News October 28, 2025

5,407 మంది నిర్వాసితులు సురక్షిత ప్రాంతాలకు తరలింపు

image

మొంథా తుపాను ప్రభావంతో కురుస్తున్న భారీ వర్షాలకు జిల్లాలోని లోతట్టు ప్రాంతాల్లోని నిర్వాసితులను పునరావాస కేంద్రాలకు తరలించినట్లు కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్ తెలిపారు. జిల్లాలో 5,407 మంది నిర్వాసితులను సురక్షిత ప్రాంతాలకు తరలించామన్నారు. 119 పునరావాస కేంద్రాల్లో ఆశ్రయం పొందుతున్న వారికి వసతి కల్పించామన్నారు. అత్యవసర సహాయం నిమిత్తం వైద్య సిబ్బంది అందుబాటులో ఉన్నారన్నారు.

Similar News

News October 28, 2025

సదరం శిబిరాన్ని పారదర్శకంగా నిర్వహించాలి: ASF అదనపు కలెక్టర్

image

దివ్యాంగుల ధ్రువపత్రం పునరుద్ధరణ, నూతన ధ్రువపత్రాల కోసం జిల్లాలో చేపట్టిన సదరం శిబిరాలను పారదర్శకంగా నిర్వహించాలని జిల్లా అదనపు కలెక్టర్ దీపక్ తివారి తెలిపారు. మంగళవారం ASF ప్రభుత్వ ఆసుపత్రిలో నిర్వహిస్తున్న సదరం శిబిరాన్ని సందర్శించి అభ్యర్థులకు నిర్వహిస్తున్న వైద్య పరీక్షల తీరును పరిశీలించారు. అర్హులైన దివ్యాంగులకు ధ్రువపత్రాలు అందించేందుకు సదరం శిబిరాన్ని నిర్వహించనున్నారు.

News October 28, 2025

పాడేరు: ఘాట్ రోడ్లలో వాహనాల రాకపోకలు నిలిపివేత

image

మొంథా తుఫాను ప్రభావం పాడేరు, చింతూరు, రంపచోడవరం డివిజన్లలో అధికంగా ఉంటుందని ఆర్టీజీఎస్ హెచ్చరికలు జారీ చేసింది. జిల్లాలో మంగళవారం రాత్రి 7నుంచి బుధవారం ఉదయం 6గంటల వరకు ఘాట్ రోడ్లలో వాహనాల రాకపోకలు నిలిపివేయాలని ప్రభుత్వం ఆదేశించింది. జాతీయ రహదారులు, అన్ని రకాల రహదారుల ట్రాఫిక్‌పై ఆదేశాలు జారీ చేశామని ఎస్పీ అమిత్ బర్దార్ తెలిపారు. అయితే అత్యవసర వైద్య సేవల కోసం వెళ్లేవారికి మినహాయింపు ఉంటుందన్నారు.

News October 28, 2025

సంగారెడ్డి: ‘పాఠశాల నిధులను విడుదల చేయాలి’

image

జిల్లాలోని అన్ని ప్రభుత్వ పాఠశాలలకు సంబంధించిన నిర్వహణ నిధులను విడుదల చేయాలని కోరుతూ మంగళవారం టీపీటీఎఫ్ ఆధ్వర్యంలో జిల్లా విద్యాధికారి వెంకటేశ్వర్లును కలిసి వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా టీపీటీఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి అనుముల రాంచందర్ మాట్లాడుతూ.. పాఠశాలలు ప్రారంభమై ఐదు నెలలు గడిచిన ఇప్పటి వరకు ప్రభుత్వం నిధులను విడుదల చేయలేదని అన్నారు.