News June 20, 2024

518 ఫోన్లు రికవరీ చేశాం: ఎస్పీ రాధిక

image

శ్రీకాకుళం జిల్లా పోలీసు కార్యాలయంలో గురువారం మొబైల్ ఫోన్స్ రికవరీపై ఎస్పీ జి.ఆర్ రాధిక సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా మొబైల్ ఫోన్స్ పోగొట్టుకున్న బాధితులకు సుమారు 72 ఫోన్‌లను ట్రాక్ చేసి ఎస్పీ చేతుల మీదగా అందజేశారు. అనంతరం ఎస్పీ మాట్లాడుతూ ఇప్పటివరకు మొత్తం 518 ఫోన్లు రికవరీ చేశామని వాటి విలువ రూ.లక్షల్లో ఉంటుందని ఎస్పీ రాధిక తెలిపారు.

Similar News

News October 4, 2024

DGP ద్వారకాతిరుమలరావును కలిసిన ఎంపీ కలిశెట్టి

image

విజయవాడలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర DGP ద్వారకాతిరుమలరావును శుక్రవారం ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు మర్యాదపూర్వకంగా కలిశారు. విజయనగరం పైడితల్లి అమ్మవారి ఉత్సవాలకు రావాలని డీజీపీని ఆహ్వానించారు. అలాగే ఉత్సవాలకు భారీ బందోబస్తు ఏర్పాటుచేసి శాంతిభద్రతలకు ఎటువంటి లోటు రాకుండా చూసుకోవాలని కోరారు.

News October 4, 2024

ప్రజలకు ధన్యవాదాలు: మంత్రి అచ్చెన్నాయుడు

image

కోటబొమ్మాలి కొత్తమ్మతల్లి ఉత్సవాలను విజయవంతం చేసిన జిల్లా అధికారులు, పోలీసు యంత్రాంగం,స్థానిక నాయకులు, ప్రజలకు రాష్ట్రమంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు ధన్యవాదములు తెలిపారు. ఉత్సవాలకు రాష్ట్రస్థాయి గుర్తింపు లభించడంలో ముఖ్యపాత్ర పోషించిన సీఎం చంద్రబాబు, దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణరెడ్డికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. వచ్చే ఏడాది కూడా అత్యంత వైభవంగా ఉత్సవాలు నిర్వహిస్తామని అన్నారు.

News October 4, 2024

ఎచ్చర్ల: బీఆర్ఏయూలో మిగులు సీట్లకు ప్రవేశాలు

image

డా.బీఆర్ఏయూలో ఎంబీఏ, ఎంసీఏ కోర్సుల్లో మిగులు సీట్లకు తక్షణ ప్రవేశాలు జరుగుతున్నట్లు రిజిస్ట్రార్ సుజాత తెలిపారు. ఈ నెల 7వ తేదీ వరకు ప్రవేశాలు కొనసాగుతాయన్నారు. ఐసెట్-2024లో ఉత్తీర్ణత చెంది ఇప్పటివరకూ సీటు లభించిన విద్యార్థులు స్పాట్ అడ్మిషన్లకు హాజరు కావచ్చని చెప్పారు. అన్ని ధ్రువపత్రాలతో యూనివర్సిటీలో హాజరుకావాలన్నారు.