News December 25, 2024
రోడ్డు పక్కన 52 కేజీల బంగారం, రూ.11 కోట్ల డబ్బు.. ఇతనివే!

మధ్యప్రదేశ్ భోపాల్లో ఇటీవల రోడ్డు పక్కన కారులో 52 కేజీల <<14936521>>బంగారం<<>>, రూ.11 కోట్ల నగదు లభ్యమైన విషయం తెలిసిందే. ఇది బిల్డర్గా మారిన ఆర్టీవో మాజీ కానిస్టేబుల్ సౌరభ్ శర్మ అనుచరుడు చేతన గౌర్కు చెందిన కారుగా గుర్తించారు. తాజాగా, లోకాయుక్త పోలీసుల తనిఖీల్లో మాజీ కానిస్టేబుల్ సౌరభ్ ఇంట్లో రూ.2.87 కోట్ల నగదు, 234 కేజీల వెండిని సీజ్ చేశారు. వీరిద్దరిపై ఈడీ కేసులు నమోదు చేసి, దర్యాప్తు చేస్తోంది.
Similar News
News January 9, 2026
మళ్లీ పెరిగిన బంగారం ధర!

హైదరాబాద్ బులియన్ మార్కెట్లో బంగారం ధరలు గంటల వ్యవధిలోనే మళ్లీ పెరిగాయి. 24 క్యారెట్ల 10గ్రాముల పసిడి ధర ఇవాళ మొత్తం రూ.1,310 పెరిగి రూ.1,39,310కు చేరింది. అలాగే 22క్యారెట్ల 10గ్రాముల బంగారం ధర రూ.1,200 ఎగబాకి రూ.1,27,700 పలుకుతోంది. అటు కేజీ వెండి ధర రూ.4వేలు తగ్గి రూ.2,68,000గా ఉంది. రెండు తెలుగు రాష్ట్రాల్లో దాదాపు ఇవే ధరలున్నాయి.
News January 9, 2026
మోదీ, ట్రంప్ 8 సార్లు మాట్లాడుకున్నారు: విదేశాంగ శాఖ

భారత్తో వాణిజ్య ఒప్పందం ఆలస్యం కావడానికి మోదీ <<18806375>>ఫోన్ చేయకపోవడమే<<>> కారణమని US వాణిజ్య కార్యదర్శి లుట్నిక్ చేసిన వ్యాఖ్యలను ఇండియా ఖండించింది. ‘వాణిజ్య ఒప్పందంపై గతేడాది ఫిబ్రవరి నుంచి 2 దేశాలు చర్చలు జరిపాయి. చాలాసార్లు మేం డీల్కు చేరువయ్యాం. చర్చలపై తాజాగా చేసిన వ్యాఖ్యల్లో నిజం లేదు. గతేడాది మోదీ, ట్రంప్ 8సార్లు ఫోన్లో మాట్లాడుకున్నారు’ అని విదేశాంగ శాఖ ప్రతినిధి రణ్ధీర్ జైస్వాల్ చెప్పారు.
News January 9, 2026
అస్సోం రైఫిల్స్ 95 పోస్టులకు నోటిఫికేషన్

<


