News February 26, 2025
48 గంటలు సైలెన్స్ పీరియడ్ అమలు:కలెక్టర్

టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికలు ఉన్నందున 48 గంటలపాటు సైలెన్స్ పీరియడ్ అమలులో ఉంటుందని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ జితేష్ వి పాటిల్ ప్రకటించారు. ఈ సైలెన్స్ పీరియడ్లో సభలు సమావేశాలు, రాజకీయపరమైన సంక్షిప్త సందేశాలు బల్క్ ఎస్ఎంఎస్ పంపడం పై నిషేధం విధించినట్లు చెప్పారు. సోషల్ మీడియాలో వచ్చే సందేశాలను నిశితంగా పర్యవేక్షిస్తున్నామని అన్నారు. ఉత్తర్వులు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తప్పవన్నారు.
Similar News
News February 26, 2025
చరిత్ర సృష్టించిన అఫ్గాన్ ప్లేయర్ జద్రాన్

అఫ్గానిస్థాన్ క్రికెటర్ ఇబ్రహీం జద్రాన్ చరిత్ర సృష్టించారు. వన్డే వరల్డ్ కప్, ఛాంపియన్స్ ట్రోఫీలో సెంచరీలు చేసిన ఏకైక అఫ్గాన్ ఆటగాడిగా ఆయన నిలిచారు. WCలో ఆస్ట్రేలియాపై, CTలో ఇంగ్లండ్పై శతకాలు బాదారు. మరే అఫ్గాన్ ప్లేయర్ ఈ రెండు మెగా టోర్నీల్లో శతకాలు బాదలేదు. కాగా ఇంగ్లండ్తో జరుగుతున్న మ్యాచులో జద్రాన్ (177) సెంచరీతో మెరిశారు. 146 బంతుల్లో 12 ఫోర్లు, 6 సిక్సర్లతో శతకం పూర్తి చేసుకున్నారు.
News February 26, 2025
మీ అకౌంట్లో డబ్బులు పడ్డాయా?

TG: ఇందిరమ్మ ఆత్మీయ భరోసా కింద ఉమ్మడి మహబూబ్నగర్, రంగారెడ్డి జిల్లాల్లోని 66,240 కూలీల ఖాతాల్లో ప్రభుత్వం రూ.6000 చొప్పున జమ చేసింది. ఇప్పటివరకు మొత్తం 83,420 మందికి రూ.50.65 కోట్లు జమ చేశామంది. ఎన్నికల కోడ్ ముగియగానే మిగతా లబ్ధిదారులకు ఆత్మీయ భరోసా నిధులను చెల్లిస్తామంది. అత్యధికంగా వికారాబాద్ జిల్లాలో 18,231 మందికి జమ చేసినట్లు వెల్లడించింది. మీ ఖాతాలో డబ్బులు జమ అయ్యాయా? కామెంట్ చేయండి.
News February 26, 2025
కోనసీమ మోనాలిసా అంటూ పోస్టింగ్.. కేసు నమోదు

మైనర్ బాలికపై ఇంస్టాగ్రామ్లో పోస్టింగ్ పెట్టి ఆమెను మనస్తాపానికి గురిచేసిన వ్యక్తిపై కేసు నమోదు చేశామని ఎస్ఐ జ్వాలాసాగర్ బుధవారం తెలిపారు. సిహెచ్ గున్నేపల్లి సత్తెమ్మ తల్లి తీర్థంలో అమలాపురానికి చెందిన మైనర్ బాలిక పూసలు అమ్ముకుంటుందన్నారు. అమలాపురం చింతాడ గరువుకు చెందిన దేవిశ్రీప్రసాద్ వీడియోలు తీసి ఇంస్టాగ్రామ్లో కోనసీమ మోనాలిసా అంటూ పోస్టింగ్ చేశాడన్నారు. దీనిపై బాలిక పినతల్లి ఫిర్యాదు చేశారు.