News September 1, 2024

59 పునరావాస కేంద్రాల ఏర్పాటు: HYD కలెక్టర్

image

రానున్న రెండు రోజులు భారీ వర్షాలు పడే అవకాశం ఉన్నందున ప్రజలకు ఇబ్బందులు తలెత్తకుండా పటిష్ఠమైన చర్యలు చేపట్టాలని HYD కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి ఆదేశించారు. సోమవారం అన్ని ప్రభుత్వ పాఠశాలలకు సెలవు ప్రకటించినట్లు తెలిపారు. ఇప్పటికే 59 పునరావాస కేంద్రాలను ఏర్పాటు చేశామన్నారు. ప్రజలు నిరంతరం అప్రమత్తంగా ఉండాలని సూచించారు.

Similar News

News September 16, 2025

డ్రగ్స్ తయారీలో పట్టువదలని విక్రమార్కుడు జయప్రకాశ్

image

ఓల్డ్ బోయినపల్లిలోని మేధా స్కూల్ నిర్వాహకుడు ఎలాగైనా డబ్బు సంపాదించాలని డ్రగ్స్ తయారీకి తెరలేపాడు. ఆల్ర్ఫాజోలం ఎలాగైనా తయారు చేయాలని నిర్ణయించుకున్నాడు. 1, 2 సార్లు విఫలమైతే కొందరు దానిని ఆపేస్తారు. ఎలాగైనా తయారుచేయాలని నిర్ణయించుకున్నాడు. అలా 6 సార్లు ఫెయిలయ్యాడు. చివరికి ఏడోసారి సక్సస్ అయ్యాడు. ఇక అప్పటి నుంచి దందా నిరాటంకంగా కొనసాగించాడని పోలీసులు రిమాండు రిపోర్టులో పేర్కొన్నట్లు సమాచారం.

News September 16, 2025

MIM- జూబ్లీహిల్స్ ఎన్నికలతో బిహార్ ఎన్నికలకు లింక్

image

బిహార్ ఎన్నికలకు, జూబ్లిహిల్స్ ఉపఎన్నికలకు అధికారికంగా లింకు లేకపోయినా MIM మాత్రం లింక్ పెడుతోంది. బిహార్‌లో కాంగ్రెస్, ఆర్జేడీ కలిసి హాఘట్ బంధన్ కూటమిని ఏర్పాటు చేస్తున్నాయి. అందులో MIM చేరితే ఇక్కడ ఆ పార్టీ పోటీలో ఉండకకపోవచ్చు. ఒకవేళ కూటమిలో చేరకపోతే MIM కచ్చితంగా పోటీచేస్తుంది. ఇదీ MIM అధినేత ఆలోచన అని సమాచారం. ఈ పొలిటికల్ ఈక్వేషన్ క్లారిటీ కోసం కొద్ది రోజులు ఆగాల్సిందే.

News September 16, 2025

మహానగరంలో ఇవీ మా సమస్యలు

image

గ్రేటర్ వ్యాప్తంగా నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో తమ సమస్యలు పరిష్కరించాలని 219 మంది వినతిపత్రాలు అందజేశారు. జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయంలో 68 వివిధ సమస్యలపై ఫిర్యాదుచేశారు. అలాగే గ్రేటర్ పరిధిలోఉన్న ఆరు జోన్లలో 151 ఫిర్యాదులు వచ్చాయి. కూకట్‌పల్లిజోన్‌లో 55, సికింద్రాబాద్ 33, శేరిలింగంపల్లి 30, ఎల్బీనగర్ 15, చార్మినార్ 11, ఖైరతాబాద్ 7 ఫిర్యాదులు వచ్చాయని GHMC అధికారులు తెలిపారు.