News September 18, 2024
నెలలోనే 48 మంది శిశువులు మృతి.. KTR ఫైర్

గాంధీ ఆస్పత్రిలో ఆగస్టు నెలలో 48 మంది పసిపిల్లలు, 14 మంది బాలింతలు చనిపోవడంపై కేటీఆర్ ఫైరయ్యారు. ‘ఇది ఊహించుకుంటేనే ఒళ్లు జలదరిస్తోంది. రాష్ట్రంలో ప్రభుత్వం ఉందా? వ్యవస్థలు పనిచేస్తున్నాయా? ఎంతో మందికి ప్రాణం పోసిన గాంధీలో ఇంత విషాదం ఎవరి పాపం? ఒక్క ఆస్పత్రిలోనే ఇలా ఉంటే రాష్ట్రం మొత్తం ఇంకెలా ఉందో. పాలన గాలికి వదిలి విగ్రహ రాజకీయాలు చేస్తే ఇలానే ఉంటుంది’ అని మండిపడ్డారు.
Similar News
News September 8, 2025
బిగ్బాస్ సీజన్-9 కంటెస్టెంట్లు వీరే..

బిగ్బాస్ సీజన్-9లో మొత్తం 15 మంది కంటెస్టెంట్లు హౌస్లోకి ఎంట్రీ ఇచ్చారు. సెలబ్రిటీ కోటాలో తనూజ(ముద్ద మందారం), నటి ఆశా సైనీ, కమెడియన్లు సుమన్ శెట్టి, ఇమ్మాన్యుయేల్, కొరియోగ్రఫర్ శ్రష్ఠి వర్మ, సీరియల్ నటుడు భరణి శంకర్, రీతూ చౌదరీ, నటి సంజనా గల్రానీ, ఫోక్ డాన్సర్ రాము రాథోడ్, సామాన్యుల నుంచి సోల్జర్ పవన్, మాస్క్ మ్యాన్ హరీశ్, డిమాన్ పవన్, దమ్ము శ్రీజ, ప్రియా శెట్టి, మర్యాద మనీశ్ లోనికి వెళ్లారు.
News September 8, 2025
గీతా ఆర్ట్స్ ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ కన్నుమూత

నిర్మాత అల్లు అరవింద్ సన్నిహితుడు, గీతా ఆర్ట్స్ ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ నాగరాజు(76) కన్నుమూశారు. అనారోగ్య కారణాలతో ఆయన చనిపోయినట్లు సినీ వర్గాలు తెలిపాయి. ఇవాళ ఉదయం నాగరాజు అంత్యక్రియలు HYDలో జరిగాయి. అంతకుముందు దర్శకుడు రవిరాజా పినిశెట్టి, బన్నీ వాసు, బండ్ల గణేశ్ తదితరులు మృతదేహానికి నివాళులు అర్పించారు. కొన్ని రోజుల క్రితం అల్లు అరవింద్ తల్లి మరణించిన సంగతి తెలిసిందే.
News September 7, 2025
గ్రహణం తర్వాత ఏం చేయాలంటే?

చంద్ర గ్రహణం తర్వాత ఉదయం లేచాక ఇంటిని శుభ్రం చేయాలని, వస్తువులపై పవిత్ర నది జలాలను చల్లి శుద్ధి చేయాలని పండితులు చెబుతున్నారు. రాత్రి మిగిలిన ఆహారాన్ని పడవేయడంతో పాటు తల స్నానం చేయాలని సూచిస్తున్నారు. దీంతో పాటు పేదలకు దుస్తులు, ఆహారం, పాలు, బియ్యం, చక్కెర వంటివి దానం చేస్తే మేలని చెబుతున్నారు. ఇప్పటికే ప్రారంభమైన చంద్రగ్రహణం అర్ధరాత్రి 2.25గంటల తర్వాత వీడనుంది.