News January 6, 2025
మహిళ పొట్టలో 58 డ్రగ్ క్యాప్సుల్స్

బ్రెజిల్కు చెందిన ఇద్దరు డ్రగ్స్ స్మగ్లింగ్ చేస్తూ ఢిల్లీ ఎయిర్పోర్టులో పట్టుబడ్డారు. డ్రగ్ క్యాప్సుల్స్ మింగిన వీరిని కస్టమ్స్ టీం గుర్తించగా, ప్రాథమిక విచారణలో కొన్నింటిని నిందితులే వెలికితీశారు. ఆపై ఆస్పత్రికి తరలించి శస్త్ర చికిత్స చేసి పురుషుడి కడుపులోనుంచి 937గ్రా.బరువున్న 105, మహిళ నుంచి 562గ్రా. 58 క్యాప్సుల్స్ బయటకు తీశారు. వీటి విలువ రూ.20cr ఉంటుందని అధికారులు చెప్పారు.
Similar News
News November 25, 2025
ఆకుకూరల సాగు- అనువైన నేలలు, వాతావరణం

తక్కువ సమయంలో రైతు చేతికొచ్చి, నిరంతరం ఆదాయం అందించే పంటల్లో ఆకుకూరలు ముందుంటాయి. ఆకుకూరలను మురుగు నీరు ఇంకిపోయే అన్ని రకాల నేలల్లో సాగు చేయవచ్చు. నేల ఉదజని సూచిక 6.0 నుంచి 7.5గా ఉండాలి. వానాకాలం, వేసవి కాలం, 16 నుంచి 35 డిగ్రీల సెంటీగ్రేడ్ ఉష్ణోగ్రత ఉన్న సమయం ఆకుకూరల పంటలు పెరగడానికి అత్యంత అనుకూలం. 15 డిగ్రీల కంటే తక్కువ ఉష్ణోగ్రత ఉంటే తోటకూరను సాగు చేయడం కష్టం.
News November 25, 2025
మేము లడ్డూ క్వాలిటీ విషయంలో రాజీపడలేదు: సజ్జల

AP: వైసీపీని టార్గెట్ చేస్తూ తిరుమల లడ్డూ విచారణ జరుగుతోందని వైసీపీ నేత సజ్జల అన్నారు. ‘కల్తీ నెయ్యి విచారణ పారదర్శకంగా జరగడం లేదు. మేము లడ్డూ క్వాలిటీ విషయంలో రాజీపడలేదు. సీఎం చంద్రబాబు డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారు. అప్పుడు ఇవే కంపెనీలు, ఇప్పుడూ ఇవే కంపెనీలు నెయ్యి సప్లై చేస్తున్నాయి.. నెయ్యి కల్తీకి ఎక్కడ అవకాశం ఉంది’ అని ప్రెస్ మీట్లో ప్రశ్నించారు.
News November 25, 2025
4th Day స్టంప్స్.. కష్టాల్లో టీమ్ ఇండియా

భారత్-సౌతాఫ్రికా రెండో టెస్టు నాలుగో రోజు ఆట ముగిసింది. 549 పరుగుల భారీ లక్ష్యంతో రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన టీమ్ ఇండియా రెండు వికెట్లు కోల్పోయి 27 పరుగులు చేసింది. జైస్వాల్, రాహుల్ ఔటయ్యారు. సాయి సుదర్శన్, కుల్దీప్ క్రీజులో ఉన్నారు. భారత్ విజయానికి చివరి రోజు మరో 522 రన్స్ అవసరం. మరి ఈ మ్యాచులో ఎవరు గెలుస్తారో కామెంట్ చేయండి.


