News July 15, 2024

ఇంటి నిర్మాణానికి రూ.5 లక్షలు.. ప్రభుత్వం కీలక నిర్ణయం

image

TG: ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులను గ్రామ సభలు నిర్వహించి ఎంపిక చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. త్వరలోనే ఆదేశాలు ఇవ్వనున్నట్లు సమాచారం. తొలి దశలో సొంత స్థలం ఉన్న వారికి ఆర్థికసాయం, రెండో దశలో స్థలం లేని వారికి స్థలంతో పాటు ఆర్థికసాయం అందజేయనుందట. తొలి దశలో నియోజకవర్గానికి 3,500 ఇళ్ల చొప్పున మంజూరు చేస్తుంది. ఇంటి నిర్మాణానికి లబ్ధిదారులకు ₹5లక్షలను 3 విడతల్లో వారి ఖాతాల్లో జమ చేయనుంది.

Similar News

News October 31, 2025

కిడ్నాప్ నుంచి త్రుటిలో తప్పించుకున్నా: నటి

image

ముంబైలో 20 మంది <<18153268>>కిడ్నాప్<<>>, నిందితుడు రోహిత్ ఆర్య ఎన్‌కౌంటర్ ఘటనపై మరాఠీ నటి రుచితా విజయ్ స్పందించారు. ‘రోహిత్ ఓ ప్రొడ్యూసర్‌గా నాకు పరిచయం. ఓ హోస్టేజ్ చిత్రం గురించి మాట్లాడటానికి OCT 28న కలవాల్సి ఉండగా అనివార్య కారణాలతో మీటింగ్ రద్దు చేసుకున్నా. మరుసటి రోజు అతని గురించి వినగానే షాకయ్యా. రోహిత్ బారిన పడకుండా దేవుడే కాపాడాడు. కొత్త వ్యక్తులతో పరిచయాలపై అప్రమత్తంగా ఉండాలి’ అని పేర్కొన్నారు.

News October 31, 2025

5 కేజీల భారీ నిమ్మకాయలను పండిస్తున్న రైతు

image

నిమ్మకాయ బాగా పెరిగితే కోడిగుడ్డు సైజులో ఉంటుంది. అయితే కర్నాటకలోని కొడుగు జిల్లా పలిబెట్టకు చెందిన విజు సుబ్రమణి అనే రైతు భారీ నిమ్మకాయలను పండిస్తున్నారు. ఇవి ఒక్కోటి పెద్ద సైజులో 5 కేజీల వరకు బరువు ఉన్నాయి. కొన్నేళ్ల క్రితం మైసూరు వెళ్లినప్పుడు అక్కడ మార్కెట్‌లో నిమ్మ విత్తనాలను కొని తన కాఫీ తోటలో సుబ్రమణి నాటారు. మూడేళ్ల తర్వాత నుంచి వాటిలో 2 మొక్కలకు ఈ భారీ సైజు నిమ్మకాయలు కాస్తున్నాయి.

News October 31, 2025

రూ.1,032 కోట్ల బకాయిలు, బిల్లులు విడుదల

image

TG: ప్రభుత్వ ఉద్యోగుల బకాయిలు, పంచాయతీరాజ్, R&B శాఖల పెండింగ్ బిల్లులకు సంబంధించి రూ.1,032 కోట్లను ఆర్థికశాఖ విడుదల చేసింది. పెండింగ్‌లో ఉన్న ఉద్యోగుల బకాయిలను దశలవారీగా ప్రతినెలా Dy.CM భట్టి క్లియర్ చేస్తూ వస్తున్నారు. అందులో భాగంగా OCT నెలకు సంబంధించి ఉద్యోగుల బకాయిలు రూ.712 కోట్లు, పంచాయతీరాజ్ R&Bకి రూ.320 కోట్లు విడుదల చేశారు. దీంతో రూ.10లక్షల లోపు ఉన్న పెండింగ్ బిల్లులు క్లియర్ కానున్నాయి.