News November 17, 2024
గ్రూప్-3 పరీక్షకు హాజరైంది 50శాతం మందే

తెలంగాణ వ్యాప్తంగా 1401 ఎగ్జామ్ సెంటర్లలో ఇవాళ జరిగిన గ్రూప్-3 పరీక్ష రాసేందుకు అభ్యర్థులు అంతగా ఆసక్తి చూపలేదు. 5.36 లక్షల మంది పరీక్ష కోసం దరఖాస్తు చేసుకోగా, 76.4శాతం మంది హాల్టికెట్లు డౌన్లోడ్ చేసుకున్నారు. ఉదయం పేపర్-1కు 2,73,847 మంది, పేపర్-2కు 2,72,173 మంది మాత్రమే హాజరైనట్లు TGPSC ప్రకటించింది. అత్యధికంగా ఆదిలాబాద్ జిల్లాలో 64శాతం మంది పరీక్షకు హాజరయ్యారు.
Similar News
News January 5, 2026
లాప్స్ అయిన పాలసీని రివైవ్ చేస్తే లాభామేనా?

లాప్స్ అయిన పాలసీలను మళ్లీ రివైవ్ చేసుకునే అవకాశాన్ని LIC కల్పించింది. దీనివల్ల పలు లాభాలు ఉంటాయి. పాలసీలో చేరినప్పటి వయసు ప్రకారమే తక్కువ ప్రీమియం కొనసాగుతుంది. పాత పాలసీల్లో మినహాయింపులు తక్కువగా ఉంటాయి. కొత్తగా మెడికల్ చెకప్స్ చేయించుకునే అవసరం ఉండదు. కట్టాల్సిన బాకీ ప్రీమియం మొత్తాన్ని మార్చి 2లోపు చెల్లించి పునరుద్ధరించుకోవచ్చు. 30% డిస్కౌంట్ కూడా ఉంది.
News January 5, 2026
నల్లమల సాగర్పై అభ్యంతరాలెందుకు: రోహత్గి

పోలవరం, నల్లమల సాగర్పై SCలో విచారణ <<18768178>>వాయిదా<<>> పడిన విషయం తెలిసిందే. AP తరఫున ముకుల్ రోహత్గి, జగదీప్ గుప్తా వాదనలు వినిపించారు. ‘రాష్ట్ర భూభాగంలో ఒక ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి నీటిని తరలించడంపై అభ్యంతరాలు ఎందుకు? నా స్థలంలో నేను ఇల్లు కట్టుకోవడానికి పక్కింటి వాళ్ల పర్మిషన్ తీసుకోవాల్సిన అవసరం ఏంటో అర్థం కావట్లేదు’ అని TGని ఉద్దేశించి ముకుల్ రోహత్గి వ్యాఖ్యానించారు.
News January 5, 2026
నాభిలో ‘సూక్ష్మ’ ప్రపంచం.. ఇంత కథ ఉందా?

మన శరీరం అద్భుత నిలయం. అందులోనూ మన నాభి మరింత ప్రత్యేకం. ఇందులో వేలాది సూక్ష్మజీవులు నివసిస్తాయనే విషయం మీకు తెలుసా? మన నాభిలో ఏకంగా 2,368 రకాల సూక్ష్మజీవులు ఉంటాయని US నేషనల్ జియోగ్రాఫిక్ పరిశోధనలో తేలింది. స్నానం చేసినా వాటిని తొలగించలేం. విచిత్రమేంటంటే ఇందులో 1,458 జాతులు శాస్త్రవేత్తలకు కూడా కొత్తే. వేలిముద్రల్లాగే ఒకరి బొడ్డులోని బ్యాక్టీరియా మరొకరి దాంట్లో ఉండదని వారు చెబుతున్నారు.


