News December 22, 2025

54 ఎగ్జిక్యూటివ్ ట్రైనీ పోస్టులకు దరఖాస్తుల ఆహ్వానం

image

<>దామోదర్ <<>>వ్యాలీ కార్పొరేషన్ 54 ఎగ్జిక్యూటివ్ ట్రైనీ బ్యాక్‌లాగ్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. బీఈ/ బీటెక్ అర్హతగల అభ్యర్థులు రేపటి వరకు అప్లై చేసుకోవచ్చు . గేట్ 2025 స్కోరు, డాక్యుమెంట్స్ వెరిఫికేషన్ ఆధారంగా ఎంపిక చేస్తారు. నెలకు జీతం రూ.56,100-రూ.1,77,500 చెల్లిస్తారు. దరఖాస్తు ఫీజు రూ.300. వెబ్‌సైట్: https://www.dvc.gov.in

Similar News

News December 22, 2025

ఫాక్స్‌కాన్ రికార్డు.. ఏడాదిలో 30 వేల మందికి ఉద్యోగాలు!

image

బెంగళూరులోని ఫాక్స్‌కాన్ 2025లో రికార్డు స్థాయిలో 30 వేల మందిని రిక్రూట్ చేసుకుంది. వీరిలో 80% మంది మహిళలే. ఇండియాలో ఐఫోన్ల అసెంబ్లీకి కేంద్రంగా ఉన్న ఈ కంపెనీలో వివిధ రాష్ట్రాల నుంచి వచ్చిన ఉద్యోగులు పనిచేస్తున్నారు. ఇక్కడి నుంచే ప్రపంచవ్యాప్తంగా ఐఫోన్లు ఎగుమతి అవుతున్నాయి. నవంబరులో యాపిల్ ఏకంగా 2 బి.డాలర్లు విలువ చేసే ఫోన్లను ఇండియా నుంచి ఎక్స్‌పోర్ట్ చేసింది.

News December 22, 2025

ISRO ప్రొపల్షన్ కాంప్లెక్స్ 100పోస్టులకు నోటిఫికేషన్

image

<>ఇస్రోకు<<>> చెందిన ప్రొపల్షన్ కాంప్లెక్స్ సెంటర్ 100 అప్రెంటిస్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. BE, B.Tech, BA, BSc, BCom, డిప్లొమా అర్హతగల వారు JAN 10, 11 తేదీల్లో ఇంటర్వ్యూకు హాజరుకావచ్చు. గ్రాడ్యుయేట్లకు గరిష్ఠ వయసు 28ఏళ్లు, టెక్నీషియన్‌లకు 35ఏళ్లు. రిజర్వేషన్ గలవారికి ఏజ్‌లో సడలింపు ఉంది. గ్రాడ్యుయేట్లకు నెలకు రూ.9వేలు, డిప్లొమా విద్యార్థులకు రూ.8వేలు చెల్లిస్తారు. www.iprc.gov.in

News December 22, 2025

మొటిమల మచ్చలు తగ్గట్లేదా?

image

వాతావరణం, హార్మోన్ల మార్పుల వల్ల చాలామంది అమ్మాయిలు మొటిమలతో బాధపడుతుంటారు. మొటిమలు, వాటి వల్ల వచ్చిన నల్లటి మచ్చలు తగ్గించడానికి చింతపండు ఉపయోగపడుతుందంటున్నారు నిపుణులు. చింతపండు గుజ్జులో ముల్తానీ మట్టి, రోజ్ వాటర్, పసుపు కలిపి ముఖానికి రాసుకోవాలి. పావుగంట తర్వాత ముఖాన్ని కడిగితే చాలు. అలాగే చింతపండు గుజ్జులో అరటిపండు, శెనగపిండి కలిపి ముఖానికి రాస్తే చర్మం క్లీన్ అవుతుంది.