News February 26, 2025
48 గంటలు సైలెన్స్ పీరియడ్ అమలు:కలెక్టర్

టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికలు ఉన్నందున 48 గంటలపాటు సైలెన్స్ పీరియడ్ అమలులో ఉంటుందని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ జితేష్ వి పాటిల్ ప్రకటించారు. ఈ సైలెన్స్ పీరియడ్లో సభలు సమావేశాలు, రాజకీయపరమైన సంక్షిప్త సందేశాలు బల్క్ ఎస్ఎంఎస్ పంపడం పై నిషేధం విధించినట్లు చెప్పారు. సోషల్ మీడియాలో వచ్చే సందేశాలను నిశితంగా పర్యవేక్షిస్తున్నామని అన్నారు. ఉత్తర్వులు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తప్పవన్నారు.
Similar News
News January 8, 2026
మిరపలో పూత, కాయతొలుచు పురుగు నివారణ

చలి తీవ్రత పెరిగిన ప్రస్తుత తరుణంలో మిరప పంటలో పూత పురుగు, కాయ తొలుచు పురుగు ఉద్ధృతి కూడా ఎక్కువగా ఉంటుంది. ☛ మిరపలో పూత పురుగు నివారణకు లీటరు నీటికి కార్బోసల్ఫాన్ 1.6ml మందును 1500 పి.పి.ఎం వేపనూనె 5mlతో కలిపి పిచికారీ చేయాలి.
☛ మిరపలో కాయతొలుచు పురుగు నివారణకు లీటరు నీటికి ఫ్లూబెండమైడ్ + థయాక్లోప్రిడ్ 0.5 మి.లీ. లేదా ఎమామెక్టిన్ బెంజోయేట్+ ఫిప్రోనిల్ 1.2 మి.లీ. మందును కలిపి పిచికారీ చేయాలి.
News January 8, 2026
పీపీపీలతో నష్టం ఉండదు: NMC ఛైర్మన్

AP: వైద్య విద్యను సామాన్యులకు చేరువ చేయడమే జాతీయ వైద్య కమిషన్(NMC) లక్ష్యమని ఛైర్మన్ అభిజాత్ చంద్రకాంత్ తెలిపారు. ఎన్టీఆర్ హెల్త్ వర్సిటీలో ఆయన మాట్లాడుతూ మెడికల్ విభాగంలో PPPతో నష్టం ఉండదన్నారు. రోగులకు ఉచిత/రాయితీతో చికిత్సలు అందుతాయని చెప్పారు. ఇప్పటి వరకు PPP కింద నాన్ ప్రాఫిట్ కంపెనీలకు మాత్రమే అనుమతిచ్చామని, ఇకపై కార్పొరేట్ కంపెనీలకూ లీజుకు ఇచ్చేందుకు కొన్ని సవరణలు చేశామని పేర్కొన్నారు.
News January 8, 2026
KNR: విచ్చలవిడిగా నకిలీ వైద్యం.. ప్రాణాలతో చెలగాటం!

ఉమ్మడి జిల్లాలో RMP, PMPలు నకిలీ వైద్యం చేస్తూ ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్నట్లు ఆరోపణలు వస్తున్నాయి. అనవసరంగా సెలైన్లు పెడుతూ, ఓవర్ డోస్ మందులిస్తూ, కమిషన్ కోసం కార్పొరేట్ ఆసుపత్రులకు రెఫర్ చేస్తూ సొమ్ము చేసుకుంటున్నారు. ప్రథమ చికిత్స మాత్రమే చేయాలని మెడికల్ కౌన్సిల్ హెచ్చరిస్తున్నప్పటికీ, ఇటీవల తిమ్మాపూర్(M) పోరండ్లకి చెందిన రవీందర్ రెడ్డి నకిలీ వైద్యం చేస్తూ TMC తనిఖీల్లో పట్టుబడ్డారు.


