News April 22, 2025
468/470 సాధించిన గుడిపేట విద్యార్థిని

మల్యాల మండలంలోని గుడిపేటకి చెందిన కుసుమ గణేశ్ కూతురు కుసుమ అనుపమ మంగళవారం విడుదలైన ఇంటర్మీడియట్ ఫలితాలలో ప్రభంజనం సృష్టించింది. ఎంపీసీ విభాగంలో మొదటి సంవత్సరంలో 470 మార్కులకు గాను 468 మార్కులు సాధించి మండల టాపర్గా నిలిచింది. ఈ మేరకు విద్యార్థినిని తల్లిదండ్రులు, గ్రామస్థులు అభినందిస్తున్నారు.
Similar News
News April 22, 2025
J&Kలో ఉగ్రదాడి.. ఖండించిన సీఎంలు

J&Kలో జరిగిన ఉగ్రవాదుల కాల్పుల్లో పర్యాటకులు మృతి చెందిన ఘటన తీవ్ర దిగ్భ్రాంతిని కలిగించిందని సీఎం రేవంత్ ట్వీట్ చేశారు. ‘ఈ దుశ్చర్యను ఖండిస్తున్నాను. ఇలాంటి దొంగ దెబ్బలతో భారతీయుల ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీయలేరు. ఉగ్రవాద మూకల విషయంలో అత్యంత కఠినంగా వ్యవహరించాలని కేంద్రాన్ని కోరుతున్నా’ అని పేర్కొన్నారు. అమాయక పర్యాటకులపై ఉగ్రవాదులు దాడి చేయడం హేయమైన చర్య అని ఏపీ సీఎం చంద్రబాబు ట్వీట్ చేశారు.
News April 22, 2025
తిరుపతయ్య కుటుంబీకులకు చెక్కు అందజేసిన ఎస్పీ

కాగజ్నగర్లో హెడ్ కానిస్టేబుల్గా విధులు నిర్వహిస్తున్న తిరుపతయ్య ఇటీవల గుండెపోటుతో మరణించారు. కాగా ఆయన భార్య రాధికకు భద్రత ఎక్స్గ్రేషియా రూ.8,00,000, కార్పస్ ఫండ్ రూ.50,000, విడోస్ ఫండ్ రూ.10,000 చెక్కులను జిల్లా ఎస్పీ కార్యాలయంలో ఎస్పీ డీవీ శ్రీనివాసరావు అందజేశారు. కానిస్టేబుల్ కుటుంబ స్థితిగతులను అడిగి తెలుసుకున్నారు. ప్రభుత్వపరంగా చెందే ఇతర బెనిఫిట్లను అందేలా చూస్తామన్నారు.
News April 22, 2025
త్వరలో 18 APPSC నోటిఫికేషన్లు: ప్రభుత్వం

AP: నిరుద్యోగులకు రాష్ట్ర ప్రభుత్వం మరో గుడ్ న్యూస్ చెప్పింది. త్వరలో 18 నోటిఫికేషన్లు విడుదల చేసేందుకు APPSC రెడీగా ఉన్నట్లు వివరించింది. ఎస్సీ వర్గీకరణకు తగ్గట్లు రోస్టర్ పాయింట్లు ఉంటాయంది. ఈ 18 నోటిఫికేషన్లకు సంబంధించి ప్రభుత్వంలోని వివిధ శాఖల్లో 866 పోస్టులు భర్తీ చేయనున్నట్లు సమాచారం. ఇటీవల ప్రభుత్వం మెగా డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేసిన విషయం తెలిసిందే.