News July 27, 2024

52 అడుగులకు చేరిన గోదావరి నీటిమట్టం

image

భద్రాచలం వద్ద గోదావరి నీటిమట్టం 52 అడుగులకు చేరింది. మూడో ప్రమాద హెచ్చరికకు వరద నీరు దగ్గరగా రావడంతో అధికారులు అప్రమత్తమయ్యారు. ఇప్పటికే భద్రాచలంలోని పలు ప్రాంతాల ప్రజలను పునరావాస కేంద్రాలకు తరలించారు. మధ్యాహ్నం రెండు గంటల తర్వాత మూడో ప్రమాద హెచ్చరిక జారీ చేసే అవకాశం ఉంది. భద్రాచలంలోని నన్నపనేని హైస్కూల్లో పునరావాస కేంద్రం ఏర్పాటు చేశారు.

Similar News

News December 8, 2025

ఖమ్మం: అవినీతి ఫిర్యాదులకు టోల్‌ఫ్రీ నంబర్: కలెక్టర్

image

అవినీతి నిరోధక శాఖ (ACB) వారోత్సవాల సందర్భంగా సోమవారం (డిసెంబర్ 8న) కలెక్టర్ శ్రీ అనుదీప్ దురిశెట్టి ACB పోస్టర్‌ను విడుదల చేశారు. అవినీతిపై ప్రజలు ధైర్యంగా ఫిర్యాదు చేయాలని, వివరాలు గోప్యంగా ఉంచుతామని తెలిపారు. ఫిర్యాదుల కోసం టోల్‌ఫ్రీ నంబర్ 1064 తో పాటు, వాట్సాప్, ఈమెయిల్ మరియు ACB ఖమ్మం DSP నంబర్ (9154388981) ద్వారా సంప్రదించవచ్చని ఆయన తెలిపారు.

News December 8, 2025

ఖమ్మం: మద్యం దుకాణాలు బంద్

image

డిసెంబర్ 11,14,17 తేదీలలో జరిగే గ్రామ పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో ఖమ్మం కమిషనరేట్ పరిధిలోని ఆయా మండలల్లో మద్యం విక్రయాలను నిలిపివేయాలని పోలీస్ కమిషనర్ సునీల్ దత్ తెలిపారు. డిసెంబర్ 11 న జరిగే ఎన్నికలకు డిసెంబర్ 9న సాయంత్రం 5:00 గంటల నుంచి డిసెంబర్ 11న ఎన్నికలు ముగిసి, ఓట్ల లెక్కింపు, ఫలితాలు వెల్లడించే వరకు ఆయా మండలల్లో మద్యం విక్రయాలను నిలిపివేయాలన్నారు.

News December 8, 2025

మద్యం విక్రయాలపై కఠిన నిషేధం: సీపీ సునీల్ దత్

image

గ్రామపంచాయతీ ఎన్నికల నేపథ్యంలో ఖమ్మం కమిషనరేట్ పరిధిలోని మండలాల్లో మద్యం విక్రయాలను పూర్తిగా నిలిపివేయాలని పోలీస్ కమిషనర్ సునీల్ దత్ ఆదేశించారు. డిసెంబర్ 11, 14, 17 తేదీల్లో జరిగే మూడు విడతల పోలింగ్‌కు ముందు రెండు రోజులు సాయంత్రం 5 గంటల నుంచి, పోలింగ్ ముగిసే వరకు, ఓట్ల లెక్కింపు పూర్తయ్యే వరకు మద్యం దుకాణాలు, వైన్ షాపులు, బార్లు, మద్యం సరఫరా చేసే రెస్టారెంట్లు పూర్తిగా మూసివేయాలని తెలిపారు.