా. అక్కడే స్టేట్మెంట్ రికార్డ్ చేయాల్సిన బాధ్యత మీపై ఉంది. చట్టపరమైన అభ్యంతరాలున్నా రేపు 3PMకు నందినగర్ నివాసంలో సిట్ విచారణకు హాజరవుతా’ అని లేఖలో పేర్కొన్నారు.
News January 31, 2026
రూ.5వేల కోట్ల విలువైన ప్రభుత్వ భూములను లాగేశారు: జగన్

AP: విశాఖలో చంద్రబాబు, ఆయన కుటుంబం దాదాపు రూ.5వేల కోట్ల విలువైన ప్రభుత్వ భూములను లాగేసుకుందని మాజీ సీఎం జగన్ ఆరోపించారు. రుషికొండ సమీపంలోని 54.79 ఎకరాల భూములను ఎంపీ భరత్కు కట్టబెట్టేశారని ట్వీట్ చేశారు. లోకేశ్కు ఎలాంటి అధికార పరిధి లేకపోయినా తోడల్లుడికి కేటాయించేలా చేశారని తెలిపారు. ఆ తర్వాత చంద్రబాబు ఒత్తిళ్లతో GVMC సభ్యులను భయపెట్టి ఏకపక్షంగా ఆమోదించుకున్నారని పేర్కొన్నారు.


