News February 18, 2025

మహాకుంభమేళాలో 55 కోట్ల మంది స్నానం

image

మహాకుంభమేళాలో మంగళవారం సాయంత్రం వరకు 55 కోట్ల మంది పవిత్ర స్నానాలు చేసినట్లు UP ప్రభుత్వం వెల్లడించింది. భారత్‌లోని 110 కోట్ల సనాతనుల్లో సగం మంది వచ్చినట్లు పేర్కొంది. FEB 26 నాటికి ఈ సంఖ్య 60 కోట్లు దాటే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు. అలాగే, కాశీ విశ్వనాథుని ఆలయానికి భక్తులు పోటెత్తుతున్నారు. ఈ సీజన్లో నిన్నటి వరకు కోటి మందికిపైగా కాశీ సందర్శనకు వచ్చినట్లు అధికారులు పేర్కొన్నారు.

Similar News

News November 25, 2025

ఏనుగుల సంచార ప్రాంతం ‘వలియాన వట్టం’

image

శబరిమల యాత్రలో కరిమల కొండను దిగిన తర్వాత భక్తులు చేరే ప్రాంతమే వలియాన వట్టం. ఇది చిన్న కాలువలా నీరు ప్రవహించే ప్రదేశం. ఈ ప్రాంతం ఏనుగుల సంచారానికి ప్రసిద్ధి చెందింది. ఇతర వన్యమృగాలు కూడా ఇక్కడ సంచరిస్తుంటాయి. భద్రత దృష్ట్యా, చీకటి పడే సమయానికి స్వాములు ఈ ప్రాంతం నుంచి త్వరగా వెళ్లిపోయేందుకు సిద్ధమవుతారు. ఈ దారి రాత్రిపూట ప్రయాణానికి సురక్షితం కాదు. <<-se>>#AyyappaMala<<>>

News November 25, 2025

యక్ష ప్రశ్నలు, సమాధానాలు – 12

image

68. ఎక్కువమంది మిత్రులు ఉన్నవాడు ఏమవుతాడు? (జ.సుఖపడతాడు)
69. ఎవడు సంతోషంగా ఉంటాడు? (జ.అప్పు లేనివాడు, తనకున్న దానిలో తిని తృప్తి చెందేవాడు)
70. ఏది ఆశ్చర్యం? (జ.ప్రాణులు రోజూ మరణిస్తుండటం చూసి కూడా మనుషులు ఈ భూమ్మీద ఉండిపోతాను అనుకోవడం.)
71. లోకంలో అందరికన్న ధనవంతుడెవరు? (జ.ప్రియయూ అప్రియమూ, సుఖమూ దు:ఖమూ వీటన్నింటినీ సమంగా చూసేవాడు) <<-se>>#YakshaPrashnalu<<>>

News November 25, 2025

బయోటెక్నాలజీ రీసెర్చ్ అండ్ ఇన్నోవేషన్ కౌన్సిల్‌లో ఉద్యోగాలు

image

బయోటెక్నాలజీ రీసెర్చ్ అండ్ ఇన్నోవేషన్ కౌన్సిల్(<>BRIC<<>>)12 పోస్టులకు నోటిఫికేషన్ విడుదల చేసింది. అర్హతగల అభ్యర్థులు డిసెంబర్ 21వరకు అప్లై చేసుకోవచ్చు. వీటిలో 6 పోస్టులను రెగ్యులర్‌గా, 6 పోస్టులను డిప్యుటేషన్ పద్ధతిలో భర్తీ చేయనున్నారు. పోస్టును బట్టి సంబంధిత విభాగంలో డిగ్రీ, పీజీ డిప్లొమా, పీహెచ్‌డీతో పాటు పని అనుభవం ఉండాలి. వెబ్‌సైట్: https://dbtindia.gov.in