News September 23, 2025

బీటెక్, డిప్లొమా అర్హతతో 54 పోస్టులు

image

<>DRDO<<>> పరిధిలోని ఛాందీపూర్ ఇంటిగ్రేటెడ్ టెస్ట్ రేంజ్‌ 54 ఇంజినీరింగ్, డిప్లొమా అప్రెంటిస్ పోస్టులకు దరఖాస్తులు కోరుతోంది. ఆసక్తి, అర్హతగల అభ్యర్థులు అక్టోబర్ 20వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. గ్రాడ్యుయేట్ విద్యార్థులకు నెలకు రూ.9వేల చొప్పున, డిప్లొమా విద్యార్థులకు రూ.8వేల చొప్పున స్టైపండ్ అందిస్తారు. వెబ్‌సైట్: https://www.drdo.gov.in/

Similar News

News September 23, 2025

వన్డేల్లో కోహ్లీ ఆడతారా? ఆడరా?

image

భారత స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ వన్డేల్లో కొనసాగడంపై అనుమానాలు నెలకొన్నాయి. వచ్చే నెలలో AUSతో వన్డే సిరీస్‌కు ముందు AUS-Aతో ODI సిరీస్‌లో ఆడాలని రోహిత్, కోహ్లీకి BCCI సూచించినట్లు క్రీడా వర్గాలు పేర్కొన్నాయి. ఇప్పటికే రోహిత్ ప్రాక్టీస్ మొదలెట్టగా, BCCIకి కోహ్లీ నుంచి ఎలాంటి రెస్పాన్స్ లేదని సమాచారం. దీంతో ఆయన ఆడటంపై స్పష్టత రావాల్సి ఉంది. ప్రస్తుతం విరాట్ తన ఫ్యామిలీతో లండన్‌లో ఉంటున్నారు.

News September 23, 2025

YCP ప్రభుత్వంలో పెట్టిన తప్పుడు కేసులపై త్వరలో నిర్ణయం: అనిత

image

AP: గత ప్రభుత్వంలో రాజకీయ నేతలు, మీడియా, అమరావతి ఉద్యమకారులపై పోలీసులు పెట్టిన కేసులపై CM త్వరలో సమీక్షించి నిర్ణయం తీసుకుంటారని హోంమంత్రి అనిత కౌన్సిల్‌లో ప్రకటించారు. ‘YCP ప్రభుత్వం 2019-24 మధ్య 3116 తప్పుడు కేసులు నమోదు చేసింది. న్యాయమడిగినా, తప్పులను ఎత్తి చూపినా కేసులు పెట్టారు. నాపైనా అట్రాసిటీ కేసు పెట్టారు’ అని పేర్కొన్నారు. న్యాయ, పోలీసు శాఖలతో చర్చించి వీటిని పరిష్కరిస్తామని తెలిపారు.

News September 23, 2025

ఇన్‌కమ్ ట్యాక్స్ చెల్లించింది ఎందరో తెలుసా?

image

దేశంలో 142.21 కోట్ల జనాభా ఉంటే అందులో 3.51 కోట్ల మందే FY2024-25లో ఆదాయ పన్ను చెల్లించినట్లు ఆర్థిక నిపుణులు చెబుతున్నారు. 51.69కోట్ల మంది పాన్ & ఆధార్ లింక్ చేశారని, అందులో 7.20 కోట్ల మంది ITR దాఖలు చేసినట్లు ట్వీట్స్ చేస్తున్నారు. కేవలం 4శాతం మంది మాత్రమే పన్ను చెల్లిస్తున్నారని పేర్కొంటున్నారు. అయితే అభివృద్ధి చెందిన దేశాల్లో 50% మంది పన్ను చెల్లిస్తారని పలువురు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.