News April 28, 2024
486 సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలు: కలెక్టర్

ఎలాంటి ఆటంకాలు లేకుండా ఎన్నికలు సజావుగా, స్వేచ్ఛగా జరిగేలా అధికారులు చర్యలు తీసుకోవాలని కలెక్టర్ దినేష్ కుమార్ ఆదేశించారు. ఒంగోలులోని ప్రకాశం భవనంలో ఎన్నికల నిర్వహణకు తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి అధికారులతో సమావేశం నిర్వహించారు. జిల్లా వ్యాప్తంగా 2,183 పోలింగ్ కేంద్రాలు ఉండగా అందులో 486 సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలు ఉన్నాయని చెప్పారు. పోలీస్ అధికారులు అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలన్నారు.
Similar News
News November 23, 2025
వాహనదారులకు ప్రకాశం పోలీస్ కీలక సూచనలు.!

*హైవేల్లో భారీ ప్రమాదాలకు కారణం నిద్ర మత్తు
*నిద్రమత్తు వల్లే ప్రమాదాలు జరిగే అవకాశాలు ఎక్కువ
*మీతోపాటు ప్రయాణికుల, పాదచారుల ప్రాణాలకు ముప్పు
*నిద్రమత్తు అనిపిస్తే వెంటనే వాహనం సైడుకు ఆపి 10-20 నిమిషాలు విశ్రాంతి తీసుకోవాలి
*ప్రయాణం మొదలు పెట్టే ముందు సరిపోయేలా నిద్రపోవాలి
*దీర్ఘ ప్రయాణాల్లో 2 గంటలకు ఒకసారి బ్రేక్ తీసుకోండి.
*వాహనదారులు రహదారి భద్రతా నియమాలు పాటించండి.
News November 23, 2025
ఒంగోలు: LLR మేళా సక్సెస్.. అందరూ అర్హులే!

ఒంగోలులోని కలెక్టర్ కార్యాలయంలో దివ్యాంగుల కోసం నిర్వహించిన LLR మేళా విజయవంతమైంది. జేసీ గోపాలకృష్ణ ఆదేశాల మేరకు రవాణా శాఖ అధికారులు కలెక్టర్ కార్యాలయం వద్ద LLR మేళా నిర్వహించారు. ఈ మేళాలో మొత్తం 57 మంది పాల్గొని దరఖాస్తులు సమర్పించగా.. 57 మంది ఉత్తీర్ణులు అయినట్లు రవాణా శాఖ అధికారులు సంబంధిత పత్రాలను దివ్యాంగులకు అందజేశారు.
News November 23, 2025
ఒంగోలు: LLR మేళా సక్సెస్.. అందరూ అర్హులే!

ఒంగోలులోని కలెక్టర్ కార్యాలయంలో దివ్యాంగుల కోసం నిర్వహించిన LLR మేళా విజయవంతమైంది. జేసీ గోపాలకృష్ణ ఆదేశాల మేరకు రవాణా శాఖ అధికారులు కలెక్టర్ కార్యాలయం వద్ద LLR మేళా నిర్వహించారు. ఈ మేళాలో మొత్తం 57 మంది పాల్గొని దరఖాస్తులు సమర్పించగా.. 57 మంది ఉత్తీర్ణులు అయినట్లు రవాణా శాఖ అధికారులు సంబంధిత పత్రాలను దివ్యాంగులకు అందజేశారు.


