News October 30, 2024
సరిహద్దుల్లో నక్కిన 50 మంది ఉగ్రవాదులు

భారత్లోకి చొరబడేందుకు సరిహద్దు వెంట 50 మందికి పైగా ఉగ్రవాదులు నక్కిఉన్నట్లు ఓ సీనియర్ ఆర్మీ అధికారి వెల్లడించారు. వారిని అడ్డుకునేందుకు భారత బలగాలు అప్రమత్తంగా ఉన్నట్లు తెలిపారు. అఖ్నూర్ సెక్టార్ నియంత్రణ రేఖ వెంట ముగ్గురు టెర్రరిస్టులను మట్టుబెట్టినట్లు చెప్పారు. ప్రతికూల పరిస్థితులుండే శీతాకాలంలో ఉగ్రమూకలు ఇండియాలో ప్రవేశించేందుకు ప్రయత్నిస్తాయని, కొన్నేళ్లుగా ఇదే జరుగుతోందని పేర్కొన్నారు.
Similar News
News February 9, 2026
రూ.20కే గోధుమ పిండి.. పంపిణీ షురూ

AP: రేషన్ కార్డుదారులకు రూ.20కే కేజీ గోధుమ పిండి అందించే కార్యక్రమాన్ని మంత్రి మనోహర్ నిన్న తెనాలిలో ప్రారంభించారు. ప్రస్తుతం జిల్లా కేంద్రాల్లో 1,800 టన్నుల గోధుమ పిండి పంపిణీ చేస్తున్నామని, రానున్న రోజుల్లో అన్ని చోట్లా ఇస్తామని చెప్పారు. స్మార్ట్ రేషన్ కార్డు ద్వారా నెలలో 15 రోజుల పాటు ఉదయం నుంచి సాయంత్రం వరకు సరకులు తీసుకోవచ్చని తెలిపారు.
News February 9, 2026
ఆకాశంలో టాక్సీలు.. బిల్డింగ్లపైనే ల్యాండింగ్: CII ప్రతిపాదన

గురుగ్రామ్, నోయిడా ఎయిర్పోర్ట్ మధ్య ‘ఎయిర్ టాక్సీలు’ నడపాలని CII ప్రతిపాదించింది. గంటల ప్రయాణం నిమిషాల్లోనే ముగిసేలా ఆఫీసులు, హాస్పిటల్స్, కమర్షియల్ బిల్డింగ్లపైనే ల్యాండింగ్ ప్యాడ్లు ఏర్పాటు చేయనున్నారు. ఫస్ట్ ఫేజ్లో ఆర్గాన్ ట్రాన్స్పోర్ట్ కోసం వీటిని వాడతారట. మెట్రో స్టేషన్లు, బిజినెస్ హబ్లను కలుపుతూ ఈ నెట్వర్క్ రాబోతోంది.
News February 9, 2026
పిల్లల్లో ఆకలి ఎందుకు తగ్గుతుందంటే?

పిల్లల్లో వయసుకు తగిన ఎదుగుదల లేకపోవడం, పాలు ఎక్కువగా తాగడం, చిరుతిళ్లు తినడం, నులిపురుగులు, ఐరన్ డెఫిషియన్సీ వల్ల ఆకలి తగ్గుతుందని నిపుణులు చెబుతున్నారు. పిల్లలకు మంచి పౌష్టికాహారం, పండ్లు, సూప్స్ పెట్టాలి. జంక్ ఫుడ్ చిన్నప్పటి నుంచే అలవాటు చేస్తే ఊబకాయం, అనారోగ్యాలు వస్తాయి. ఫోన్లు, టీవీ చూపించి అన్నం పెట్టొద్దు. దీనితో అర్టిజం, హైపర్ యాక్టివ్ సమస్యలు వచ్చే అవకాశం ఉందని హెచ్చరిస్తున్నారు.


