News October 22, 2025

48 మందికి మాత్రమే అనుమతి: పోలీసులు

image

మత్స్యకారులు చేస్తున్న ఉద్యమానికి సంఘీభావం తెలియచేసేందుకు బుధవారం ఛలో రాజయ్యపేటకు వైసీపీ పిలుపునిచ్చిన నేపథ్యంలో 48 మందికి మాత్రమే పోలీసులు అనుమతి ఇచ్చారు. ఈ విషయాన్ని పాయకరావుపేట సీఐ అప్పన్న మంగళవారం ఓ ప్రకటనలో తెలిపారు. గ్రామాన్ని సందర్శించేందుకు పోలీసులను అనుమతి కోరిన 48 మందికి మాత్రమే అవకాశం ఇచ్చినట్లు పేర్కొన్నారు. ఈ విషయాన్ని పార్టీ నాయకులు గమనించి పోలీసులకు సహకరించాలన్నారు.

Similar News

News October 22, 2025

ఆసియా కప్‌ను నేనే ఇస్తా: మోహ్సిన్ నఖ్వీ

image

ఆసియా కప్‌ను భారత్‌కు తానే అప్పగిస్తానని ACC ఛైర్మన్ మోహ్సిన్ నఖ్వీ స్పష్టం చేసినట్లు తెలుస్తోంది. ట్రోఫీని భారత్‌కు అప్పగించాలని నఖ్వీకి BCCI లేఖ రాసింది. ‘ఒక వేడుక ఏర్పాటు చేస్తాం. BCCI ఆఫీస్ హోల్డర్, విన్నింగ్ టీమ్‌లో అందుబాటులో ఉన్న ఏ ప్లేయర్‌తోనైనా వచ్చి ట్రోఫీ కలెక్ట్ చేసుకోండి’ అని నఖ్వీ చెప్పినట్లు GEO న్యూస్ పేర్కొంది. ఈ విషయాన్ని ICC వద్దే తేల్చుకోవాలని BCCI ఫిక్సైనట్లు తెలుస్తోంది.

News October 22, 2025

రైళ్ళ రాకపోకలు ఆలస్యం: SCR

image

పలు రైళ్ల రాకపోకలు ఆలస్యంగా నడవనున్నట్లు SCR పేర్కొంది.
T.No.12722 HYD దక్షిణ్ 10.30Hrs
T.No.12648 కొంగు SF 2.40Hrs
T.No.12628 కర్ణాటక SF 9.45Hrs
T.No.12486 నాందేడ్ SF 10Hrs
T.No.12804 స్వర్ణ జయంతి SF రైళ్లు కొన్ని గంటల పాటు నేడు PDPL మీదుగ ఆలస్యంగా నడవనున్నట్లు దక్షిణ మధ్య రైల్వే అధికారులు పేర్కొన్నారు. అయితే, రైల్వే ప్రయాణికులు గమనించాలని ఓ ప్రకటనలో సూచించారు.

News October 22, 2025

TG న్యూస్ రౌండప్

image

☛ రాష్ట్రంలోని అన్ని ట్రాన్స్‌పోర్ట్ చెక్ పోస్టులు సా.5గంటల లోపు మూసేయాలని రవాణాశాఖ కమిషనర్ ఆదేశాలు
☛ నల్గొండ: మైనర్‌పై అత్యాచారం కేసు.. నిందితుడు చందుకు 32ఏళ్ల జైలు శిక్ష విధిస్తూ పోక్సో కోర్టు తీర్పు
☛ రెండేళ్లలో ఉస్మానియా నూతన ఆస్పత్రి నిర్మాణం పూర్తి చేయాలి: ఉన్నతాధికారులతో సమీక్షలో సీఎం రేవంత్ ఆదేశాలు