News July 11, 2024

మహారాష్ట్రలో 6 నెలల్లో 557మంది రైతుల ఆత్మహత్య

image

మహారాష్ట్రలో గడచిన 6 నెలల్లో 557మంది రైతులు ఆత్మహత్య చేసుకోవడం కలకలం రేపుతోంది. ప్రభుత్వ నివేదిక ప్రకారం అక్కడి అమరావతి పరిపాలన విభాగం పరిధిలోని ఐదు జిల్లాల్లో 500మందికిపైగా కర్షకులు బలవన్మరణం పాలయ్యారు. 53 కేసుల్లో ప్రభుత్వం పరిహారం అందించింది. మరో 284 కేసులు పెండింగ్‌లో ఉన్నాయి. రైతన్నల ఆత్మహత్యల వెనుక పంట నష్టం, వర్షాభావం, అప్పుల భారం, సమయానికి పంట రుణం అందకపోవడం వంటి పలు కారణాలున్నాయి.

Similar News

News January 30, 2026

సల్మాన్-ఐశ్వర్యా రాయ్ లవ్ స్టోరీపై నిర్మాత ఇంట్రెస్టింగ్ కామెంట్స్

image

సల్మాన్ ఖాన్, ఐశ్వర్యా రాయ్ ఓల్డ్ రిలేషన్‌షిప్‌పై నిర్మాత శైలేంద్ర సింగ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. వారిద్దరిదీ ‘రోమియో-జూలియట్’ తరహాలో ఎమోషనల్, ‘వయలెంట్ లవ్ స్టోరీ’ అని పేర్కొన్నారు. ఐశ్వర్య గౌరవప్రదమైన, తెలివైన వ్యక్తి అని, సల్మాన్ చాలా ప్యాషనేట్ అని తెలిపారు. సల్మాన్ కంటే ముందు ఆమెకు మోడల్ రాజీవ్ మూల్‌చందనీతో మాత్రమే రిలేషన్ ఉండేదని.. ఇండస్ట్రీలో మరెవరితోనూ లేదని చెప్పారు.

News January 30, 2026

వెనిజులాతో ద్వైపాక్షిక సంబంధాల విస్తరణ: మోదీ

image

<<18951392>>వెనిజులా<<>> తాత్కాలిక అధ్యక్షురాలు డెల్సీ రోడ్రిగ్జ్‌తో ప్రధాని మోదీ తొలిసారి మాట్లాడారు. రానున్న సంవత్సరాల్లో ఇరు దేశాల సంబంధాలను మరింత ముందుకు తీసుకెళ్లేందుకు అంగీకారం కుదిరినట్లు ఆయన ట్వీట్ చేశారు. అన్నిరంగాల్లో ద్వైపాక్షిక భాగస్వామ్యాన్ని మరింత విస్తరించడానికి కృషి చేస్తామని తెలిపారు. బలమైన దౌత్యం, విజన్‌తో ఇరు దేశాలకు కొత్త అవకాశాలు లభిస్తాయని రోడ్రిగ్జ్‌ చెప్పారు.

News January 30, 2026

ఫామ్‌హౌస్‌లో విచారణకు సిట్ నో చెప్పడానికి కారణాలివే!

image

TG: హైదరాబాద్ నందినగర్‌లోని కేసీఆర్ ఇంటికి సిట్ అధికారులు నోటీసులు అంటించారు. ఫిబ్రవరి 1న 3PMకు విచారణకు సిద్ధంగా ఉండాలని అందులో పేర్కొన్నారు. ఫామ్‌హౌస్‌లో విచారణ చేసేందుకు <<19005122>>నిరాకరించడానికి<<>> గల కారణాలను వివరించారు. తమ రికార్డుల్లో నందినగర్ అడ్రస్సే ఉందని తెలిపారు. విచారణను రికార్డు చేసే ఎలక్ట్రానిక్ పరికరాలను, రికార్డులను ఫామ్‌హౌస్‌కు తీసుకెళ్లలేమని స్పష్టం చేశారు.