News September 26, 2024

రెండో విడతలో 56శాతం పోలింగ్ నమోదు

image

జమ్మూకశ్మీర్‌లో రెండో విడత పోలింగ్‌ ప్రశాంతంగా ముగిసింది. 56% ఓటింగ్ నమోదైందని, ఎక్కడా రీపోలింగ్ అవసరం లేదని చీఫ్ ఎలక్టోరల్ ఆఫీసర్ పీకే పోల్ తెలిపారు. శ్రీమాతా వైష్ణోదేవీ సీటులో అత్యధికంగా 75.29% పోలింగ్ నమోదైనట్లు పేర్కొన్నారు. 72.71% పోలింగ్‌తో పూంచ్ హవేలీ రెండో స్థానంలో నిలిచింది. SEP 18న జరిగిన తొలి విడతలో 59% పోలింగ్ నమోదైంది. మూడో విడత OCT 1న జరగనుంది. 8వ తేదీన ఫలితాలు విడుదల కానున్నాయి.

Similar News

News October 19, 2025

స్పోర్ట్స్ రౌండప్

image

* ప్రో కబడ్డీ సీజన్-12లో ప్లేఆఫ్స్ చేరిన తెలుగు టైటాన్స్.. 18 పాయింట్లతో ప్లేఆఫ్స్‌కు క్వాలిఫై
* ఇవాళ WWCలో ఇంగ్లండ్‌తో తలపడనున్న భారత జట్టు.. సెమీస్ రేసులో కొనసాగాలంటే టీమ్ ఇండియాకు ఈ విజయం కీలకం.. ఇప్పటికే సెమీస్ చేరిన ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికా
* వరల్డ్ జూనియర్ బ్యాడ్మింటన్‌ ఛాంపియన్ షిప్‌లో ఫైనల్ చేరిన భారత షట్లర్ తన్వీ శర్మ.. నేడు థాయ్‌లాండ్ ప్లేయర్ అన్యాపత్‌తో అమీతుమీ

News October 19, 2025

ధన్వంతరీ ఎవరు?

image

క్షీరసాగర మథనంలో జన్మించిన వారిలో ధన్వంతరి ఒకరు. ఆయన మహా విష్ణువు అంశ. ఆశ్వయుజ బహుళ త్రయోదశి నాడు ఆయన జన్మించారు. అందుకే ఆ రోజును ధన్వంతరి జయంతిగా జరుపుకొంటాం. బ్రహ్మవైవర్త పురాణం ప్రకారం.. ధన్వంతరి, సూర్యభగవానుడి వద్ద ఆయుర్వేద జ్ఞానాన్ని పొందిన 16 మంది శిష్యులలో ఒకరు. ఆయుర్వేదానికి, ఆరోగ్యానికి దైవంగా పూజించే ఆయనను స్మరించడం, ఆరాధించడం సకల రోగాల విముక్తిని, సంపూర్ణ ఆరోగ్యాన్ని ప్రసాదిస్తుంది.

News October 19, 2025

ALERT.. ఈ జిల్లాల్లో వర్షాలు

image

ఏపీలో ఇవాళ పలు జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని APSDMA తెలిపింది. శ్రీకాకుళం, విజయనగరం, కోనసీమ, ఉభయ గోదావరి, ఏలూరు, కృష్ణా, NTR, గుంటూరు, బాపట్ల, పల్నాడు, ప్రకాశం, నెల్లూరు, అనంతపురం, చిత్తూరు, తిరుపతిలో పడే అవకాశం ఉందని పేర్కొంది. అటు TGలోని కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, ఉమ్మడి MBNRలో రేపు 8.30amలోపు ఉరుములతో కూడిన వర్షాలు పడుతాయని IMD ఎల్లో అలర్ట్ జారీ చేసింది.