News June 11, 2024
ఇంటర్లో 470కి 466 మార్కులు.. అకాల మరణం

TG: సరస్వతీ పుత్రుడు అకాల మరణం చెందాడు. ఇటీవల ఇంటర్ ఫస్టియర్ ఫలితాల్లో 470కి 466 మార్కులు సాధించిన శ్రీవత్సవ్ బ్రెయిన్ ఇన్ఫెక్షన్తో మరణించాడు. పెద్దపల్లి జిల్లా మంథనికి చెందిన సుతారి శ్రీవత్సవ్ (18) ఈ నెల 7న అకస్మాత్తుగా అస్వస్థతకు గురికావడంతో పేరెంట్స్ ఆస్పత్రిలో చేర్చారు. బ్రెయిన్లో ఇన్ఫెక్షన్ వల్ల క్రమంగా గుండె, బ్రెయిన్, కిడ్నీలు పని చేయడం మందగించి నిన్న ప్రాణాలు వదిలాడు.
Similar News
News November 24, 2025
శరణు ఘోషతోనే కొండ ఎక్కుతారు

శబరి యాత్రలో ఎత్తైన, నిట్టనిలువు కొండ ‘కరిమల’. సుమారు 10KM ఎత్తుకు వెళ్లిన తర్వాత భక్తులు దీని శిఖరాన్ని చేరుకుంటారు. ఇక్కడ అతి ప్రాచీనమైన బావి, జలపాతం ఉన్నాయి. భక్తులు ఇక్కడ దాహార్తిని తీర్చుకుంటారు. ఇంత ఎత్తులో జలపాతం ఉండటం దీని ప్రత్యేకత. ఈ కొండ ఎక్కడం ఎంత కష్టమో దిగడం కూడా అంతే కష్టం. ‘స్వామియే శరణమయ్యప్ప’ అనే శరణు ఘోష ముందు ఈ కష్టం దూది పింజెలా తేలిపోతుంది. <<-se>>#AyyappaMala<<>>
News November 24, 2025
IIT ధన్బాద్ 105 పోస్టులకు నోటిఫికేషన్

<
News November 24, 2025
జిల్లాల వారీగా నోటిఫికేషన్ జారీ

తెలంగాణలో పంచాయతీ ఎన్నికల రిజర్వేషన్లపై జిల్లాల వారీగా నోటిఫికేషన్లు జారీ అయ్యాయి. జీవో నం.46 ప్రకారం 50% క్యాప్తో రిజర్వు స్థానాలు ఖరారు చేస్తూ కాసేపటి క్రితం ప్రభుత్వం గెజిట్ విడుదల చేసింది. ఇందులో SC, STల పంచాయతీలు యథాతథంగా ఉండగా 22% రిజర్వేషన్ మాత్రమే అమలు చేస్తుండటంతో పలుచోట్ల BCల రిజర్వు స్థానాలు మారాయి. రాష్ట్ర ఎన్నికల కమిషన్కు సైతం ఈ వివరాలు పంపింది.


