News March 29, 2024
రాష్ట్రంలో 4,590 బ్యాక్లాగ్ పోస్టులు!

TG: ఒకేసారి భారీగా ఉద్యోగాల భర్తీ చేపట్టడం, ఒకటి కంటే ఎక్కువ పోస్టులకు ఎంపికైన అభ్యర్థులు మిగతా జాబ్స్ను వదిలేస్తుండటంతో బ్యాక్లాగ్ పోస్టులు పెరిగిపోతున్నాయి. 3 నెలల్లో 33వేల ఉద్యోగాల భర్తీ ప్రక్రియ జరగగా, 4,590 పోస్టులు మిగిలిపోయినట్లు తెలుస్తోంది. కానిస్టేబుల్ 2వేలు, గురుకులాల్లో 1,810, స్టాఫ్ నర్స్, మెడికల్ ఆఫీసర్లలో 780 ఉద్యోగాలు భర్తీ కాలేదు. వీటికోసం మళ్లీ నోటిఫికేషన్లు జారీ చేయాల్సి ఉంది.
Similar News
News February 7, 2026
పంచాయతీ ఎన్నికలకు రెడీ అవుతున్న AP SEC

AP: పంచాయతీ ఎన్నికల నిర్వహణ కోసం ప్రాథమిక ఏర్పాట్లపై రాష్ట్ర ఎన్నికల సంఘం దృష్టి సారించింది. పంచాయతీ వార్డుల వారీగా ఫొటో ఓటర్ ఐడీ కార్డుల జాబితా సిద్ధం చేయాలని అన్ని జిల్లాల పంచాయతీ అధికారులను ఆదేశించింది. 2026 జనవరి 1వ తేదీని కటాఫ్గా చేసుకొని అసెంబ్లీ ఓటర్ల జాబితా ఆధారంగా వీటిని రూపొందించాలని సూచించింది. మార్చి 9న వీటిని పబ్లిష్ చేయనున్నట్లు ఆ ఆదేశాల్లో పేర్కొంది.
News February 7, 2026
సెంట్రల్ లెదర్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్లో ఉద్యోగాలు

CSIR-సెంట్రల్ లెదర్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ (CLRI) 13 పోస్టులను భర్తీ చేయనుంది. టెన్త్, ఇంటర్ అర్హతగల అభ్యర్థులు మార్చి 2 వరకు అప్లై చేసుకోవచ్చు. రాత పరీక్ష, స్కిల్ టెస్ట్ ద్వారా ఎంపిక చేస్తారు. దరఖాస్తు ఫీజు రూ.500. SC, ST, PwBDలకు ఫీజు లేదు. Jr. స్టెనోగ్రాఫర్కు నెలకు రూ.53,628, Jr.సెక్రటేరియట్ అసిస్టెంట్కు రూ.39,545, MTSకు రూ.35,973 చెల్లిస్తారు. వెబ్సైట్: https://clri.org
News February 7, 2026
చెరకు తోటలు నరికిన తర్వాత ఇలా చేస్తే లాభం

చెరకును నరికిన తర్వాత కార్శి చేయడం వల్ల విత్తనపు ఖర్చుతో పాటు పొలం తయారీ ఖర్చు తగ్గుతుంది. చెరకు మోడు చెక్కిన 10-20 రోజుల లోపల భూమిలో తగినంత పదును ఉన్నప్పుడు రెండు సాళ్ల మధ్య దుక్కి చేసి భూమి గుల్లబారేట్లు చేయాలి. దీని వల్ల మొక్క తోట వేర్లు నశించి పిలకల నుంచి కొత్త వేర్లు అభివృద్ధి చెందుతాయి. అంతేకాకుండా కార్శి తోటల వేర్లకు ప్రాణ వాయువు, తడులు పెట్టినప్పుడు నీరు, పోషకాలు సమానంగా అందుతాయి.


