News February 19, 2025
46 మంది టీడీపీ నేతలపై కేసు కొట్టివేత: ఎస్ఐ సతీశ్

మాచవరం మండలం తురకపాలెం తెలుగుదేశం పార్టీ వర్గీయులపై నమోదైన హత్య కేసును గురజాల అసిస్టెంట్ సెషన్ కోర్టు జడ్జి శ్రీనివాసరావు కొట్టివేశారని మాచవరం ఎస్ఐ సతీశ్ తెలిపారు. 2019 జూలై 1న తురకపాలెం గ్రామంలో మధ్యాహ్న భోజన పథకం విషయంలో ఘర్షణ జరిగింది. టీడీపీ వర్గీయులైన షేక్ అల్లావుద్దీన్తో పాటు 46 మందిపై అప్పట్లో కేసు నమోదు అయింది. సరైన ఆధారాలు లేకపోవడంతో ఈ కేసును కొట్టివేస్తూ కోర్టు తీర్పునిచ్చింది.
Similar News
News November 11, 2025
NZB: ఘనంగా మౌలానా అబుల్ కలాం ఆజాద్ జయంతి

కేంద్ర తొలి విద్యాశాఖ మంత్రి అబుల్ కలాం ఆజాద్ జయంతి వేడుకలను జిల్లా మైనార్టీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో మంగళవారం సమీకృత జిల్లా కార్యాలయాల సమావేశ మందిరంలో ఘనంగా నిర్వహించారు. కలెక్టర్ టి. వినయ్ కృష్ణారెడ్డి, ఇతర జిల్లా అధికారులు మౌలానా అబుల్ కలాం ఆజాద్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. ఆయన దేశానికి అందించిన సేవలను వక్తలు గుర్తు చేసుకున్నారు.
News November 11, 2025
MBNR: 150 ఉద్యోగాలు.. సద్వినియోగం చేసుకోండి

మహబూబ్ నగర్ లోని ఎంప్లాయ్మెంట్ కార్యాలయంలో (పిల్లలమర్రి) ఈనెల 13న ఉద్యోగ మేళా నిర్వహిస్తున్నట్లు జిల్లా ఉపాధి కల్పన అధికారిణి మైత్రి ప్రియ ‘Way2News’తో తెలిపారు. 4 ప్రైవేట్ సంస్థలలో 150 ఉద్యోగ ఖాళీలు ఉన్నాయన్నారు. SSC, ఇంటర్, డిగ్రీ ఉత్తీర్ణులై ఉండాలని, వయసు 18-30లోపు ఉండాలని, ఆధార్, సర్టిఫికెట్లతో హాజరు కావాలన్నారు. ఉమ్మడి జిల్లా అర్హులైన అభ్యర్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు.
News November 11, 2025
HYD: మొయినుద్దీన్ కదలికలపై ATS ఆరా

హైదరాబాద్కు చెందిన డాక్టర్ మొయినుద్దీన్ సయ్యద్ NTT ద్వారా ISKP నెట్ వర్క్ విస్తరించడానికి ప్రయత్నించాడు. దీనికోసం హైదరాబాద్తోపాటు వివిధ నగరాలు, రాష్ట్రాల్లో ఉన్న వారితో సంప్రదింపులు జరిపాడు. వీరిలో ఎందరు ఇతడి ద్వారా ఉగ్రబాట పట్టారనేది ATS ఆరా తీస్తోంది. గడచిన కొన్నేళ్లుగా అతడి కదలికలు, సంప్రదింపులు జరిపిన వ్యక్తులు తదితరాలను ఆరా తీస్తోంది.


