News April 28, 2024

486 సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలు: కలెక్టర్

image

ఎలాంటి ఆటంకాలు లేకుండా ఎన్నికలు సజావుగా, స్వేచ్ఛగా జరిగేలా అధికారులు చర్యలు తీసుకోవాలని కలెక్టర్ దినేష్ కుమార్ ఆదేశించారు. ఒంగోలులోని ప్రకాశం భవనంలో ఎన్నికల నిర్వహణకు తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి అధికారులతో సమావేశం నిర్వహించారు. జిల్లా వ్యాప్తంగా 2,183 పోలింగ్ కేంద్రాలు ఉండగా అందులో 486 సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలు ఉన్నాయని చెప్పారు. పోలీస్ అధికారులు అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలన్నారు.

Similar News

News November 20, 2025

ప్రకాశం: నూతన అక్రిడిటేషన్‌లకు దరఖాస్తుల ఆహ్వానం

image

జిల్లాలో పనిచేస్తున్న పాత్రికేయులకు రెండేళ్ల కాలపరిమితికి జారీ చేసే నూతన అక్రిడిటేషన్‌లకు దరఖాస్తులు స్వీకరిస్తున్నట్లు కలెక్టర్ రాజాబాబు గురువారం ప్రకటన విడుదల చేశారు. దరఖాస్తులను http://mediarelations.ap.gov.in వెబ్ సైట్‌లో సమర్పించాలన్నారు. అర్హత కలిగిన పాత్రికేయులు పూర్తి వివరాలను వెబ్సైట్లో ఈ నెల 21 నుంచి నమోదు చేయాలని కలెక్టర్ సూచించారు.

News November 20, 2025

ప్రకాశం: నూతన అక్రిడిటేషన్‌లకు దరఖాస్తుల ఆహ్వానం

image

జిల్లాలో పనిచేస్తున్న పాత్రికేయులకు రెండేళ్ల కాలపరిమితికి జారీ చేసే నూతన అక్రిడిటేషన్‌లకు దరఖాస్తులు స్వీకరిస్తున్నట్లు కలెక్టర్ రాజాబాబు గురువారం ప్రకటన విడుదల చేశారు. దరఖాస్తులను http://mediarelations.ap.gov.in వెబ్ సైట్‌లో సమర్పించాలన్నారు. అర్హత కలిగిన పాత్రికేయులు పూర్తి వివరాలను వెబ్సైట్లో ఈ నెల 21 నుంచి నమోదు చేయాలని కలెక్టర్ సూచించారు.

News November 20, 2025

సాగర్ కవచ్‌కు 112 మంది పోలీసుల కేటాయింపు

image

జిల్లాలో ఎస్పీ హర్షవర్ధన్ రాజు ఆదేశాల మేరకు సాగర్ కవచ్‌ను రెండు రోజులపాటు పోలీసులు నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా జిల్లా సముద్ర తీర ప్రాంతంలో మొత్తం 112 మంది పోలీస్ అధికారులు, సిబ్బందిని బందోబస్తు విధులలో కేటాయించారు. సముద్ర మార్గం ద్వారా చొరబాట్లను అడ్డుకోవడం, అనుమానాస్పద వస్తువులను గుర్తించడం వంటి అంశాలపై ప్రత్యేక పోలీస్ బృందాలను సైతం నియమించారు.