News February 26, 2025
48 గంటలు సైలెన్స్ పీరియడ్ అమలు:కలెక్టర్

టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికలు ఉన్నందున 48 గంటలపాటు సైలెన్స్ పీరియడ్ అమలులో ఉంటుందని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ జితేష్ వి పాటిల్ ప్రకటించారు. ఈ సైలెన్స్ పీరియడ్లో సభలు సమావేశాలు, రాజకీయపరమైన సంక్షిప్త సందేశాలు బల్క్ ఎస్ఎంఎస్ పంపడం పై నిషేధం విధించినట్లు చెప్పారు. సోషల్ మీడియాలో వచ్చే సందేశాలను నిశితంగా పర్యవేక్షిస్తున్నామని అన్నారు. ఉత్తర్వులు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తప్పవన్నారు.
Similar News
News January 3, 2026
షమీ కెరీర్ ముగిసినట్టేనా?

ఒకప్పుడు టీమ్ఇండియా విజయాల్లో కీలక పాత్ర పోషించిన మహమ్మద్ షమీ న్యూజిలాండ్తో <<18752620>>సిరీస్<<>>కు ఎంపిక కాలేదు. దేశవాళీ క్రికెట్లో వికెట్లు తీస్తున్నా సెలక్టర్లు కరుణించలేదు. 2023 వన్డే ప్రపంచకప్లో హయ్యెస్ట్ వికెట్ టేకర్గా నిలిచిన బౌలర్ ఇప్పుడు ఒక్క అవకాశం కోసం ఎదురు చూస్తున్నారు. గాయాల నుంచి కోలుకుని ఫిట్నెస్ నిరూపించుకున్నా ఛాన్స్లు రావడం లేదు. షమీ కెరీర్ ముగిసినట్లేనా అనే ప్రశ్నలు వస్తున్నాయి.
News January 3, 2026
24,49,117 మందికి NTR వైద్యసేవలు: సత్యకుమార్

AP: NTR వైద్యసేవ కింద 2025 DEC వరకు 24,49,117 మందికి సేవలందించినట్లు మంత్రి సత్యకుమార్ వెల్లడించారు. ‘గతంతో పోలిస్తే 21% వృద్ధి నమోదైంది. YCP ఐదేళ్ల పాలనలో ఆరోగ్యశ్రీ కింద ₹11,577 కోట్లు ఖర్చు చేస్తే కూటమి ప్రభుత్వం గత 19 నెలల్లోనే NTR వైద్య సేవ కింద ₹6,530 కోట్లు వెచ్చించింది. ఏడాదికి రూ.2,124 కోట్లు ఎక్కువగా ఖర్చు చేశాం’ అని వైద్యసేవల అమలుపై సమీక్ష సందర్భంగా వివరించారు.
News January 3, 2026
డ్వాక్రా సంఘాల ద్వారా ఆర్థిక సాయం అందించాలి: కలెక్టర్

ఇందిరమ్మ ఇళ్లు, రెండు పడకల గదుల నిర్మాణం పై MHBD కలెక్టర్ అద్వైత్ కుమార్ సింగ్, అన్ని మండలాల ఎంపీడీవోలు, మున్సిపల్ కమిషనర్లతో సమీక్ష నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ.. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలను వేగవంతం చేయాలన్నారు. లబ్ధిదారులకు డ్వాక్రా సంఘాల ద్వారా ఆర్థిక సహాయం అందించాలని సూచించారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్లు లెనిన్ వత్సల్ టొప్పో, అనిల్ కుమార్, హౌసింగ్ ప్రాజెక్ట్ డైరెక్టర్ ఉన్నారు.


