News February 25, 2025

48 గంటల పాటు సైలెన్స్ పీరియడ్: ఇలా త్రిపాఠి

image

ఈనెల 27న జరగనున్న వరంగల్- ఖమ్మం – నల్గొండ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ నేపథ్యంలో 48 గంటలు సైలెన్స్ పీరియడ్ అమలులో ఉంటుందని ఎమ్మెల్సీ ఎన్నికల రిటర్నింగ్ అధికారి, కలెక్టర్ ఇలా త్రిపాఠి ఒక ప్రకటనలో తెలిపారు. సైలెన్స్ పీరియడ్‌లో భాగంగా ఇవాళ సాయంత్రం 4 గంటల నుంచి 27సాయంత్రం 4 గంటల వరకు సభలు, ఊరేగింపులు, ప్రచారాలు నిషేధమని చెప్పారు.

Similar News

News December 10, 2025

పోలింగ్‌కు కట్టుదిట్టమైన బందోబస్త్: రామగుండం సీపీ

image

మొదటి విడత పంచాయితీ పోలింగ్‌కు కట్టుదిట్టమైన పోలీస్ బందోబస్త్ ఏర్పాటు చేసినట్లు రామగుండం పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా తెలిపారు. స్వేచ్ఛగా, నిష్పక్షపాతంగా, శాంతియుతంగా ఎన్నికల నిర్వహణే లక్ష్యమని పేర్కొన్నారు. ఎన్నికల ఫలితాలు వెల్లడయ్యే వరకు ఎక్కడ ఎలాంటి అవాంఛనీయ ఘటనలు, అల్లర్లు, గొడవలు జరగకుండా ముందస్తు బందోబస్తు ఏర్పాట్లు చేశామన్నారు.

News December 10, 2025

VJA: భవానీ దీక్షల విరమణ ఏర్పాట్లపై ఇన్‌ఛార్జ్ కలెక్టర్ సమీక్ష

image

ఇంద్రకీలాద్రిపై ఈ నెల 11 నుంచి 15వ తేదీ వరకు జరగనున్న భవానీ దీక్షల విరమణ కార్యక్రమ ఏర్పాట్లను ఇన్‌ఛార్జ్ కలెక్టర్ ఎస్. ఇలక్కియా బుధవారం పరిశీలించారు. దాదాపు 6 లక్షల మంది భక్తులు హాజరవుతారని అంచనా వేసినట్లు తెలిపారు. భక్తుల భద్రత, మౌలిక వసతుల కల్పనపై ప్రత్యేక దృష్టి సారించినట్లు పేర్కొన్నారు. ఆర్డీవో, ఈవో, పోలీసు అధికారులతో కలిసి ఆమె క్షేత్ర స్థాయిలో పర్యవేక్షించారు.

News December 10, 2025

VZM: పోలీస్ అధికారులకు ఎస్పీ ఆదేశాలు

image

ఈనెల 13న జరగనున్న జాతీయ లోక్ అదాలత్‌లో ఎక్కువ కేసులు రాజీ ద్వారా పరిష్కరించేలా ముందస్తు చర్యలు చేపట్టాలని ఎస్పీ ఏ.ఆర్.దామోదర్ అధికారులకు బుధవారం ఆదేశాలు ఇచ్చారు. పోలీసు స్టేషన్ స్థాయిలోనే రాజీ అయ్యే అవకాశం ఉన్న కుటుంబ వివాదాలు, ఆస్తి తగాదాలు, ట్రాఫిక్ కేసులు, చిన్న క్రిమినల్ కేసులు, ఎక్సైజ్ కేసులు, పెండింగ్ చలాన్లను ముందుగా గుర్తించాలని సూచించారు.