News September 10, 2024
సైబర్ నేరాల అడ్డుకట్టకు 5వేల సైబర్ కమాండోలు

జాతీయ భద్రతలో సైబర్ సెక్యూరిటీ అంతర్భాగమని HM అమిత్ షా అన్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో దేశం ఎదుగుదలకు అదెంతో కీలకమన్నారు. ‘మానవాళికి టెక్నాలజీ వరం. ఎకానమీకి ఎంతో ఉపయోగకరం. అదే సమయంలో టెక్నాలజీ వల్ల చాలా ముప్పులు కనిపిస్తున్నాయి. సైబర్ సెక్యూరిటీలో ఇండియన్ సైబర్క్రైమ్ కోఆర్డినేషన్ సెంటర్ కీలకం’ అని అన్నారు. సైబర్ నేరాల అడ్డుకట్టకు రాబోయే ఐదేళ్లలో 5000 సైబర్ కమాండోలకు శిక్షణనిస్తామని తెలిపారు.
Similar News
News October 14, 2025
అత్యధిక మంది చూసిన సినిమాగా ‘వార్-2’

జూ.ఎన్టీఆర్, హృతిక్ రోషన్ నటించిన ‘వార్-2’ ఓటీటీలో రికార్డ్ వ్యూస్తో దూసుకెళ్తోంది. ఆర్మాక్స్ లెక్కల ప్రకారం గత వారం ఇండియాలో అత్యధిక మంది చూసిన సినిమాగా నిలిచింది. నెట్ఫ్లిక్స్లో ఈ చిత్రానికి అత్యధికంగా 3.5 మిలియన్ వ్యూస్ వచ్చినట్లు పేర్కొంది. యశ్రాజ్ ఫిల్మ్స్ బ్యానర్లో భారీ అంచనాలతో తెరకెక్కిన వార్-2 థియేటర్లలో ఆశించిన విజయాన్ని అందుకోలేకపోయింది.
News October 14, 2025
50% పరిమితి రాజ్యాంగంలో లేదు: ప్రభుత్వం

TG: SCలో దాఖలు చేసిన <<17999644>>పిటిషన్<<>>లో ప్రభుత్వం పలు అంశాలను ప్రస్తావించింది.
* రిజర్వేషన్లపై 50% పరిమితి ఉన్నట్లు రాజ్యాంగంలో లేదు. * ప్రత్యేక సందర్భాల్లో రిజర్వేషన్లు ఇవ్వొచ్చని గతంలో SC చెప్పింది. * సామాజిక, ఆర్థిక, విద్య, ఉద్యోగ, రాజకీయ, కుల సర్వే 2024-25లో రాష్ట్ర జనాభాలో 56.33% మంది బీసీలున్నారు. * శాసనసభలో ఆమోదించి పంపిన బిల్లులను 3నెలల్లో గవర్నర్, రాష్ట్రపతి ఆమోదించకపోతే ఓకే చేసినట్లే.
News October 14, 2025
ఈ మూడు దగ్గు సిరప్లు డేంజర్: WHO

భారత్లోని 3 ఫార్మా కంపెనీలకు చెందిన కాఫ్ సిరప్లను వాడొద్దని WHO హెచ్చరించింది. ఇందులో ఇటీవల 22 మంది పిల్లల మరణానికి కారణమైన శ్రేసన్ ఫార్మా ‘కోల్డ్రిఫ్’ కూడా ఉంది. దాంతో పాటు రెడ్నెక్స్ ఫార్మా ‘రెస్పిఫ్రెష్ TR’, షేప్ ఫార్మా ‘రీలైఫ్’ సిరప్లు ఆరోగ్యానికి హానికరమని పేర్కొంది. కాగా ఈ దగ్గు మందులు ఇతర దేశాలకు ఎగుమతి కాలేదని ఇండియన్ సెంట్రల్ డ్రగ్స్ స్టాండర్డ్ కంట్రోల్ ఆర్గనైజేషన్ WHOకు తెలిపింది.