News February 25, 2025

48 గంటల పాటు సైలెన్స్ పీరియడ్: ఇలా త్రిపాఠి

image

ఈనెల 27న జరగనున్న వరంగల్- ఖమ్మం – నల్గొండ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ నేపథ్యంలో 48 గంటలు సైలెన్స్ పీరియడ్ అమలులో ఉంటుందని ఎమ్మెల్సీ ఎన్నికల రిటర్నింగ్ అధికారి, కలెక్టర్ ఇలా త్రిపాఠి ఒక ప్రకటనలో తెలిపారు. సైలెన్స్ పీరియడ్‌లో భాగంగా ఇవాళ సాయంత్రం 4 గంటల నుంచి 27సాయంత్రం 4 గంటల వరకు సభలు, ఊరేగింపులు, ప్రచారాలు నిషేధమని చెప్పారు.

Similar News

News February 25, 2025

35సార్లు ఢిల్లీ వెళ్లి రేవంత్ చేసిందేంటి?: కేటీఆర్

image

TG: 15 నెలల కాంగ్రెస్ ప్రభుత్వాన్ని చూసి ప్రజలకు విసుగు వచ్చిందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. సీఎం రేవంత్ 35 సార్లు ఢిల్లీ వెళ్లి ఏం సాధించారు? ఇవాళ మళ్లీ హస్తిన వెళ్లి చేసేదేంటని ప్రశ్నించారు. ‘గత 48 గంటల్లో ఏడుగురు రైతులు ఆత్మహత్య చేసుకున్నారు. SLBCలో ఎనిమిది మంది ఇరుక్కుపోయారు. రేవంత్ మాత్రం ఎన్నికల ప్రచారంలో బిజీగా ఉన్నారు’ అని ఫైరయ్యారు.

News February 25, 2025

నోడల్ ఆఫీసర్లదే కీలక పాత్ర: కలెక్టర్

image

ఈ నెల 27న జిల్లాలో జరగనున్న పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ సజావుగా నిర్వహించడంలో నోడల్ అధికారుల పాత్రే కీలకమని కృష్ణాజిల్లా కలెక్టర్ డీకే బాలాజీ అన్నారు. మంగళవారం ఉదయం కలెక్టరేట్ లో నోడల్ ఆఫీసర్లతో కలెక్టర్ ప్రత్యేక సమావేశం నిర్వహించారు. జిల్లాలో 77 పోలింగ్ కేంద్రాలలో పోలింగ్ నిర్వహణకు అన్ని ఏర్పాట్లు చేశామన్నారు.

News February 25, 2025

మల్లాపూర్: పచ్చదనం నింపుకున్న చెట్టు

image

జగిత్యాల జిల్లా మల్లాపూర్ మండలం నడికుడ గ్రామంలోని ఒక చెట్టు నిండుగా ఆకుపచ్చ ఆకులతో మనసుని ఆకట్టుకుంటుంది. కొత్తగా ఆకులు చిగురించడంతో చెట్టు మొత్తం పచ్చని ఆకులతో వత్తుగా పెరగడంతో, పచ్చదనంతో చూడగానే మనసుని ఆకర్షించేలా కనిపిస్తుంది. ఈ అరుదైన దృశ్యం కెమెరాకి మంగళవారం చిక్కింది. మీకు ఎలా అనిపిస్తుందో కామెంట్ చేయండి.

error: Content is protected !!