News June 27, 2024

ట్రిపుల్ ఐటీలకు 53వేల దరఖాస్తులు.. 11న జాబితా విడుదల

image

AP: IIITల్లో 2024-25 అడ్మిషన్లకు సంబంధించి 53,863 దరఖాస్తులు వచ్చినట్లు అధికారులు వెల్లడించారు. జులై 11న ఎంపికైన అభ్యర్థుల జాబితాను ప్రకటిస్తారు. వీరికి జులై 22, 23 తేదీల్లో నూజివీడు, ఇడుపులపాయ ట్రిపుల్ ఐటీల్లో, 24, 25 తేదీల్లో ఒంగోలు, 26, 27 తేదీల్లో శ్రీకాకుళం ట్రిపుల్ ఐటీలో సర్టిఫికెట్ల పరిశీలన చేసి అడ్మిషన్లు ఇస్తారు. స్పెషల్ కేటగిరీ వారికి జులై 1 నుంచి సర్టిఫికెట్ వెరిఫికేషన్ చేస్తారు.

Similar News

News October 10, 2024

ఏపీ మద్యం షాపులకు విదేశాల నుంచి దరఖాస్తులు

image

AP: రాష్ట్రంలో మద్యం దుకాణాలకు ఆన్‌లైన్ దరఖాస్తుల ప్రక్రియ రేపు రాత్రి 7 గంటలతో ముగియనుంది. షాపులకు అమెరికా, యూరప్ దేశాల నుంచి కూడా దరఖాస్తులు వస్తున్నట్లు ఎక్సైజ్ శాఖ డిప్యూటీ కమిషనర్ చైతన్య వెల్లడించారు. అమెరికా నుంచి అత్యధికంగా 20 దరఖాస్తులు వచ్చాయన్నారు. కాగా నిన్నటి వరకు 57 వేల దరఖాస్తుల ద్వారా ప్రభుత్వానికి రూ.1,154 కోట్ల ఆదాయం వచ్చింది.

News October 10, 2024

OTTలోకి వచ్చేసిన బ్లాక్‌బస్టర్ మూవీ

image

బాలీవుడ్‌లో బిగ్గెస్ట్ బ్లాక్‌బస్టర్ ‘స్త్రీ-2’ మూవీ అమెజాన్ ప్రైమ్‌లో రెగ్యులర్ స్ట్రీమింగ్‌కు వచ్చేసింది. గత నెల 26 నుంచి రెంటల్(రూ.349) పద్ధతిలో అందుబాటులో ఉండగా, ఇవాళ్టి నుంచి ప్రైమ్ సబ్‌స్క్రిప్షన్ ఉన్నవాళ్లు ఫ్రీగా వీక్షించవచ్చు. శ్రద్ధా కపూర్, రాజ్‌కుమార్ రావ్ ప్రధాన పాత్రల్లో అమర్ కౌశిక్ తెరకెక్కించిన ఈ సినిమా దాదాపు రూ.700 కోట్లను వసూలు చేసిన విషయం తెలిసిందే.

News October 10, 2024

‘మీషో’ ఆఫర్.. 9 రోజులు వేతనంతో కూడిన సెలవులు

image

ఫెస్టివల్ సీజన్‌లో మెగా సేల్స్‌తో కష్టపడిన ఉద్యోగులకు ఈ కామర్స్ సంస్థ మీషో గుడ్ న్యూస్ చెప్పింది. వరుసగా నాలుగో ఏడాది 9 రోజులపాటు వేతనంతో కూడిన సెలవులు ఇవ్వనున్నట్లు ప్రకటించింది. ఈ ‘రెస్ట్ అండ్ రీఛార్జ్’ బ్రేక్ అక్టోబర్ 26 నుంచి నవంబర్ 3 వరకు ఉంటుందని తెలిపింది. ‘9 రోజులపాటు ల్యాప్‌టాప్స్ ఉండవు. ఈమెయిల్స్ రావు. స్టాండప్ కాల్స్ ఉండవు. ఉద్యోగానికి సంబంధించి ఎలాంటి పని ఉండదు’ అని పేర్కొంది.