News April 22, 2025

468/470 సాధించిన గుడిపేట విద్యార్థిని

image

మల్యాల మండలంలోని గుడిపేటకి చెందిన కుసుమ గణేశ్ కూతురు కుసుమ అనుపమ మంగళవారం విడుదలైన ఇంటర్మీడియట్ ఫలితాలలో ప్రభంజనం సృష్టించింది. ఎంపీసీ విభాగంలో మొదటి సంవత్సరంలో 470 మార్కులకు గాను 468 మార్కులు సాధించి మండల టాపర్‌గా నిలిచింది. ఈ మేరకు విద్యార్థినిని తల్లిదండ్రులు, గ్రామస్థులు అభినందిస్తున్నారు.

Similar News

News April 23, 2025

భానుడి ఉగ్రరూపం.. ఆ మండలాల్లోనే అత్యధికం

image

ఖమ్మం జిల్లాలో వాతావరణం నిప్పులకొలిమిని తలపిస్తుంది. మంగళవారం జిల్లాలోనే ఎర్రుపాలెంలో అత్యధికంగా 42.9 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైనట్లు వాతావరణ శాఖ తెలిపింది. అటు ముదిగొండ (బాణాపురం), నేలకొండపల్లిలో 42.8, కామేపల్లి (లింగాల), కారేపల్లి 42.7, వైరా 42.5, ఖమ్మం అర్బన్ 42.4, వేంసూరు, మధిర 42.3, తిరుమలాయపాలెం(బచ్చోడు) 42.1, రఘునాథపాలెం 41.5, బోనకల్, చింతకాని 41.4, కల్లూరు 39.8, సత్తుపల్లి 39.3 నమోదైంది.

News April 23, 2025

పహల్‌గామ్‌లో అనుమానాస్పద బైక్ గుర్తింపు

image

జమ్మూకశ్మీర్ పహల్‌గామ్ ఉగ్రదాడి ఘటన విచారణలో భద్రతా బలగాలు పురోగతి సాధించాయి. పహల్‌గామ్ సమీపంలో నంబర్ ప్లేట్ లేని బైక్‌ను గుర్తించాయి. టెర్రరిస్టులు దీన్ని ఉపయోగించినట్లు అనుమానిస్తున్నాయి. బైక్‌ను స్వాధీనం చేసుకుని దర్యాప్తు చేస్తున్నాయి. మరోవైపు ఘటనా స్థలానికి ఇవాళ ఎన్ఐఏ బృందాలు చేరుకోనున్నాయి.

News April 23, 2025

చరిత్ర సృష్టించిన కేఎల్ రాహుల్

image

IPLలో అత్యంత వేగంగా 130 ఇన్నింగ్స్‌ల్లోనే 5,000 పరుగులు చేసిన ప్లేయర్‌గా ఢిల్లీ క్యాపిటల్స్ బ్యాటర్ కేఎల్ రాహుల్ చరిత్ర సృష్టించారు. నిన్న LSGతో మ్యాచ్‌లో హాఫ్ సెంచరీ(57*) చేయడం ద్వారా ఈ ఘనత సాధించారు. ఆ తర్వాతి స్థానాల్లో డేవిడ్ వార్నర్(135Inns), విరాట్ కోహ్లీ(157Inns), డివిలియర్స్(161Inns), ధవన్(168Inns) ఉన్నారు.

error: Content is protected !!