News December 4, 2024
5.3 తీవ్రతతో భూకంపం!

తెలుగు రాష్ట్రాల్లోని చాలా ప్రాంతాల్లో భూమి కంపించడంతో ప్రజలు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. అత్యధికంగా ములుగులో రిక్టర్ స్కేల్పై 5.3 తీవ్రతతో భూకంపం సంభవించింది. తొలిసారి ఇలాంటి పరిస్థితి ఎదురైందని, కాళ్లు వైబ్రేట్ అవ్వడం గమనించామని WAY2NEWS <<14784831>>యూజర్లు<<>> చెప్తున్నారు. అపార్ట్మెంట్లో 17వ అంతస్తులోనూ వైబ్రేషన్స్ గుర్తించామన్నారు. మరికొందరైతే చచ్చిపోతామేమో అనుకున్నామంటూ ఆందోళన వ్యక్తం చేశారు. SHARE IT
Similar News
News March 17, 2026
ఇరాన్ సుప్రీంలీడర్ స్వలింగ సంపర్కుడు: US

ఇరాన్ సుప్రీంలీడర్ మొజ్తబా ఖమేనీ స్వలింగ సంపర్కుడని US ఇంటెలిజెన్స్ భావిస్తోంది. తన చైల్డ్హుడ్ ట్యూటర్తో రిలేషన్లో ఉన్నట్లు అంచనా వేస్తోంది. ఇదే విషయాన్ని ట్రంప్తో చెప్పగానే ఆయన ఆశ్చర్యంతో బిగ్గరగా నవ్వాడని న్యూయార్క్ పోస్ట్ వెల్లడించింది. వికీలీక్స్లోనూ ఓ ఇరాన్ లీడర్ నపుంసకత్వానికి చికిత్స కోసం UKకు వెళ్లినట్లు పేర్కొన్న విషయాన్ని ప్రస్తావించింది. కాగా ఇరాన్లో స్వలింగ సంపర్కం నేరం.
News March 17, 2026
BREAKING: పెరిగిన బంగారం, వెండి ధరలు

కొన్ని రోజులుగా తగ్గుతూ వస్తోన్న బంగారం, వెండి ధరలు ఇవాళ కాస్త పెరిగాయి. హైదరాబాద్ బులియన్ మార్కెట్లో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,200 పెరిగి రూ.1,58,620కు చేరింది. అలాగే 22 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ రేటు రూ.1,100 ఎగబాకి రూ.1,45,400 పలుకుతోంది. అటు కేజీ వెండి ధర రూ.4వేలు పెరిగి రూ.2,80,000గా ఉంది. తెలుగు రాష్ట్రాల్లోని వివిధ ప్రాంతాల్లో ధరల్లో స్వల్ప తేడాలుండొచ్చు.
News March 17, 2026
జనగణనలో అడిగే ప్రశ్నలివే!

జనగణన-2027లో <<19386795>>భాగంగా<<>> అధికారులు ప్రజల నుంచి 33 ప్రశ్నలకు సమాధానాలను యాప్ ద్వారా సేకరిస్తారు. ముఖ్యంగా ఇంటి యజమాని వివరాలు, సొంతిల్లా/అద్దెదా, నీరు- విద్యుత్ సౌకర్యం, మరుగుదొడ్డి, వంటగ్యాస్, వాహనం, TV& ఫోన్ వంటి కనీస సౌకర్యాల గురించి తెలుసుకుంటారు. అలాగే వ్యక్తిగత వివరాలైన వయసు, లింగం, చదువు, కులం, మతం, మాతృభాష, ఆహార అలవాట్లు, వలస వివరాలు అడుగుతారు. సంక్షేమ పథకాలు అందుతున్నాయో తెలుసుకుంటారు.


