News March 15, 2025

హైదరాబాద్ నుంచే 50% ఆదాయం!

image

TG: 2022-23 లెక్కల ప్రకారం రాష్ట్ర జీడీపీలో హైదరాబాద్ వాటా 50.41%గా ఉందని తాజాగా వెల్లడైంది. దీని ప్రకారం మిగతా జిల్లాలు ఆశించినంతగా ఆదాయం తీసుకురావట్లేదని అర్థమవుతోంది. దేశంలోని ఏ రాష్ట్రంలోనూ ఒక్క నగరం ఇంత సంపద తీసుకురావట్లేదు. ముంబై ఆదాయం 36.3%, బెంగళూరు 40.91%, చెన్నై 31.59%గా ఉంది. మిగతా జిల్లాలను కూడా అభివృద్ధి చేయాల్సిన అవసరం ఉందని, వికేంద్రీకరణ జరగాలని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

Similar News

News November 17, 2025

APPLY NOW: IAFలో 340 పోస్టులు

image

IAF వివిధ విభాగాల్లో 340 పోస్టుల భర్తీకి AFCAT-1/2026 దరఖాస్తులు కోరుతోంది. ఇంటర్ మ్యాథ్స్, ఫిజిక్స్‌లో కనీసం 50% మార్కులు, డిగ్రీలో 60% మార్కులు సాధించినవారు లేదా BE/ బీటెక్ చేసినవారు డిసెంబర్ 14వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. అభ్యర్థుల వయసు 20 -26 ఏళ్ల మధ్య ఉండాలి. రాత పరీక్ష, ఇంటర్వ్యూ, ఫిజికల్ టెస్ట్ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. వెబ్‌సైట్: https://afcat.cdac.in/

News November 17, 2025

APPLY NOW: IAFలో 340 పోస్టులు

image

IAF వివిధ విభాగాల్లో 340 పోస్టుల భర్తీకి AFCAT-1/2026 దరఖాస్తులు కోరుతోంది. ఇంటర్ మ్యాథ్స్, ఫిజిక్స్‌లో కనీసం 50% మార్కులు, డిగ్రీలో 60% మార్కులు సాధించినవారు లేదా BE/ బీటెక్ చేసినవారు డిసెంబర్ 14వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. అభ్యర్థుల వయసు 20 -26 ఏళ్ల మధ్య ఉండాలి. రాత పరీక్ష, ఇంటర్వ్యూ, ఫిజికల్ టెస్ట్ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. వెబ్‌సైట్: https://afcat.cdac.in/

News November 17, 2025

డిజిటల్ అరెస్టు అంటూ ₹32 CRకు టోపీ

image

సైబర్ ఫ్రాడ్‌కు చిక్కి బెంగళూరుకు చెందిన ఓ మహిళ ఏకంగా ₹32 CR మేర పోగొట్టుకుంది. పాస్‌పోర్టులు, క్రెడిట్ కార్డులు, డ్రగ్స్‌తో కొరియర్ వచ్చిందని, ఇది క్రైమ్ అని ఆమెకు ముందు ఓ ఫోన్ కాల్ వచ్చింది. ఆపై నేరగాళ్లు డిజిటల్ అరెస్టు అని నెల రోజులు స్కైప్, కాల్స్‌తో నిఘా పెట్టారు. RBI FIU పేరిట ఆస్తులు ఇతర చిట్టా అడిగారు. వాటి క్లియరెన్స్ పేరిట ₹32 కోట్లు తీసుకున్నారు. మోసంపై ఆమె ఆలస్యంగా ఫిర్యాదు చేశారు.