News September 18, 2024

నెలలోనే 48 మంది శిశువులు మృతి.. KTR ఫైర్

image

గాంధీ ఆస్పత్రిలో ఆగస్టు నెలలో 48 మంది పసిపిల్లలు, 14 మంది బాలింతలు చనిపోవడంపై కేటీఆర్ ఫైరయ్యారు. ‘ఇది ఊహించుకుంటేనే ఒళ్లు జ‌ల‌ద‌రిస్తోంది. రాష్ట్రంలో ప్ర‌భుత్వం ఉందా? వ్య‌వ‌స్థ‌లు ప‌నిచేస్తున్నాయా? ఎంతో మందికి ప్రాణం పోసిన గాంధీలో ఇంత విషాదం ఎవ‌రి పాపం? ఒక్క ఆస్పత్రిలోనే ఇలా ఉంటే రాష్ట్రం మొత్తం ఇంకెలా ఉందో. పాల‌న గాలికి వ‌దిలి విగ్ర‌హ రాజ‌కీయాలు చేస్తే ఇలానే ఉంటుంది’ అని మండిపడ్డారు.

Similar News

News November 21, 2025

బీసీలకు 22% రిజర్వేషన్లు ఖరారు!

image

TG: త్వరలో జరగనున్న పంచాయతీ ఎన్నికల్లో బీసీలకు 22శాతం రిజర్వేషన్లు ఖరారు చేసినట్లు విశ్వసనీయ సమాచారం. బీసీలకు 42శాతం ఇవ్వాలని ప్రభుత్వం భావించినా కోర్టు కేసుల వల్ల సాధ్యపడలేదు. దీంతో 2019లో ఇచ్చినట్లే రాష్ట్రవ్యాప్తంగా 22శాతం ఇవ్వనుంది. కొత్తగా ఏర్పడిన మున్సిపాలిటీల్లో కలవడం వల్ల మండలాల వారీగా బీసీ రిజర్వేషన్లలో హెచ్చుతగ్గులు ఉండే అవకాశం ఉంది.

News November 21, 2025

బెట్టింగ్ యాప్స్ కేసు.. విచారణకు నిధి, శ్రీముఖి

image

బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ కేసులో టాలీవుడ్ హీరోయిన్ నిధి అగర్వాల్, యాంకర్ శ్రీముఖి, అమృత చౌదరి సీఐడీ విచారణకు హాజరయ్యారు. యాప్స్ ప్రమోషన్స్, డబ్బుల లావాదేవీలపై అధికారులు వారిని ప్రశ్నించనున్నారు. ఈ కేసులో ఇప్పటికే రానా, ప్రకాశ్ రాజ్ తదితరులను సీఐడీ విచారించింది.

News November 21, 2025

బెట్టింగ్ యాప్స్ కేసు.. విచారణకు నిధి, శ్రీముఖి

image

బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ కేసులో టాలీవుడ్ హీరోయిన్ నిధి అగర్వాల్, యాంకర్ శ్రీముఖి, అమృత చౌదరి సీఐడీ విచారణకు హాజరయ్యారు. యాప్స్ ప్రమోషన్స్, డబ్బుల లావాదేవీలపై అధికారులు వారిని ప్రశ్నించనున్నారు. ఈ కేసులో ఇప్పటికే రానా, ప్రకాశ్ రాజ్ తదితరులను సీఐడీ విచారించింది.