News April 28, 2024
486 సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలు: కలెక్టర్

ఎలాంటి ఆటంకాలు లేకుండా ఎన్నికలు సజావుగా, స్వేచ్ఛగా జరిగేలా అధికారులు చర్యలు తీసుకోవాలని కలెక్టర్ దినేష్ కుమార్ ఆదేశించారు. ఒంగోలులోని ప్రకాశం భవనంలో ఎన్నికల నిర్వహణకు తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి అధికారులతో సమావేశం నిర్వహించారు. జిల్లా వ్యాప్తంగా 2,183 పోలింగ్ కేంద్రాలు ఉండగా అందులో 486 సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలు ఉన్నాయని చెప్పారు. పోలీస్ అధికారులు అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలన్నారు.
Similar News
News November 25, 2025
ప్రకాశం SP మీకోసంకు 63 ఫిర్యాదులు.!

ఒంగోలు SP కార్యాలయంలో సోమవారం నిర్వహించిన SP మీకోసం కార్యక్రమానికి 63 ఫిర్యాదులు అందాయి. జిల్లా ఇన్ఛార్జ్ SP ఉమామహేశ్వర ఆదేశాలతో మహిళా పోలీస్ స్టేషన్ DSP రమణకుమార్ ఆధ్వర్యంలో కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా ఫిర్యాదుదారులతో మాట్లాడి వారి సమస్యలను పోలీసు అధికారులు తెలుసుకున్నారు.
News November 24, 2025
ప్రకాశం: పేకాట ఆడేవారిని పట్టించిన వ్యక్తికి రూ.67వేల రివార్డ్.!

ప్రకాశం జిల్లా గిద్దలూరులో పేకాట ఆడిన ఆరుగురికి గిద్దలూరు కోర్టు న్యాయమూర్తి భరత్ చంద్ర 2రోజుల జైలు శిక్ష విధించారు. నిందితుల వద్ద నుంచి రూ.1,35,000 స్వాధీనం చేసుకున్నారు. అందులోని రూ.67,500 నగదు పేకాట ఆడుతున్నవారిని పట్టించిన వ్యక్తికి రివార్డుగా ఇవ్వాలని అధికారులను ఆదేశించారు. పేకాట ఆడటం చట్టరీత్యా నేరమని, అలా ఎవరైనా ఆడితే పోలీసులకు తెలపాలన్నారు.
News November 24, 2025
ప్రకాశం: పేకాట ఆడేవారిని పట్టించిన వ్యక్తికి రూ.67వేల రివార్డ్.!

ప్రకాశం జిల్లా గిద్దలూరులో పేకాట ఆడిన ఆరుగురికి గిద్దలూరు కోర్టు న్యాయమూర్తి భరత్ చంద్ర 2రోజుల జైలు శిక్ష విధించారు. నిందితుల వద్ద నుంచి రూ.1,35,000 స్వాధీనం చేసుకున్నారు. అందులోని రూ.67,500 నగదు పేకాట ఆడుతున్నవారిని పట్టించిన వ్యక్తికి రివార్డుగా ఇవ్వాలని అధికారులను ఆదేశించారు. పేకాట ఆడటం చట్టరీత్యా నేరమని, అలా ఎవరైనా ఆడితే పోలీసులకు తెలపాలన్నారు.


