News June 3, 2024
వడదెబ్బతో మే నెలలో 56 మంది మృతి: కేంద్రం

మే నెలలో దేశవ్యాప్తంగా 56 మందికిపైగా వడదెబ్బ తగిలి ప్రాణాలు కోల్పోయినట్లు కేంద్రం వెల్లడించింది. మరో 24 మంది కూడా ఈ కారణంగానే చనిపోయి ఉంటారని అనుమానిస్తున్నట్లు తెలిపింది. గుండె సంబంధిత వ్యాధులతో 605 మంది మృతిచెందినట్లు వెల్లడించింది. వడదెబ్బకు సంబంధించి అత్యధికంగా మహారాష్ట్రలో 5,204 కేసులు నమోదయ్యాయని తెలిపింది. ఆ తర్వాత స్థానాల్లో రాజస్థాన్ (4,357), ఏపీ (2,183) ఉన్నట్లు పేర్కొంది.
Similar News
News October 31, 2025
కేంద్ర సాయం వెంటనే అందేలా చూడాలి: CBN

AP: రైతులు నష్టపోకుండా పంటలను నీటి ముంపు నుంచి కాపాడాలని CM CBN అధికారులను ఆదేశించారు. శాటిలైట్ చిత్రాల ఆధారంగా ముంపు ప్రాంతాలను గుర్తించి శనివారం నాటికల్లా నీటిని మళ్లించాలని సూచించారు. పంట నష్టం ప్రాథమిక అంచనాల్ని తక్షణం రూపొందించాలన్నారు. కేంద్ర బృందాల్ని రప్పించి, అక్కడి నుంచి సాయం వెంటనే అందేలా చర్యలు తీసుకోవాలని పేర్కొన్నారు. సహాయక చర్యల్లో బాగా పనిచేసిన 100 మందిని సత్కరించాలని చెప్పారు.
News October 31, 2025
శివమ్ దూబే ‘అన్బీటెన్’ రికార్డుకు బ్రేక్

2019 నుంచి ఆల్రౌండర్ శివమ్ దూబే జట్టులో ఉన్న 37 T20Iల్లో భారత్ గెలిచింది. ఇవాళ ఆసీస్ చేతిలో ఓటమితో ఆ లాంగెస్ట్ అన్బీటెన్ రికార్డుకు బ్రేక్ పడింది. అలాగే 2021 నుంచి బుమ్రా ఆడిన 24 మ్యాచుల్లో టీమ్ ఇండియా గెలవగా ఇవాళ పరాజయం పాలయ్యింది. ఉగాండాకు చెందిన పస్కల్ మురుంగి(2022-24) 27*, మనీశ్ పాండే(2018-20) 20* రికార్డులు అలాగే ఉన్నాయి.
News October 31, 2025
హార్ట్ ఎటాక్ను నివారించే మందుకు FDA అనుమతి

హార్ట్ ఎటాక్, స్ట్రోక్ ప్రమాదాన్ని నివారించే Rybelsus మందుకు అమెరికన్ FDA ఆమోదం తెలిపింది. ఇది నోటితో తీసుకునే తొలి GLP-1 ఔషధం కావడం గమనార్హం. ప్రస్తుతం టైప్-2 డయాబెటిస్ రోగులు Rybelsusను వాడుతుండగా తాజాగా హృద్రోగులకూ విస్తరించారు. రక్తంలో చక్కెర స్థాయులు, ఆకలిని అదుపులో ఉంచడంతోపాటు గుండెపోటుకు ప్రధాన కారణాలైన రక్తనాళాల వాపు(ఆర్టీరియల్ ఇన్ఫ్లమేషన్), ఆక్సిడేటివ్ స్ట్రెస్ను ఇది తగ్గిస్తుంది.


