News May 21, 2024
మూడేళ్లలో 58 లక్షల చెట్లు నరికేశారు

2019-22 మధ్య దేశవ్యాప్తంగా వ్యవసాయ భూముల్లోని 58 లక్షల వృక్షాలను నరికేసినట్లు ఓ అధ్యయనంలో వెల్లడైంది. మధ్య భారతం, ముఖ్యంగా మహారాష్ట్ర, తెలంగాణలో ఈ కోత ఎక్కువగా ఉన్నట్లు తేలింది. 2010-11 మధ్య శాటిలైట్ ఇమేజ్ల ఆధారంగా 600 మిలియన్ల చెట్లను గుర్తించగా, వాటిలో 11% కనుమరుగయ్యాయని సైంటిస్టులు చెప్పారు. వరి, ధాన్యాల సాగు కోసమే ఈ పనిచేసినట్లు పేర్కొన్నారు. దీనివల్ల జీవవైవిధ్యానికి ముప్పు ఉందని తెలిపారు.
Similar News
News October 29, 2025
ఇతిహాసాలు క్విజ్ – 50 సమాధానాలు

1. తులసి దేవికి పూర్వ జన్మలో ఉన్న పేరు ‘బృందా దేవి’.
2. త్రిపురాంతకుడు అంటే ‘పరమ శివుడు’.
3. కర్ణుడి కవచకుండలాలను దానం చేయమని కోరిన దేవుడు ‘ఇంద్రుడు’.
4. వాక్కుకు అధిష్టాన దేవత వాగ్దేవి. అంటే సరస్వతీ దేవి.
5. పరశురాముడు తన తల్లి తలను తండ్రి ‘జమదగ్ని’ ఆజ్ఞ మేరకు నరికాడు.
<<-se>>#Ithihasaluquiz<<>>
News October 29, 2025
హైదరాబాద్లో అతిపెద్ద మెక్ డొనాల్డ్స్ కేంద్రం ప్రారంభం

అంతర్జాతీయ ఫాస్ట్ ఫుడ్ దిగ్గజం ‘మెక్ డొనాల్డ్స్’ 1.56 లక్షల స్క్వేర్ ఫీట్ల విస్తీర్ణంలో ‘గ్లోబల్ ఆఫీస్(గ్లోబల్ క్యాపబిలిటీ సెంటర్)’ను HYDలో ఏర్పాటు చేసింది. డిప్యూటీ CM భట్టి, మంత్రి శ్రీధర్ బాబు దీన్ని ప్రారంభించారు. అమెరికా బయట మెక్ డొనాల్డ్స్కు ఇదే అతిపెద్ద కేంద్రం. ఇది ఆ కంపెనీ ఇన్నోవేషన్, ఎంటర్ప్రైస్ ఆపరేషన్స్కు ‘గ్లోబల్ హబ్’గా పని చేయనుంది. 1200 మంది(హై స్కిల్డ్)కి ఉపాధి లభించనుంది.
News October 29, 2025
కందలో అంతర పంటలు.. అంతర పంటగా కంద

కంద దుంపలు మొలకెత్తడానికి ఎక్కువ సమయం పడుతుంది కాబట్టి, తక్కువ కాలపరిమితి కలిగిన నువ్వు, మినుము, చిరుధాన్యాలు మొదలైన పంటలను అంతర పంటలుగా ఆయా ప్రాంతాలకు, కాలానికి తగిన విధంగా ఎంపిక చేసి సాగు చేసుకోవచ్చు. అలాగే పసుపులో మిశ్రమ పంటగా కందను వేసుకోవచ్చు. అరటి, కొబ్బరిలో అంతర పంటగా వేసి అదనపు ఆదాయాన్ని పొందవచ్చు. పసుపులో కూడా కందను అంతర పంటగా వేసి మంచి ఆదాయం పొందే అవకాశం ఉంది.


