News June 20, 2024
518 ఫోన్లు రికవరీ చేశాం: ఎస్పీ రాధిక
శ్రీకాకుళం జిల్లా పోలీసు కార్యాలయంలో గురువారం మొబైల్ ఫోన్స్ రికవరీపై ఎస్పీ జి.ఆర్ రాధిక సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా మొబైల్ ఫోన్స్ పోగొట్టుకున్న బాధితులకు సుమారు 72 ఫోన్లను ట్రాక్ చేసి ఎస్పీ చేతుల మీదగా అందజేశారు. అనంతరం ఎస్పీ మాట్లాడుతూ ఇప్పటివరకు మొత్తం 518 ఫోన్లు రికవరీ చేశామని వాటి విలువ రూ.లక్షల్లో ఉంటుందని ఎస్పీ రాధిక తెలిపారు.
Similar News
News October 4, 2024
రాష్ట్రస్థాయి యోగా పోటీలకు ఇచ్ఛాపురం విద్యార్థి
శ్రీకాకుళంలో ఈ నెల 1వ తేదీన జరిగిన స్కూల్ ఫెడరేషన్ గేమ్స్లో ఇచ్ఛాపురం పట్టణానికి చెందిన పాలేపు సాయి జగదీశ్ అండర్-14 యోగా విభాగంలో రాష్ట్రస్థాయి యోగా పోటీలకు ఎంపికయ్యారు. ఈ సందర్భంగా విద్యార్థిని జ్ఞాన భారతి ఎడ్యుకేషనల్ ట్రస్ట్ సీఈవో జోహార్ ఖాన్ అభినందించారు. రాష్ట్రస్థాయిలో మరిన్ని పథకాలు తెచ్చి ఇచ్ఛాపురం పట్టణానికి జ్ఞాన భారతి పాఠశాలకు మంచిపేరు తేవాలని కోరారు.
News October 4, 2024
సెమీ ఫైనల్కి దూసుకెళ్లిన శ్రీకాకుళం టీం
యూటీఎఫ్ స్వర్ణోత్సవాల్లో భాగంగా గుంటూరులో జరుగుతున్న రాష్ట్రస్థాయి వాలీబాల్ పోటీల్లో శుక్రవారం యూటీఎఫ్ శ్రీకాకుళం జిల్లా క్రీడాకారులు సెమీ ఫైనల్ చేరుకున్నారు. ఈ సందర్భంగా ఫెడరేషన్ రాష్ట్ర అధ్యక్షుడు, జిల్లా ప్రధాన కార్యదర్శి, ట్రెజరర్ తదితరులు జిల్లా క్రీడాకారులకు అభినందనలు తెలిపారు.
News October 4, 2024
ఇంటిగ్రేటెడ్ కలెక్టరేట్ను పూర్తిచేయండి: మంత్రి
ఇంటిగ్రేటెడ్ కలెక్టరేట్ను సత్వరమే పూర్తి చేయాలని వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు గుత్తేదారును ఆదేశించారు. శుక్రవారం కలెక్టర్ స్వప్నిల్ దినకర్తో కలిసి ఆయన సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. అన్ని శాఖలు ఒకే ప్రాంగణంలో ఉండేలా నూతన కలెక్టరేట్ నిర్మాణం చేపడుతున్నామన్నారు. ఒక వ్యక్తి వివిధ శాఖల అధికారులను కలవాలని వస్తే అలాంటి వ్యక్తికి నూతన కలెక్టరేట్ ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని తెలిపారు.