News March 10, 2025

’50 శాతం స్థానాలు ఓబీసీలకు కేటాయించాలి’

image

దేశ జనాభాలో ఓబీసీల సంఖ్య 50 శాతానికి మించి ఉన్నందున, మొత్తం పార్లమెంటు స్థానాలలో 50 శాతం ఓబీసీలకు కేటాయించాలని బీసీ సంఘం ఉమ్మడి విశాఖ జిల్లా అధ్యక్షుడు భోగి రమణ డిమాండ్ చేశారు. డాబాగార్డెన్స్‌లోని విజెఎఫ్ ప్రెస్ క్లబ్‌లో ఛలో ఢిల్లీ పోస్టర్‌ను ఆవిష్కరించారు. జాతీయ బీసీ సంఘం అధ్యక్షులు ఆర్.కృష్ణయ్య ఆదేశాల మేరకు ఈనెల 12,13 తేదీలలో న్యూఢిల్లీలో ఓబీసీ మేధావులతో రౌండ్ టేబుల్ సమావేశం ఉందని తెలిపారు.

Similar News

News March 17, 2026

జీవీఎంసీలో ప్రత్యేక అధికారుల పాలన చరిత్ర(2/2)

image

విశాఖ జీవీఎంసీలో పలుమార్లు ప్రత్యేక అధికారుల పాలన కొనసాగింది. 2000-2007 ఏళ్ల మధ్య ఎక్కువ కాలం ప్రత్యేక అధికారుల పాలన సాగింది. 2012 నుంచి 2021 వరకు సుమారు 9 ఏళ్లపాటు కూడా ఎన్నికలు జరగక జిల్లా కలెక్టర్లే ప్రత్యేక అధికారులుగా వ్యవహరించారు. ఈ సమయంలో కార్పొరేషన్‌ పాలన, అభివృద్ధి పనులు అధికారుల ఆధ్వర్యంలోనే సాగాయి. 2021లో ఎన్నికలు జరిగి ప్రజాప్రతినిధులు బాధ్యతలు చేపట్టి అయిదేళ్ల ప్రయాణం పూర్తి చేశారు.

News March 17, 2026

జీవీఎంసీలో ప్రత్యేక పాలన అమలు(1/2)

image

విశాఖ గ్రేటర్ మున్సిపల్ కార్పొరేషన్‌(జీవీఎంసీ)లో ఎన్నికైన మేయర్‌తో పాటు కార్పొరేటర్ల పదవీకాలం మంగళవారంతో ముగిసింది. దీంతో రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక పాలన అమలు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఇకపై జీవీఎంసీ ప్రత్యేక అధికారిగా జిల్లా కలెక్టర్ ఎం.ఎన్. హరేంధిర ప్రసాద్ బాధ్యతలు నిర్వహించనున్నారు. ఎన్నికైన ప్రతినిధుల పదవీకాలం ముగియడంతో కార్పొరేటర్ల అధికారాలు కూడా ముగిశాయి.

News March 17, 2026

విశాఖ: రైల్వే ట్రాక్‌పై వ్యక్తి ఆత్మహత్య

image

విశాఖపట్నం మర్రిపాలెం రైల్వే స్టేషన్ సమీపంలో ట్రాక్‌పై వ్యక్తి ఆత్మహత్య చేసుకున్న ఘటన సోమవారం చోటుచేసుకుంది. ఈ ఘటనలో సుమారు 40-45 ఏళ్ల గుర్తుతెలియని వ్యక్తి మృతి చెందాడు. మృతుడి పేరు, చిరునామా తెలియరాలేదని జీఆర్‌పీ పోలీసులు తెలిపారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. వివరాలు తెలిసిన వారు 93463 48929 నంబరుకు సమాచారం ఇవ్వాలని కోరారు.