News June 3, 2024

వడదెబ్బతో మే నెలలో 56 మంది మృతి: కేంద్రం

image

మే నెలలో దేశవ్యాప్తంగా 56 మందికిపైగా వడదెబ్బ తగిలి ప్రాణాలు కోల్పోయినట్లు కేంద్రం వెల్లడించింది. మరో 24 మంది కూడా ఈ కారణంగానే చనిపోయి ఉంటారని అనుమానిస్తున్నట్లు తెలిపింది. గుండె సంబంధిత వ్యాధులతో 605 మంది మృతిచెందినట్లు వెల్లడించింది. వడదెబ్బకు సంబంధించి అత్యధికంగా మహారాష్ట్రలో 5,204 కేసులు నమోదయ్యాయని తెలిపింది. ఆ తర్వాత స్థానాల్లో రాజస్థాన్ (4,357), ఏపీ (2,183) ఉన్నట్లు పేర్కొంది.

Similar News

News January 24, 2026

మున్సిపల్ బరిలో జాగృతి.. సింహం గుర్తుపై పోటీ!

image

TG: మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేయాలని తెలంగాణ జాగృతి చీఫ్ కవిత నిర్ణయం తీసుకున్నారు. తమ అభ్యర్థులను సింహం గుర్తుతో బరిలో నిలపనున్నారు. జిల్లా పరిషత్, మండల పరిషత్ ఎన్నికల్లోనూ ఇదే గుర్తుతో పోటీ చేయనున్నారు. పార్టీ రిజిస్ట్రేషన్‌కు సమయం పట్టే అవకాశం ఉండటంతో ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ (AIFB)కు చెందిన సింహం గుర్తుతో పోటీ చేయాలని జాగృతి అగ్ర నాయకత్వ నిర్ణయం తీసుకుంది. AIFBతో దీనిపై చర్చించింది.

News January 24, 2026

MANAGEలో ఉద్యోగాలకు దరఖాస్తుల ఆహ్వానం

image

నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ అగ్రికల్చరల్ ఎక్స్‌టెన్షన్ మేనేజ్‌మెంట్ (<>MANAGE<<>>) 3 Assist. డైరెక్టర్ పోస్టులను భర్తీ చేయనుంది. అర్హతగల వారు FEB 21 వరకు అప్లై చేసుకోవచ్చు. పోస్టును బట్టి PG(అగ్రికల్చర్ ఎక్స్‌టెన్షన్/అగ్రికల్చర్ ఎకనామిక్స్, అగ్రి B.M./HR మేనేజ్‌మెంట్), PhD ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి. అభ్యర్థుల గరిష్ఠ వయసు 35ఏళ్లు. రాత పరీక్ష ద్వారా ఎంపిక చేస్తారు. సైట్: https://www.manage.gov.in

News January 24, 2026

ఢిల్లీ రిపబ్లిక్ డే వేడుకల్లో తెలంగాణ ఒగ్గుడోలు

image

TG: గణతంత్ర వేడుకల్లో తెలంగాణ సంస్కృతి విశ్వవ్యాప్తం కాబోతోంది. జనవరి 26న ఢిల్లీలోని కర్తవ్యపథ్‌పై తొలిసారి మన ఒగ్గుడోలు కళను ప్రదర్శించనున్నారు. ప్రఖ్యాత కళాకారుడు డాక్టర్ ఒగ్గు రవి నేతృత్వంలోని 30 మంది బృందం ఈ చారిత్రక అవకాశం దక్కించుకుంది. ఢిల్లీలో తీవ్రమైన చలిని సైతం లెక్కచేయకుండా 15 రోజులుగా ప్రాక్టీస్ చేస్తున్నారు. రాష్ట్రపతి, ప్రధాని సమక్షంలో తెలంగాణ జానపద కళా వైభవాన్ని చాటనున్నారు.